బీఆర్‌ఎస్‌ కార్యకర్త మృతి

నవతెలంగాణ-బెజ్జూర్‌
బెజ్జూర్‌ బీఆర్‌ఎస్‌ కార్యకర్త సూర్ల శంకర్‌(35) బుధవారం అనారోగ్యంతో బాధపడుతూ మహారాష్ట్రలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్‌ జీడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ప్రజా ప్రతినిధులు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం బీఆర్‌ఎస్‌ కార్యకర్త అంతిమయాత్రలో బీఎస్‌పీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి హర్షద్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

Spread the love