Business Archives -
https://navatelangana.com/category/business/
Wed, 08 May 2024 15:21:56 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.2.2https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.pngBusiness Archives -
https://navatelangana.com/category/business/
3232రచన బహదూర్ను సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ – ఇండియాగా ప్రకటించిన సింక్రోనీ
https://navatelangana.com/synchrony-announced-rachna-bahadur-as-senior-vice-president-country-head-india/
Wed, 08 May 2024 15:21:21 +0000https://navatelangana.com/?p=286418నవతెలంగాణ హైదరాబాద్: సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ( SVP) , కంట్రీ హెడ్ – ఇండియాగా రచనా బహదూర్ ను నియమించినట్లు సింక్రోనీ వెల్లడించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు బ్యాంకింగ్ పరిశ్రమలో 30 ఏళ్ళకు పైగా స్ఫూర్తిదాయక కెరీర్తో, సింక్రోనీలో తన కొత్త భాద్యత లకు అనుభవాన్ని మరియు నాయకత్వాన్ని రచన తీసుకువచ్చారు.
రచన బహదూర్ గోల్డ్మన్ సాక్స్, జెపి మోర్గాన్ చేజ్ మరియు మోర్గాన్ స్టాన్లీతో సహా ప్రపంచంలోని కొన్ని ప్రముఖ ఆర్థిక సంస్థలలో ముఖ్యమైన పదవులను నిర్వహించారు. ప్రోడక్ట్ మరియు రిస్క్ మేనేజ్మెంట్, కంట్రోలర్షిప్ మరియు ఆపరేషన్స్ ఫంక్షన్లు అలాగే అనేక భారీ-స్థాయి సాంకేతిక పునరుద్ధరణలకు నాయకత్వం వహించడం వంటి అంశాలపై రచన దృష్టి సారించారు. ఆమె గత 18 సంవత్సరాలుగా యుఎస్ , ఆసియా మరియు యూరప్లోని విభిన్న ప్రాంతాలలో వివిధ సీనియర్ గ్లోబల్ లీడర్షిప్ స్థానాలను నిర్వహించారు.
సింక్రోనీలో చేరడానికి ముందు, ఆమె గోల్డ్మన్ సాచ్స్లో మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు, అక్కడ ఆమె భారతదేశ వ్యాప్త కార్యకలాపాలకు సహ-నాయకత్వం వహించటం తో పాటుగా ఇండియా అసెట్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ విభాగానికి నాయకత్వం వహించారు.
సింక్రోనీ యొక్క మొత్తం భారతదేశ కార్యకలాపాలను నడిపించడానికి మరియు నిర్వహించడానికి రచన బాధ్యత వహిస్తారు. ప్రాసెస్ ఎక్సలెన్స్, యాజమాన్యం, ఆలోచనాత్మక పరివర్తనను నడపడం మరియు సహకార సంస్కృతిని పెంపొందించడం ద్వారా సింక్రోనీ ఇండియాను మార్చడానికి వ్యూహాత్మక ప్రణాళికను అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం ఆమె బాధ్యత. ఆమె నియామకం గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో శ్రేష్ఠత మరియు ఆవిష్కరణలకు సింక్రోనీ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
సమ్మిళితత మరియు వైవిధ్యం కోసం రచన కృషి చేస్తుంటారు, ఇది ఒక సహాయక మరియు విభిన్నమైన కార్యాలయాన్ని సృష్టించడానికి సింక్రోనీ యొక్క లక్ష్యంతో సమలేఖనం చేసే విలువ. ఆమె న్యూయార్క్లోని బరూచ్ కాలేజీ నుండి BBA చేశారు మరియు ఆమె సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. “మా నాయకత్వ బృందానికి రచన బహదూర్ను స్వాగతిస్తున్నందుకు మేము థ్రిల్గా ఉన్నాము” అని హ్యూమన్ రిసోర్సెస్ – ఆసియా ఎస్ విపి గౌరవ్ సెహగల్ అన్నారు. “మేము మా సేవలను మెరుగుపరచడం మరియు మా పరిధిని విస్తరింపజేయడం కొనసాగిస్తున్నందున, వ్యూహాత్మక నాయకత్వం మరియు వివిధ గ్లోబల్ మార్కెట్లలో కార్యాచరణ నైపుణ్యానికి నిబద్ధత యొక్క ఆమె నిరూపితమైన ట్రాక్ రికార్డ్ అమూల్యమైనది” అని అన్నారు
