నవతెలంగాణ – ఢిల్లీ : ఏపీ ఎన్నికల్లో పవన్ అఖండ విజయం సాధించినప్పటి నుంచి అకీరా తండ్రితోనే ఉంటున్నారు. అతడిని రాజకీయ ప్రముఖులకు పరిచయం చేస్తున్నారు పవన్. తాజాగా ప్రధాని మోడీని వీరు కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మోడీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో ఆనందంగా, ఎమోషనల్గా ఉంది. దానిని మాటల్లో వర్ణించలేను. మోడీని కలిశాక అకీరా నాకు ఫోన్ చేసి తన అనుభూతిని పంచుకున్నాడు అని పోస్టులో తెలిపింది.