19న చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్‌

Nara-Bhuvaneshwariనవతెలంగాణ – హైదరాబాద్
టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 19న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. పార్టీ వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు… ‘ఈనెల 18న భువనేశ్వరి కుప్పం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త చంద్రబాబు తరఫున 19వ తేదీ మధ్యాహ్నం 12.33 గంటలకు నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఊరేగింపు నిర్వహించాలని నియోజకవర్గ పార్టీ సంకల్పించింది. నామినేషన్‌ దాఖలుకు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రభంజనంలా తరలి రావాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆమేరకు పార్టీ సామాజిక మాధ్యమాల్లో టీడీపీ వర్గాలు శనివారం నుంచే విస్తృత ప్రచారం చేస్తున్నాయి.

Spread the love