– సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి
నవతెలంగాణ-ఖమ్మం
ఇంకొక 20 రోజుల్లో వర్షాకాలం వస్తున్నందున కాలువలన్నీ క్లీన్ చేయాలని, ఎక్కడెక్కడ కాలువలు పూడుకుపోయాయో లిస్టు ప్రిపేర్ చేసి తమకు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి ఆదేశించారు. సోమవారం ఖమ్మంలోని మున్సిపల్ కార్యాలయంలో సానిటరీ ఇన్స్పెక్టర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఎస్ఐ వారి డివిజన్లో ఎక్కడైతే వాటర్ ఆగుతున్నాయో వారి డివిజన్ వారిగా లిస్టు ప్రిపేర్ చేయాలని అన్నారు . ఎక్కడైతే కాలువల్లో చెత్త ఎక్కువగా పేరుకపోయి వాటర్ ఆగుతున్నాయనేది గుర్తించి వాటిని గ్యాంగ్ వర్క్ పెట్టి క్లీన్ చేసే ప్రదేశాలు ఏమిటి మిషనరీతో క్లీన్ చేసే ప్రదేశాలు ఏమి అనేది గుర్తించి డివిజన్ వారీగా కమిషనర్కి ఇవ్వాలని ఎస్ఐ ఆదేశించారు. డివిజన్లో పూడుకపోయినటు వంటి మెయిన్ కాలువలు అన్నింటిని గ్యాంగ్ వర్క్ పెట్టి శుభ్రపరచాలని చెప్పడం జరుగుతుందని, గ్యాంగ్ వర్క్స్తో కానీ ఎడల మిషనరీతో శుభ్రపరచాలని చెప్పడం జరిగిందని, కాలువల్లో ఎవరైతే చెత్త వేస్తున్నారని, వారికి గుర్తించి వారికి జరిమానా వేయాలని ఎస్ఐలకి ఆదేశించారు. ప్రతి ఎస్సై రోజుకి కాలువల్లో చెత్త వేసిన ప్రదేశాల్లో ఇంటి యజమానులకు ఎన్ని ఫైన్లు వేశారు అనేది స్వయంగా పరిశీలిస్తానని అన్నారు. రోడ్డు పక్కన పెట్టిన కొబ్బరి బోండాలు షాపుల వాళ్లు, ముంజకాయల వాళ్లు కాలువల్లో ఆ చెత్త వేసినా ఎడల వారికి ఫైన్ భారీగా విధించాలని ఆదేశించారు. అంతే ఖాళీగా చెత్త పేరుకుపోయినటువంటి ప్లాట్ ఓనర్స్ అందరికీ శుభ్రపరచాలని నోటీసులు ఇవ్వాలని, శుభ్రపరచనా యెడల వారిపై చర్యలు చేపట్టాలని అన్నారు. వర్షాకాలం వస్తున్నందున ముందుగానే గ్యాంబూజా ఫిష్ని, ఆయిల్ బాల్స్ని సమకూర్చుకోవాలని అసిస్టెంట్ కమిషనర్ ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ సంపత్, ఎస్ఐలు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.