బైకు, ట్రాలీ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ – జమ్మికుంట
బైకు, ట్రాలీ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన జమ్మికుంట పట్టణంలోని హుజురాబాద్ రోడ్డులో గల లారీ అసోసియేషన్ దగ్గర సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట నుండి హుజురాబాద్ వైపుకు బైక్ పై  ఇద్దరు వ్యక్తులు వెళ్ళుచుండగా, వే బ్రిడ్జి కాంటా వేసుకొని బయటకు వస్తున్న ట్రాలీ గమనించకుండా ,బైకు పై వస్తున్న వ్యక్తి ఢీకొనడంతో కమలాపూర్ మండలం మరిపెళ్లి గూడెం గ్రామానికి చెందిన కుమ్మరి కార్తీక్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే 108కు ఫోన్ చేయగా, హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి108 ద్వారా తరలించారు. కాగా వే బ్రిడ్జ్ కాంట వేసుకొని బయటికి వచ్చే సందర్భంలో రోడ్డు దగ్గరకు వచ్చేంతవరకు, మెయిన్ రోడ్డుపై వచ్చేటువంటి వాహనాలకు ఏర్పడడం లేదని ఇప్పటికీ ఈ నెలలో 4 ఆక్సిడెంట్లు జరిగాయని పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రమాద నివారణ  మార్గాలను చేపట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
Spread the love