నవతెలంగాణ అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావుతో ప్రొటెం స్పీకర్ గోరింట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ఒకే నామినేషన్ దాఖలుతో స్పీకర్గా అయ్యన్నపాత్రుడి ఎన్నిక లాంఛనం కానుంది.