ఆర్టీసీ బస్సుపై దుండగుల దాడి.. ఎం.డి సజ్జనారీ స్ట్రాంగ్ వార్నింగ్

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలో బైకులపై వచ్చిన కొందరు దుండగులు ఆర్టీసీ బస్సుపై దాడి చేశారని, పోలీస్ వారి సహకారంతో వారిపై హిస్టరీ షీట్స్ తెరుస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. బస్సుపై దాడికి సంబందించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన ఘటనపై తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌ శివారులోని రాచలూరు గేట్‌ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సుపై ఇవాళ కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి దాడి చేశారని, ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయని, అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న తమ బస్సులపై ఎలాంటి కారణం లేకుండా దాడులు చేయడాన్ని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదని. ఆర్టీసీ బస్సుపై దాడిని తీవ్రంగా పరిగణిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్‌ మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగిందని, పోలీసులు దర్యాప్తునూ ప్రారంభించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.

Spread the love