వచ్చే టీ20 వరల్డ్​ కప్‌నకు అమెరికా ఆతిథ్యం..

నవతెవలంగాణ- హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్‌నకు ఆమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. వెస్టిండీస్‌తో పాటు అమెరికాలోని మూడు నగరాల్లో ప్రపంచ కప్ మ్యాచులు నిర్వహించేందుకు ఐసీసీ అంగీకరించింది. ఈ మేరకు న్యూయార్క్, డల్లాస్, ఫ్లోరిడాలో కొన్ని మ్యాచులు జరుగుతాయని అధికారికంగా వెల్లడించింది. బ్రోవార్డ్ కౌంటీ (ఫ్లోరిడా), గ్రాండ్ పైరీ (డల్లాస్), ఐసన్ హోవర్ పార్క్ (న్యూయార్క్) స్టేడియాల్లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచును నిర్వహించనున్నారు. టీ20 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను వెస్టిండీస్‌తో పాటు తొలిసారి అమెరికాకు ఇచ్చామని ఐసీసీ వెల్లడించింది.  వచ్చే ఏడాది జరిగే టోర్నీలో మొత్తం 20 జట్లు బరిలోకి దిగనున్నాయి.

Spread the love