శక్తివంతమైన భావోద్వేగాలతో అహింస : వెంకటేష్‌

తేజ దర్శకత్వంలో అభిరామ్‌ హీరోగా అరంగేట్రం చేస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అహింస’. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయిక.
జూన్‌ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకటేష్‌ మాట్లాడుతూ, ‘యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌తో దర్శకుడు తేజ చాలా గొప్ప విజయాలు అందుకున్నారు. ‘అహింస’ కూడా అన్ని ఎమోషన్స్‌ ఉన్న యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌. కొత్త నటీనటులు నుంచి పవర్‌ ఫుల్‌ ఎమోషన్స్‌ క్యాప్చర్‌ చేశారు తేజ. ఎవరూ చూడని అద్భుతమైన లోకేషన్స్‌లో తీసిన సినిమా ఇది. ఆర్పీ పట్నాయక్‌ వండర్‌ ఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. నిర్మాతగా కిరణ్‌ చిత్రానికి కావాల్సింది సమకూర్చారు. అభిరాం, గీతిక సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు’ అని అన్నారు. ‘వెంకటేష్‌ రావడం వలన సినిమాకి వాల్యూ పెరిగింది. కొన్ని వందల మందికి అవకాశాలు ఇచ్చిన రామానాయడు గారి కోరిక మీద ఈ సినిమా తీశాను. అభితో సినిమా చేయడానికి ఆయనే ప్రధాన కారణం. రామానాయడు గారి ఆశీర్వాదంతో ఈ సినిమా బాగా ఆడుతుందని నమ్ముతున్నాను’ అని దర్శకుడు తేజ చెప్పారు. హీరో అభిరామ్‌ మాట్లాడుతూ, ‘ఇంత మంచి సినిమా ఇచ్చిన తేజకి, అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చిన ఆర్పీకి, నిర్మాత కిరణ్‌కి కతజ్ఞతలు. ఈ సినిమా నాకు మంచి హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. నిర్మాత పి కిరణ్‌ మాట్లాడుతూ, ‘అహింసలో యాక్షన్‌ ఎంటర్‌టైన్మెంట్‌, లవ్‌ ..అన్నీ ఉన్నాయి. సినిమా ఖచ్చితంగా హిట్‌ అవుతుంది’ అని తెలిపారు.

Spread the love