భారత్‌లో అసెంబ్లింగ్‌ ఫోన్లే..

– పిఎల్‌ఐ లోపాలే కారణం :ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రాజన్‌ వెల్లడి
న్యూఢిల్లీ: భారత్‌లో ఉత్పత్తి అవు తోన్న మొబైల్‌ ఫోన్లు అన్నీ అసెంబ్లింగ్‌ ద్వారా తయారు చేస్తున్నవేనని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. దేశంలో నిజమైన తయారీ కంటే అసెంబ్లింగ్‌ ద్వారానే ప్రధానంగా ఉత్పత్తి జరుగుతుందని రాజన్‌ ఓ పరి శోధన పత్రంలో పేర్కొన్నారు. ఇందుకు దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించ డానికి మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహ (పిఎల్‌ఐ) పథకం లోపాలే కారణమని విమర్శిం చారు. ”దేశంలో ఫోన్‌ను పూర్తి చేయడా నికి మాత్రమే సబ్సిడీ చెల్లించబడు తుంది. తయారీ ద్వారా ఎంత విలువ జోడించ బడుతుందనే దానిపై కాదు. ఫోన్ల ఉత్పత్తికి కావాల్సిన ముడి సరుకు లను పెద్ద మొత్తంలో దిగుమతి చేసు కుంటుంది. దీంతో నికర ఎగుమతుల్లో పెరుగుదల కష్టం.” అని రాజన్‌ పేర్కొ న్నారు. పిఎల్‌ఐ పథకం అర్హత కలిగిన కంపెనీలకు భారత్‌లో తయారు చేయ బడిన వస్తువుల అమ్మకాలపై తొలి ఏడాది 4 శాతం నుండి 6 శాతం వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ ప్రోత్సాహకం ఐదేళ్లపాటు వర్తిస్తుంది.

Spread the love