రేపు మ‌ధ్యాహ్నం బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం

నవతెలంగాణ – హైద‌రాబాద్ : ఈ నెల 23న మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంద‌రూ హాజ‌రు కావాల‌ని పార్టీ అధి నాయ‌క‌త్వం ఆదేశాలు జారీ చేసింది. బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించ‌నున్నారు. ఈ నెల 23 నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్ ప్ర‌సంగం చేయ‌నున్నారు. అనంత‌రం స‌భ వాయిదా ప‌డ‌నుంది. బీఏసీ స‌మావేశంలో అసెంబ్లీ నిర్వ‌హ‌ణ తేదీల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు.

Spread the love