నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా మృతి చెందారు. సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అఖిల్ మిశ్రా మరణించారు. దీంతో బాలీవుడ్లో విషాదం ఛాయలు నెలకొన్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ఓ మూవీ షూటింగ్ లో పాల్గొన్న మిశ్రా.. ప్రమాదవశాత్తు బిల్డింగ్పై నుంచి కిందపడి చనిపోయినట్లు తెలుస్తోంది. షూటింగ్ కు సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు.