వారికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రేక్షకులకు సదా రుణపడి ఉంటాను” అని అగ్ర కథానాయకుడు బాలకృష్ణ అన్నారు. సినీ రంగానికి చేసిన సేవలకుగానూ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌ను ప్రకటించింది. దీనిపై బాలయ్య స్పందించారు. ” నాకు పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్‌ చలనచిత్ర రంగానికీ నా ధన్యవాదాలు. నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై విశేష ఆదరాభిమానాలు కురిపిస్తున్న ప్రేక్షకులకు సదా రుణపడి ఉంటాను ” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలందరికీ ఆయన అభినందనలు తెలియచేశారు.

Spread the love