– బీజాపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు..మరో ఇద్దరు మావోయిస్టుల మృతి
– వరుస కాల్పులతో దద్దరిల్లుతున్న దండకారణ్యం
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దండకారణ్యంలో మరోమారు ఎదురుకాల్పులు జరిగాయి. వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ అడవులు అట్టడుకుతోంది. మూడు రోజుల పాటు వరుస ఎన్కౌంటర్ జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, శుక్రవారం నేంద్రా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో డీఆర్జీ, సీఆర్పీఎఫ్, బస్తర్ ఫైటర్స్ గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు తారస పడటంతో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీనికి భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో యూనిఫాం ధరించిన ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. మృతిచెందిన వారిలో.. రూ.లక్ష రివార్డు కలిగిన ఏరియా సీఎన్ఎం అధ్యక్షులు కవ్వాసి అంగ, నేంద్ర ఆర్పీసీ జనతం సర్కార్ ఉపాధ్యక్షులు సోమద కల్ముగా పోలీసులు గుర్తించారు. వీరి మృతదేహాలతో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. కాగా, ఇటీవల బీజపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధి ముంగా అటవీప్రాంతం, గురువారం అంబూజ్మడ్-నారాయణ్ పూర్-దంతెవాడ సరిహద్దు ప్రాంతం, శుక్రవారం బీజాపూర్ జిల్లా బాసగూడ అటవీప్రాంతంలో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.