నవతెలంగాణ – ముంబయి: సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సోమవారం ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల్లో ఆయన భాజపాలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ పార్టీ తరఫున రాజ్యసభ టికెట్ దక్కనుందని సమాచారం. ప్రస్తుతం చవాన్.. భోకర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఆయన స్పీకర్కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సుమారు నెల రోజుల వ్యవధిలో మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ను వీడిన రెండో కీలక నేత ఈయన. కొద్దిరోజుల క్రితం కేంద్ర మాజీమంత్రి మిలింద్ దేవ్రా హస్తం పార్టీ నుంచి బయటకు వెళ్లి, ఏక్నాథ్ శిందే శివసేనలో చేరారు. అలాగే 48 ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగిన సీనియర్ నేత బాబా సిద్ధిక్.. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరిన సంగతి తెలిసిందే.