నవతెలంగాణ – హైదరాబాద్: బండి సంజయ్, కిషన్ రెడ్డిలు గురువారం కేంద్రమంత్రులుగా బాధ్యతలను స్వీకరించారు. ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.