]]>ఈ వేసవిలో బాదం పప్పులను మీ ఆహారంలో భాగం చేసుకోండి
https://navatelangana.com/make-almonds-a-part-of-your-diet-this-summer/
Wed, 08 May 2024 15:14:27 +0000https://navatelangana.com/?p=286409 – చర్మ ఆరోగ్యాన్ని కాపడుకోండి డాక్టర్ గీతిక మిట్టల్, స్కిన్ ఎక్స్ పర్ట్ మరియు కాస్మటాలజిస్ట్ నవతెలంగాణ హైదరాబాద్: మండే వేసవి తరచుగా చర్మ సౌందర్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎండలో తిరగడం వల్ల చర్మ నల్లబడడం, కమిలిపోవడం లాంటివి జరుగుతుంది. అందువల్ల చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు కొన్ని ఆహార పదార్థాలను ఈ వేసివలో మన ఆహారంలో భాగంగా మార్చుకోవాలి. ఎంతో అనుభవం ఉన్న చర్మ నిపుణురాలిగా నేను కొన్ని పద్ధతుల్ని పాటిస్తాను. అవి పాటిస్తే చర్మ లోపలే కాదు బయట కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. నా క్లయింట్ లకు కూడా నేను ఎక్కువగా చెప్పేది ఇదే. వాటిల్లో మొదటిది, అత్యంత ప్రతిభావంతమైనది.. సమతుల ఆహారపు అలవాట్లను అవలంబించడం. ఎందుకంటే అందం అనేది బాహ్య సౌందర్యం కాదు. అది లోపలి నుంచి ఉంటుంది. మనం లోపల ఎంత ఆరోగ్యంగా ఉంటే బయట అంత అందంగా కన్పిస్తాము. అయితే మారుతున్న వాతావరణంలో అద్భుతమైన చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ కొన్ని ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. ప్రతీరోజూ గుప్పెడు బాదం పప్పులు – బాదం అనేది పోషకాలు అధికంగా ఉండే గింజ. ఇందులో మెగ్నీషియం, ప్రొటీన్, రిబోఫ్లావిన్, జింక్ మొదలైన 15 పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E (ఆల్ఫా-టోకోఫెరోల్) ఉంటాయి.
అన్నింటికి మించి ఇది వృద్ధాప్య ఛాయలన తగ్గిస్తుందని నిరూపితం కూడా అయ్యింది. బాదం పప్పులు చర్మ ఆరోగ్యానికి అద్భుతంగా మేలు చేస్తాయి. అన్నింటికి మించి ఈ బాదం పప్పుల్ని వివిధ రకాలుగా వాడుకోవచ్చు మరియు ఇతర పప్పులు లేదా పండ్లతో కలిపి కూడా తినవచ్చు లేదా బాదం మిల్క్ రూపంలో కూడా తీసుకోవచ్చు. మీరు చేయాల్సిందే ఒక్కటే… బాదం పప్పుల్ని లైట్ గా వేడి చేసి, చల్లారిన తర్వాత వాటిని తురుముకుని చిన్న చిన్న ముక్కలుగా కూడా వాడుకోవచ్చు. మొలకెత్తిన విత్తనాలు – మొలకెత్తిన విత్తనాలు అద్భుతమైన ఆహారం. అన్నింటికి మించి ఇదొక అద్భుతమైన స్నాక్ ఐటెమ్. వీటిని మీ సాయంత్రం అల్పాహారంగా లేదా ఆఫీసు విరామ సమయంలో తినొచ్చు. ఇందులో విటమిన్లు మరియు మినరల్స్ తో పాటు ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు కలిపి ఇంకా తినేలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ గూగుల్ చేసి మీకు తెలుసుకోవచ్చు. అయితే సలాడ్ల నుండి వ్రాప్స్ వరకు మీ ఆహారంలో ఈ పోషకాలు మెండుగా కలిగిన ఆహారం కచ్చితంగా ఉండాలి. తద్వారా మీ ఆరోగ్యంతో పాటు మీ నోటికి రుచికరమైన ఆహారం కూడా అందినట్లు అవుతుంది. విటమిన్-సి ఎక్కువగా లభించే పండ్లు – నారింజ, బత్తాయి, ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఈ వేసవిలో విరివిగా తీసుకోండి. మీకు ఇష్టమైన పండ్లతో కలిపి ఇవి కూడా ఒక ప్రూట్ బౌల్ లా మార్చుకుని తినవచ్చు. వీటిని మరింత ఆసక్తికరంగా చేయడానికి, మీరు బాదం వంటి గార్నిష్లను జోడించవచ్చు. విటమిన్లు E మరియు C యొక్క మిశ్రమం విటమిన్ E యొక్క క్రియాశీలతకు సహాయపడుతుంది, ఇది రసాయన చికాకులు మరియు UV-ప్రేరిత చికాకు నుండి చర్మాన్ని కాపాడుతుంది.
