కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి

నవతెలంగాణ కొండగట్టు: కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శనివారం ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు తొలుత ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ కు వేదపండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఆయన ఆలయ పరిసరాల్లో ఉన్న భక్తులు, అభిమానులకు అభివాదం చేస్తూ నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కొండగట్టు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

Spread the love