వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక ప్రకటన

నవతెలంగాణ – హైదరాబాద్: భూసార పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  అన్నారు. 25 భూసార పరిక్షా కేంద్రాలను త్వరగా అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. భూసార పరీక్షలతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. మట్టి నమునా ద్వారా నేల స్వభావం తెలుసుకొని అందుకనుగుణంగా పంటలు వేసి అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. వీటిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

Spread the love