]]>హైదరాబాద్లో ఆప్టిమా వెల్బీయింగ్ పేరిట ప్రత్యేకమైన ఓపీడీ (OPD) సబ్స్క్రిప్షన్ను ప్రారంభించిన హెచ్డీఎఫ్సీ ఎర్గో
https://navatelangana.com/hdfc-ergo-has-launched-a-unique-opd-subscription-called-optima-wellbeing-in-hyderabad/
Wed, 08 May 2024 15:02:34 +0000https://navatelangana.com/?p=286387ఓపీడీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎండ్-టు-ఎండ్ నగదు రహిత ఔట్ పేషెంట్ వైద్య సేవలు, డయాగ్నోస్టిక్స్ మరియు మందులపై 50% వరకు తగ్గింపును అందిస్తుంది నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్, హైదరాబాద్లో ఆప్టిమా వెల్బీయింగ్ను ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (OPD) సబ్స్క్రిప్షన్ ప్లాన్, ప్రారంభంలో ముంబయిలో ప్రారంభించగా, హైదరాబాద్తో పాటు ఢిల్లీ, గురుగ్రామ్, ఘజియాబాద్, బెంగళూరు, పుణె మరియు జైపూర్లకు విస్తరించారు. ఆప్టిమా వెల్బీయింగ్ అనేది కంపెనీ ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ ఆప్టిమా సెక్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్కి యాడ్-ఆన్ ఇన్సూరెన్స్ పరిష్కరణ కాగా, ఇది దేశంలోనే అత్యధిక రేటింగ్ పొందిన ఆరోగ్య నగదు పరిహారాన్ని అందించే బీమా ఉత్పత్తులలో ఒకటి.
భారతదేశంలో, out-of-pocket medical expenses మొత్తం ఆరోగ్య వ్యయంలో 45% కన్నా ఎక్కువగా ఉంటాయి. హెచ్డీఎఫ్సీ ఎర్గో ఆప్టిమా వెల్బీయింగ్లో, వినియోగదారులు నగదు రహిత సదుపాయాన్ని, అపరిమిత టెలి, వ్యక్తిగత కన్సల్టేషన్లు, డయాగ్నోస్టిక్స్ మరియు మందులపై 50% వరకు తగ్గింపుతో పాటు ఇంటివద్ద స్యాంపిల్ కలెక్షన్ సేవలను ఉచితంగా పొందవచ్చు.
హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ మరియు చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పార్థనిల్ ఘోష్ మాట్లాడుతూ, “ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలో కీలక భాగస్వామిగా, హెచ్డీఎఫ్సీ ఎర్గోలో మేము వినూత్నమైన ఆఫర్లతో, అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని వినియోగదారుల శ్రేయస్సును మెరుగుపరచేందుకు కట్టుబడి ఉన్నాము. ముంబయిలో 2023లో ప్రారంభించిన ఆప్టిమా వెల్బీయింగ్ను ఇప్పుడు మరో 7 నగరాలకు విస్తరిస్తున్నాము. ఎండ్-టు-ఎండ్ క్యాష్లెస్ మోడ్తో మా ఓపీడీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఆరోగ్య బీమాను, అందుబాటు ధరలో, సౌకర్యవంతంగా అందుబాటులోకి తీసుకువస్తుందని, ఆరోగ్య బీమాపై ప్రజల ‘నమ్మకాన్ని’ మరింతగా పెంచుతామన్న నమ్మకం తనకు ఉంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.
హెచ్డీఎఫ్సీ ఎర్గోను 2002లో ప్రారంభించగా, తన వినియోగదారులకు సౌలభ్యం, సౌకర్యాన్ని అందించేందుకు వినూత్న సాంకేతిక-ఎనేబుల్డ్ ఆరోగ్య బీమా ఉత్పత్తులు, పరిష్కారాలను స్థిరంగా అందిస్తోంది. కంపెనీ 6 ఆరోగ్య బీమా ఉత్పత్తులు, 2 సర్వీస్ అప్గ్రేడ్ల పాత్-బ్రేకింగ్ సూట్ను ప్రారంభించగా, ఇది వినియోగదారులకు ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మరియు అనిశ్చితులకు వ్యతిరేకంగా విస్తృత కవరేజీలను అందుకునేందుకు అనుమతిస్తుంది. అంతేకాకుండా, ఎన్ఆర్ఐ డిస్కౌంట్లు, ఉచిత నమూనా సేకరణతో అపరిమిత టెలి, ఫిజికల్ కన్సల్టేషన్లతో కూడిన ఓపీడీ ప్లాన్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులలో చేరేందుకు అనువైన గ్లోబల్ ట్రీట్మెంట్ వంటి ఫీచర్లతో భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన రిటైల్ ఆరోగ్య నష్టపరిహారం ఉత్పత్తులలో ఒకటైన ఆప్టిమా సెక్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను కంపెనీ అప్గ్రేడ్ చేసింది.
