
నవతెలంగాణ హైదరాబాద్: కన్నడ నటుడు ఉపేంద్రపై అట్రాసిటీ కేసు నమోదైంది. ‘ప్రజాకీయా’ వార్షికోత్సవంలో భాగంగా ఉపేంద్ర శనివారం ఫేస్బుక్, ఇన్స్టా లైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దళితులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ బెంగళూరులో కేసు నమోదు అయ్యింది. విమర్శకులను ఓ వర్గంతో పోలుస్తూ ఆయన సామెతలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో ఉపేంద్ర వ్యాఖ్యలు తమని ఆవేదనకు గురి చేశాయంటూ ఆదివారం బెంగళూరులోని చెన్నమన్నకేరే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఉపేంద్రపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు సౌత్ బెంగళూరు డీసీపీ కృష్ణకాంత్ తెలిపారు.