ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌..భారత్‌ జట్టును ప్రకటించిన‌ బీసీసీఐ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌ : ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు భారత్‌ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మహ్మద్‌ షమీని జట్టులోకి తీసుకుంది.
టీమ్‌ఇండియా: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), సంజూ శాంసన్‌ (కీపర్), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, రింకూ సింగ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా, అర్షదీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ధ్రువ్‌ జురెల్‌. టీ20 సిరీస్‌ పూర్తయిన తర్వాత  ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.
ఊహించినట్లుగానే స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌ ముగిసిన వారంలోజుల్లోనే కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్, ఇంగ్లాండ్ ఐదు టీ20ల సిరీస్ షెడ్యూల్ 

  • జనవరి 22 – తొలి టీ20 (కోల్‌కతా)
  • జనవరి 25 –  రెండో టీ20 (చెన్నై)
  • జనవరి 28 – మూడో టీ20 (రాజ్‌కోట్‌)
  • జనవరి 31 – నాలుగో టీ20 (పుణె)
  • ఫిబ్రవరి 2 – ఐదో టీ20 (ముంబయి)
    వన్డే సిరీస్ షెడ్యూల్ 
  • ఫిబ్రవరి 6 – తొలి వన్డే (నాగ్‌పుర్)
  • ఫిబ్రవరి 9 – రెండో వన్డే (కటక్)
  • ఫిబ్రవరి 12 – మూడో వన్డే (అహ్మదాబాద్)
Spread the love