హెల్త్ కేర్ విధానంపై వినియోగదారుల ఆందోళనను పరిష్కరించేందుకు, వారికి విశ్వసనీయ సమాచారాన్ని అందించేందుకు కంపెనీ బీమా-ఆధారిత పర్యావరణ వ్యవస్థ ‘హియర్’ పేరిట ఒక ప్రత్యేకమైన ఒన్-స్టాప్ ప్లాట్ఫారమ్ను ఆవిష్కరించింది. హెల్త్ కార్నర్లో ఈ ప్లాట్ఫారమ్ వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన ఆరోగ్య, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలైన మధుమేహ నిర్వహణ పద్ధతులు, పేషెంట్-టు-పేషెంట్ కనెక్ట్ ఫీచర్ వంటి వాటితో సహాయం చేస్తుంది. ఇక్కడ వ్యక్తులు ఇలాంటి వైద్య విధానాలు చేయించుకున్న ఇతర వాలంటీర్లతో అనుసంధానం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
హెచ్డీఎఫ్సీ ఎర్గో తన ఆప్టిమా సెక్యూర్ ప్రొడక్ట్ ద్వారా వడ్డీ రహిత ఇన్స్టాల్మెంట్ ఆధారిత ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టి, భారతదేశంలో అగ్రగామిగా ఉంది. తద్వారా పాలసీదారులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. ఇది 12,000 మందికి పైగా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ ప్రదాతలతో నీ విస్తృత నెట్వర్క్ తన పాలసీదారులకు అడ్డంకులులేని-నగదు రహిత చికిత్సకు హామీ ఇస్తుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో (FY 23) యాక్సిడెంట్ మరియు హెల్త్ క్లెయిమ్ల కోసం చెప్పుకోదగిన క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99%తో, బీమాను డెమోక్రటైజ్ చేసేందుకు, సమర్థవంతమైన మరియు హైపర్ పర్సనలైజ్డ్ కస్టమర్-సెంట్రిక్ సేవలను అందించేందుకు కంపెనీ తన నిబద్ధతను చాటి చెబుతోంది.
]]>వెల్స్పన్ లివింగ్ బోర్డులోకి నయ్యా సాగ్గి
https://navatelangana.com/nayya-saggi-joins-the-board-of-welspun-living/
Tue, 07 May 2024 19:56:45 +0000https://navatelangana.com/?p=285795న్యూఢిల్లీ : హోమ్ టెక్స్టైల్స్, ప్లోరింగ్ సొల్యూషన్స్ సంస్థ వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ తమ ఇండిపెండెంట్ డైరెక్టర్గా నయ్యా సాగ్గిని నియమించినట్లు తెలిపింది. ఆమె ఈ హోదాలో నాలుగేళ్ల పాటు కొనసాగనుందని తెలిపింది. ప్రస్తుతం ఆమె గుడ్ గ్లామ్ గ్రూప్ కో ఫౌండర్, అధ్యక్షురాలుగా ఉన్నారని.. నయ్యా సాగ్గి బోర్డ్రూమ్కు అపారమైన అనుభవం, నైపుణ్యం తీసుకువస్తుందని వెల్స్పన్ ఆశాభావం వ్యక్తం చేసింది.
