నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు షిమ్రాన్ హెట్మెయర్కు బీసీసీఐ ఫైన్ విధించింది. హైదరాబాద్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించడంతో మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. కాగా అభిషేక్ శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాక హెట్మెయర్ స్టంప్స్ను బ్యాట్తో బాదేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అందుకే అతడికి జరిమానా విధించినట్లు సమాచారం.