నవతెలంగాణ-కాగజ్నగర్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాలలో లోక్సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వచ్చే ఈ రెండు స్థానాలలో కూడా వివిధ పార్టీల నాయకులు ముమ్మర ప్రచారం చేపట్టారు. లోక్సభ బరిలో ఈ స్థానం నుండి 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటీ నెలకొని ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున సీఎం రేవంత్రెడ్డి ఆసిఫాబాద్కు వచ్చి ప్రచారం చేపట్టారు. బీజేపీ అభ్యర్థి గొడం నగేష్ తరపున ఆ పార్టీ అగ్రనేత అమిత్షా కాగజ్నగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఇద్దరు అధినేతల బహిరంగసభలు విజయవంతం కావడంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ రెండు పార్టీలకు చెందిన స్థానిక నేతలు కూడా ప్రతిరోజు ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ కోసం జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పలు పర్యాయాలు ఈ రెండు నియోజకవర్గాలలో పర్యటించి ప్రచార సభలలో పాల్గొన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్రావు, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యాంనాయక్, మాజీ ఎంపీపీ బాలేష్గౌడ్ తదితరులు ఆత్రం సుగుణ కోసం ప్రచారం చేపడుతుండగా, సిర్పూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్తో పాటు జెడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు ప్రచారం చేపడుతున్నారు. తాజాగా బుధవారం మంత్రి సీతక్క సిర్పూరు నియోజకవర్గంలో పర్యటించి ఆయా ప్రచార సభలలో పాల్గొన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి గొడం నగేష్ తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కొత్తపల్లి శ్రీనివాస్తో కలిసి ఇటీవలే పార్టీలో చేరిన జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు ప్రచారంలో పాల్గొంటున్నారు. సిర్పూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్బాబు ప్రతీ రోజు ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభలలో పాల్గొంటున్నారు. ఈ నెల పదో తేదీన బీజేపీ రాష్ట్ర నాయకుడు చీకోటి ప్రవీణ్ కాగజ్నగర్లో ప్రచారానికి రానున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు తెలిపారు.
బీఆర్ఎస్కు అన్నీ తామై…
ఇక భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఆత్రం సక్కుకు ఎమ్మెల్సీ దండె విఠల్తో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిలు అన్నీ తామై ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రచారంలో పాల్గొంటుండగా, సిర్పూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దండె విఠల్ ప్రచారం చేపడుతున్నారు. ఈ పార్టీ నుండి ఇప్పటి వరకు రాష్ట్ర నాయకత్వం ప్రచారానికి రాలేదు. కాని తొమ్మిదో తేదీన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసిఫాబాద్కు రానున్నారు. స్థానికంగా నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొననున్నారు. కాగజ్నగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఒక పర్యాయం వచ్చి వెళ్లారు. అంతే తప్ప పెద్దగా రాష్ట్ర నాయకులు ఎవరూ ప్రచారానికి రాలేదు. కాగజ్నగర్లో సిర్పూరు పేపర్ మిల్లు పున:ప్రారంభంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఉన్నందున కేటీఆర్ను కాగజ్నగర్కు కూడా రప్పించి బహిరంగసభ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఎమ్మెల్సీ దండె విఠల్ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు కూడా పెద్దగా ఈ రెండు నియోజకవర్గాలలో పర్యటించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేస్తోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్ లోక్సభ సమరానికి సమయం దగ్గర పడింది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండగా.. పోలింగ్కు ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ క్రమంలో సమయం లేదు మిత్రమా అనే రీతిలో అభ్యర్థులు, ఆయా పార్టీలకు చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు అందరూ జనాల్లోనే ఉండటం ఆసక్తి రేపుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారపర్వంలోనే ఉంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సీటును ఎలాగైనా దక్కించుకొని పాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని బీజేపీ అనుకుంటోంది. ఈ సీటులో విజయం సాధించడం ద్వారా పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ భావించడం ఆసక్తికరంగా మారింది. మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పార్లమెంటుకు వెళ్లాలనే కుతూహలంతో పోటీ పడుతున్న అభ్యర్థులు ఎన్నికల్లో శ్రమించడం సహజం. కానీ వీరిని గెలిపించేందుకు ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు కష్టపడుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. ఓ వైపు ఎండలు మండిపోతున్నా ..అస్వస్థతకు గురవుతున్నా లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళ్లి ప్రచారంలో నిమగం కావడం ఆసక్తికరంగా మారింది. మరోపక్క అభ్యర్థి గెలిస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుందనే ఉద్దేశంతో ద్వితీయ శ్రేణి నాయకులు, ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
విజయమే లక్ష్యంగా ప్రణాళికలు..!