]]>ప్రయివేటు పెట్టుబడులు డీలా
https://navatelangana.com/dealing-with-private-investments/
Tue, 07 May 2024 19:55:41 +0000https://navatelangana.com/?p=285788– 2022-23లో 36 శాతానికి పతనం – కోవిడ్ నాటి కనిష్ట స్థాయికి క్షీణత – నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ గణంకాల వెల్లడి న్యూఢిల్లీ : మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు దూసుకుపోతున్నాయని.. మరోమారు మోడీ సర్కార్ అధికారంలోకి వస్తే మరింత అభివృద్థిని చూపెడుతామని ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో బిజెపి చేస్తున్న విస్తృత ప్రచారానికి వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు కోవిడ్ నాటి స్థాయికి పడిపోవడమే ఇందుకు నిదర్శనం. ఆర్థిక సంవత్సరం 2022-23లో ఇన్ఫ్రాస్ట్రక్షర్ రంగంలో ప్రయివేటు పెట్టుబడుల వాటా 36.2 శాతానికి క్షీణించిందని నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ గణంకాల్లో తేలింది. ఇంతక్రితం ఏడాది 2021-22లోనూ 36.3 శాతంగా ఉంది. ఏడాదికేడాదితో పోల్చితే 2022-23లో ప్రయివేటు ఫైనాన్సీయల్ కార్పొరేషన్స్ పెట్టుబడుల్లోనూ 0.7 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. ప్రభుత్వ ఫైనాన్స్యేతర లేదా ప్రభుత్వ రంగ కంపెనీల పెట్టుబడుల వాటా 9.4 శాతానికి తగ్గింది. ఇంతక్రితం 2021-22లో పిఎస్యుల పెట్టుబడులు 9.5 శాతంతో పోల్చితే స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. ఉత్పత్తి రంగంలో పిఎస్యుల పెట్టుబడుల్లో పెరుగుదల చోటు చేసుకుంది. ఈ విభాగంలో పిఎస్యుల వాటా వరుసగా 2018-19, 2019-20, 2020-21లో వరుసగా 9.7 శాతం, 10.2 శాతం, 11.6 శాతం చొప్పున పెరిగుతూ వచ్చింది. 2022-23లోనూ రియల్ ఎస్టేట్లో ప్రభుత్వ వాటా 13 శాతానికి పెరిగింది. ఇంతక్రితం 2021-22లో 12 శాతంగా ఉంది. 2023-24లోనూ ప్రయివేటు రంగ పెట్టుబడులు 15.3 శాతం క్షీణించాయని ఇటీవల ఇన్వెస్ట్మెంట్ ట్రాకింగ్ సంస్థ ప్రాజెక్ట్స్ టుడే ఓ రిపోర్ట్లో తెలిపింది. విదేశీ పెట్టుబడిదారులు కూడా దాదాపు మూడింట ఒక వంతు కొత్త ఖర్చులను తగ్గించారని తెలిపింది. దీని ఫలితంగా 2022-23లో నమోదైన దాదాపు రూ.37 లక్షల కోట్లతో పోలిస్తే కొత్త పెట్టుబడుల ప్రకటనల విలువ దాదాపు 5 శాతం తగ్గింది. తయారీ రంగంలో ప్రయివేటు రంగ పెట్టుబడి ప్రణాళికలలో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. ఇందులో ప్రతిపాదిత వ్యయాలు 2022-23లో రూ.19.85 లక్షల కోట్లతో పోల్చితే.. 2023-24 నాటికి రూ.11.9 లక్షల కోట్లకు పడిపోయాయని ‘ది హిందూ’ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. 2022-23లో తయారీ రంగంలో కొత్త పెట్టుబడులు దాదాపు 54 శాతం మేర తగ్గాయి. నీటిపారుదల, మైనింగ్లో పెట్టుబడులు వరుసగా 48.7 శాతం, 19.25 శాతం చొప్పున క్షీణించాయి. పెట్టుబడుల ద్వారానే కొత్త ఉద్యోగాలు సృష్టించబడుతాయి. దేశంలో ప్రజల ఆదాయాలు తగ్గడంతో సరుకులకు డిమాండ్ పడిపోవడంతో కంపెనీలు తమ విస్తరణ కార్యకలాపాలను తగ్గించుకుంటున్నాయి. దీంతో దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. ఓ వైపు పెట్టుబడుల్లో పతనం, మరోవైపు నిరుద్యోగం ఎగిసిపడుతోన్నప్పటికీ.. దేశం దూసుకుపోతోందని మోడీ సర్కార్ చేస్తున్న ప్రచారం విమర్శలకు దారి తీస్తోంది.
]]>భారత్ పే నుంచి ఆన్ ఇన్ వన్ చెల్లింపు పరికరం
https://navatelangana.com/an-on-in-one-payment-device-from-bharat-pay/
Tue, 07 May 2024 19:54:47 +0000https://navatelangana.com/?p=285786ముంబయి : ప్రముఖ ఫిన్టెక్ సంస్థ భారత్పే కొత్తగా ఆల్ ఇన్ వన్ చెల్లింపు పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. పిఒఎస్, క్యూఆర్ కోడ్, స్పీకర్లను ఒకే పరికరంలోకి అనుసంధానించేలా దీన్ని డిజైన్ చేసినట్లు పేర్కొంది. ఈ వినూత్న ఉత్పత్తి వ్యాపారుల కోసం లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి రూపొందిం చబడిందని భారత్ పే సిఇఒ నలిన్ నేగి తెలిపారు.
