యాదాద్రి భువనగిరి జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నవతెలంగాణ- యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండల పరిధిలోని అనంతారం గ్రామ శివారులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది . స్థాని కులు సోమవారం కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అత‌న్ని ఎక్కడో చంపి, ఇక్కడ ప‌డేసి నిప్పంటించారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, మృతదేహం పక్కనే పూర్తిగా కాలిపోయిన బైక్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love