ఈ లోక్సభ స్థానాన్ని దక్కించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు నువ్వా- నేనా అనే రీతిలో పోటాపోటీగా ప్రచారం చేపడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆత్రం సుగుణను గెలిపేందుకు ఆ పార్టీ కీలక నేతలు ఆహర్నిశలు శ్రమిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అభ్యర్థి గెలుపు బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. కొన్ని రోజులుగా లోక్సభ పరిధిలోనే ఉంటూ ఊరూరా ప్రచారం చేపడుతున్నారు. మంత్రితో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఇటీవల పార్టీలో చేరిన ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వారి నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ విజయానికి దోహదం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో నిలవగా.. ఈయన గెలుపు కోసం మాజీ మంత్రి, పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్జాదవ్, కోవ లక్ష్మీతో పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన కీలక నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లోక్సభ పరిధిలో ప్రచారం నిర్వహిస్తూ అభ్యర్థి విజయం కోసం కృషిచేస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ మంత్రి గోడం నగేష్ బరిలో నిలవగా.. ఈయన విజయం కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, పాయల్శంకర్, రామారావుపటేల్, పాల్వాయి హరీష్బాబు శ్రమిస్తున్నారు. వీరితో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు సైతం ప్రచారపర్వంలో నిమగం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా అభ్యర్థి విజయమే లక్ష్యంగా ఆయా పార్టీల కీలక నేతలు, ముఖ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ వర్గాల మద్ధతు కూడగడుతూ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
రాలిందంతా పగిలింది: శ్రీనివాస్గౌడ్, రైతు శివ్వారం, జైపూర్.
రాళ్లవానతోపాటు గాలిదుమారంతో మామిడి పంట చేతికందకుండా పోయింది. చెట్టుకున్న 90 శాతం కాయ నేల రాలి పగిలి పోయింది. పశుగ్రాసానికి తప్పామార్కెట్కు తరలింలే వీలులేకుండా ఉంది. ప్రతి సంవత్సరం కోత దశలో మామిడి పంటను నష్టపోవల్సి వస్తుంది. శివ్వారం, పౌనూర్, వేలాల గ్రామ శివారుల మీదుగా రాళ్లతో కూడిన వర్షంతో మామిడి, వరి పంటలను తీవ్రంగా నష్టపోవల్సి వచ్చింది. అధికారులు వెటనే సర్వే చేపట్టి నష్ట పరిహారం ఇచ్చే విదంగా చూడాలి.
సుమారు 40 శాతం మామిడి పంటకు నష్టం: తిరుపతి, ఉధ్యానవ శాఖ అధికారి.
ఉమ్మడి జైపూర్ మండలంలో కురిసిన అకాలవర్షంతో సాగులోని మామిడి పంట సుమారు 40 శాతం నష్టం వాటిలి ఉండవచ్చు. దాదాపుగా 50 శాతం మామిడి పంట చేతికందింది. మిగిఇ ఉన్న యాభై శాతంలో అత్యధికంగా పంటకు నష్టం జరిగినట్లు గుర్తించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంటలకు జరిగిన నష్టాన్ని గుర్తించేందకు క్షేత్రస్థాయి నివేధికలు సిద్ధం చేస్తున్నాం.
నష్టం అంచనా వేస్తున్నాం: మార్క్గ్లాడ్సన్, వ్యవసాయ అధికారి.
మంగళవారం కురిసిన వడగళ్ల వానతో పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ప్రాథమికంగా సేకరించిన సమాచారాన్ని అధికారులకు నివేధించి ప్రభుత్వ నిర్ణయం మేరకు పూర్తి స్థాయిలో నివేధికలు తయారు చేయనున్నాం. ఆలస్యంగా సాగు చేసిన వరి పంటలకు నష్టం జరిగింది. ఉమ్మడి జైపూర్ మండలంలో 650 నుండి 700 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయి రిపోర్టు తీసుకోవల్సి ఉంది.
ప్రతి ఏటా ఇదే గోస: సందెల తిరుపతి, రైతు ఆర్కెపల్లి, భీమారం
ప్రతి సంవత్సరం ప్రకృతి ప్రకోపానికి గురి కావల్సి వస్తోంది.. వర్షం పాక్షికంగా కురిసినా గాలి వేటు పంటలను అతలాకుతలం చేసింది. నలువైపుల నుండి బలంగా వీచ్చిన గాలిదుమారంతో ఇటు నుండి అటు నుండి వరి పైరు పడిపోయింది. పైరు కోయాలనుకున్నా హార్వేస్టర్ పంటికి అందేటట్టు లేదు..మనుషులతో కోపియ్యాలంటే ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తుంది…నిలాటు పొలాన్ని గంటలో కోసే హార్వేస్టర్ పడిపోయిన పొలంలో రెండు గంటలు కోయాల్సి వస్తోంది. గాలివేటుకు పడిపోయిన పంట పొలంలో దిగుబడి శాతం తగ్గడమే కాకుండా హార్వేస్టర్ చార్జీలు అదనంగా నష్టపోవల్సి వస్తుంది.