]]>డాక్టర్ రెడ్డీస్కు రూ.1,307 కోట్ల లాభాలు
https://navatelangana.com/dr-reddys-profit-is-rs-1307-crore/
Tue, 07 May 2024 19:51:16 +0000https://navatelangana.com/?p=285785హైదరాబాద్ : ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ డాక్టర్ రెడ్డీస్ గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.1,307 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లోని రూ.959.2 కోట్ల లాభాలతో పోల్చితే 36 శాతం వృద్థిని సాధించింది. క్రితం క్యూ4లో డాక్టర్ రెడ్డీస్ రెవెన్యూ 12 శాతం పెరిగి రూ.7,083 కోట్లుగా నమోదయ్యింది. అమెరికా, యూరపియన్ మార్కెట్లలో బలమైన అమ్మకాలు మెరుగైన ఫలితాలకు దోహదం చేశాయని ఆ కంపెనీ తెలిపింది. యూరప్లో అమ్మకాలు 5 శాతం, యుఎస్లో రికార్డ్ స్థాయిలో 29 శాతం చొప్పున పెరిగాయి. మొత్తం ఆర్థిక సంవత్సరం 2023-24లో డాక్టర్ రెడ్డీస్ నికర లాభాలు 23.6 శాతం పెరిగి రూ.5,568 కోట్లుగా చోటు చేసుకున్నాయి. రెవెన్యూ 13.5 శాతం వృద్థితో రూ.27,916.4 కోట్లుగా నమోదయ్యింది. 2023-24గాను ప్రతీ రూ.5 ఈక్విటీ షేర్పై రూ.40 తుది డివిడెండ్ను చెల్లించడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
]]>సెన్సెక్స్ 384 పాయింట్ల పతనం
https://navatelangana.com/sensex-fell-by-384-points/
Tue, 07 May 2024 19:50:34 +0000https://navatelangana.com/?p=285781ముంబయి : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు ప్రతికూలతలో ముగిశాయి. మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో బిఎస్ఇ సెన్సెక్స్ 382.69 పాయింట్లు కోల్పోయి 73,511.85 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 600 పాయింట్ల మేర కోల్పోయినప్పటికీ చివరి దశలో కొంత పుంజుకున్నాయి. ఎన్ఎస్ఇ నిఫ్టీ 141 పాయింట్ల నష్టంతో 22,303 వద్ద నమోదయ్యింది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండిస్టీస్, ఐసిఐసిఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఇండుస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్ సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు పతనాన్ని చవి చూశాయి.
]]>టెస్లాలో కొనసాగుతున్న ఉద్వాసనలు
https://navatelangana.com/continued-emissions-at-tesla/
Tue, 07 May 2024 19:50:04 +0000https://navatelangana.com/?p=285782న్యూయార్క్ : ఎలన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ఉద్వాసనలు ప్రకటించిన టెస్లా మరోమారు వేటుకు పూనుకోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గత వారం ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను ఇంటికి పంపించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులపై వేటు వేయడానికి కసరత్తు జరుగుతుందని సమాచారం. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతానికంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు ఏప్రిల్ 14న ఎలన్ మస్క్ ప్రకటించారు. ఇందులో రిక్రూట్మెంట్, మార్కెటింగ్, సూపర్ చార్జింగ్ టీమ్తో సహా వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు
]]>ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ విద్యార్థి పియా జాజు 10వ ICSE బోర్డ్ పరీక్షల్లో టాప్ స్కోరర్
https://navatelangana.com/akash-educational-services-limited-student-piya-jaju-is-the-top-scorer-in-10th-icse-board-exams/
Tue, 07 May 2024 14:19:06 +0000https://navatelangana.com/?p=285599నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలోని హిమాయత్ నగర్కు చెందిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) విద్యార్థిని పియా జాజు 10వ తరగతి ఐసీఎస్ఈ బోర్డు పరీక్షల్లో 99.6% స్కోర్ సాధించింది. పియా మూడు సబ్జెక్టుల్లో 100 శాతం మార్కులు సాధించింది. ఐసీఎస్ఈ బోర్డు ఇటీవల ఈ ఫలితాలను ప్రకటించింది. సైన్స్, సోషల్ స్టడీస్, కంప్యూటర్ అప్లికేషన్స్లో 100 శాతం, గణితం, ఆంగ్లంలో 99 మార్కులతో మొత్తం 498 మార్కులు పియా సాధించింది. ఆమె హిందీలో 97 మార్కులు సాధించింది. పియా జాజు అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు అభినందనలు తెలిపిన , ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) చీఫ్ అకడమిక్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ మిశ్రా మాట్లాడుతూ.. పియా అసాధారణమైన ప్రదర్శన పట్ల మేము ఎంతో గర్వపడుతున్నాము, ఆకట్టుకునే రీతిలో 99.6 % తో 10వ ICSE బోర్డ్ పరీక్షలలో నగరంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాము. ఈ విజయం, ఆమె అకుంఠిత దీక్ష, పట్టుదల , ఆమె తల్లిదండ్రుల తిరుగులేని మద్దతు మరియు ఆకాష్ వద్ద అందించబడిన ప్రభావవంతమైన పరీక్ష సంసిద్ధత మరియు మార్గదర్శకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పియా మరియు మా విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. వారు భవిష్యత్ లో మరిన్ని విజయాలను సాధించాలని మేము ఆకాంక్షిస్తున్నాము ” అని అన్నారు. హైస్కూల్ హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థుల కోసం రూపొందించిన వివిధ కోర్సు ఫార్మాట్ల ద్వారా సమగ్ర IIT-JEE కోచింగ్ను ఆకాష్ అందిస్తుంది. ఇటీవల, ఆకాష్ కంప్యూటర్ ఆధారిత శిక్షణను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. దాని వినూత్నమైన iTutor ప్లాట్ఫారమ్ రికార్డ్ చేయబడిన వీడియో లెక్చర్లను అందిస్తుంది. అంతేకాకుండా, మాక్ టెస్ట్లు నిజమైన పరీక్ష పరిస్థితులను అనుకరిస్తాయి, పరీక్షను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అవగాహన, విశ్వాసంతో విద్యార్థులను సన్నద్ధం చేస్తాయి.
