నవతెలంగాణ-బెజ్జూర్
బెజ్జూర్ బీఆర్ఎస్ కార్యకర్త సూర్ల శంకర్(35) బుధవారం అనారోగ్యంతో బాధపడుతూ మహారాష్ట్రలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ జీడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ప్రజా ప్రతినిధులు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్త అంతిమయాత్రలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి హర్షద్ హుస్సేన్ పాల్గొన్నారు.