]]>వాహన ఉత్పత్తితో టాటా మోటార్స్ గొప్ప మైలురాయిని అందుకుంది
https://navatelangana.com/tata-motors-has-achieved-a-great-milestone-with-vehicle-production/
Tue, 07 May 2024 13:45:45 +0000https://navatelangana.com/?p=285545నవతెలంగాణ – లక్నో: టాటా మోటార్స్, భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ, దాని అత్యాధునిక లక్నో ఫెసిలిటీ నుండి 9,00,000వ వాహన రోల్అవుట్లో ముఖ్యమైన మైలురాయిని ప్రకటించింది. ఈ వేడుకలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, టాటా మోటార్స్ సీనియర్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభ వేడుక జరిగింది. 600 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ లక్నో సదుపాయం టాటా మోటార్స్ సుస్థిర ఉత్పాదక పద్ధతుల పట్ల అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తుంది, దీనిని భారత పరిశ్రమల సమాఖ్య (CII) వాటర్-పాజిటివ్ ప్లాంట్గా గుర్తించింది. ఈ సౌకర్యం 6MW సౌర విద్యుత్ ప్లాంట్ను కలిగి ఉంది, దాని కార్బన్ విస్తరణను గణనీయంగా తగ్గిస్తుంది. రోబోటిక్ పెయింట్ బూత్లు, రోబోటిక్ స్పాట్ వెల్డింగ్ను కలిగి ఉన్న బాడీ-ఇన్-వైట్ షాప్ వంటి అల్ట్రా-ఆధునిక వాహన తయారీ స్టేషన్లతో అమర్చబడిన ఈ ఫెసిలిటీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ తయారీ కేంద్రంగా ఉంది. 1992లో స్థాపించబడినప్పటి నుండి, ఈ సౌకర్యం తేలికపాటి, మధ్యతరహా, మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు, అలాగే ఎలక్ట్రిక్ మరియు ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ బస్సులతో సహా అనేక రకాల కార్గో మరియు ప్రయాణీకుల వాణిజ్య వాహనాలను ఉత్పత్తి చేసింది. టాటా మోటార్స్ లక్నో ఫెసిలిటీ నుండి 9,00,000వ వాహన విడుదల సందర్భంగా మాట్లాడుతూ, మిస్టర్ దుర్గా శంకర్ మిశ్రా, ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నందుకు టాటా మోటార్స్ను అభినందించారు. ప్రస్తుత మరియు భవిష్యత్తు అవసరాలను పరిష్కరించడానికి అధునాతనమైన, సురక్షితమైన మరియు పచ్చటి మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో టాటా మోటార్స్ యొక్క కీలక పాత్రను ఆయన నొక్కిచెప్పారు. అదనంగా, Mr. మిశ్రా మహిళా సాధికారతకు కంపెనీ యొక్క నిబద్ధతను హైలైట్ చేసారు, ఈ సంవత్సరం కొత్త నియామకాలలో 22% కంటే ఎక్కువ మంది మహిళా ప్రాతినిధ్యాన్ని సాధించడం విశేషం, ఇది తయారీ రంగంలో మహిళలకు ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది.
ఈ విజయాన్ని ప్రతిబింబిస్తూ, మిస్టర్ విశాల్ బాద్షా, వైస్ ప్రెసిడెంట్, హెడ్ -ఆపరేషన్స్ , టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ ఇలా వ్యాఖ్యానించారు. “లక్నో ఫెసిలిటీ నుండి మా 9,00,000వ వాహనం విడుదల కావడం టాటా మోటార్స్కు ఒక ముఖ్యమైన మైలురాయి వంటిది. ఈ ఫెసిలిటీ మా అధునాతన ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో కీలకమైనది. 1200 యూనిట్లకు పైగా విజయవంతంగా పంపిణీ చేయబడింది. ఇవి దేశవ్యాప్తంగా లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి. ఉత్తరప్రదేశ్ మా కీలక మార్కెట్లలో ఒకటి, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం వాణిజ్య వాహనాల అమ్మకాలను పెంచడంలో కీలకంగా ఉంది. పరిశ్రమ 4.0 ఇంటిగ్రేషన్పై మా దృష్టితో, ఈ ఫెసిలిటీ మా కస్టమర్లకు సురక్షితమైన, స్మార్ట్ గ్రీన్ మొబిలిటీ పరిష్కారాలను అందిస్తోంది. మేము ఈ మైలురాయిని జరుపుకుంటున్న సందర్భంగా మా కస్టమర్లు, భాగస్వాములు మరియు సహోద్యోగులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.”ఈ సందర్భంగా మాట్లాడుతూ, మిస్టర్ మహేష్ సుగురు, ప్లాంట్ హెడ్ – లక్నో, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ ఇలా అన్నారు, “లక్నో ఫెసిలిటీ నుండి మా 9,00,000వ వాహనం విడుదల కావడం శ్రేష్ఠత మరియు ఆవిష్కరణల పట్ల మా నిబద్ధతకు నిదర్శనం. అత్యాధునిక సాంకేతికతల ఏకీకరణ ద్వారా, మేము మా కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేసాము, వర్క్ఫ్లోలను క్రమబద్ధీకరించాము మరియు కస్టమర్ అంచనాలకు మించి అత్యుత్తమ వాహనాలను అందించడానికి మా ఉత్పత్తి ప్రమాణాలను మరింత మెరుగుపరిచాము.”టాటా మోటార్స్ తన లక్నో ఫెసిలిటీలో జెండర్ ఇన్క్లూసివిటీ మరియు మహిళా సాధికారత కోసం కొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం, సాంకేతిక శ్రామిక శక్తిలో మూడింట ఒక వంతు మహిళలు ఉన్నారు, అన్ని కార్యాచరణ మార్పులలో చురుకుగా నిమగ్నమై ఉన్నారు మరియు ట్రక్కులు మరియు బస్సులతో సహా వివిధ ఉత్పత్తుల ఉత్పత్తిలో విభిన్న నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. కంపెనీ తన మహిళా ఉద్యోగుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది, వారి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక శిక్షణ మరియు వర్క్షాప్ల ద్వారా వారికి పరిశ్రమ అనుభవాన్ని అందిస్తోంది. ఈ సంవత్సరం కొత్తగా రిక్రూట్ అయిన వారిలో 22% కంటే ఎక్కువ మంది మహిళలు ఉండటంతో, టాటా మోటార్స్ తయారీ పరిశ్రమలో మహిళల పురోగతికి గర్వకారణంగా నిలుస్తోంది.
]]>విప్లవాత్మక కరికులమ్ను తీసుకువచ్చిన NIIT విశ్వవిద్యాలయం
https://navatelangana.com/niit-university-which-brought-revolutionary-curriculum/
Tue, 07 May 2024 13:33:52 +0000https://navatelangana.com/?p=285532నవతెలంగాణ – విజయవాడ: ఉన్నత విద్య, అభ్యాసంలో ఆవిష్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో స్థాపించబడిన ఫ్యూచర్ విశ్వవిద్యాలయం, NIIT విశ్వవిద్యాలయం (NU), 2024 విద్యా సంవత్సరం కోసం అడ్మిషన్ల ను ప్రారంభించింది. ఈ ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో బిటెక్ ప్రోగ్రామ్ను జోడించారు. సైబర్ సెక్యూరిటీలో బిటెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లో బిటెక్ వంటి ప్రోగ్రామ్లకు ఇప్పుడు అడ్మిషన్లు తెరవబడ్డాయి. విద్యార్థులు 12వ తరగతి తర్వాత కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్లో బిటెక్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బిటెక్, బయోటెక్నాలజీలో బిటెక్, 3-సంవత్సరాల బిబిఎ మరియు 4-సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (iMBA) ప్రోగ్రామ్లను కూడా ఎంచుకోవచ్చు. విశ్వవిద్యాలయం తమ అడ్మిషన్స్ 2024 ఓపెన్ హౌస్ని విజయవాడలో ఇటీవల విజయవంతంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. “NIIT విశ్వవిద్యాలయం విద్యా వాతావరణాన్ని పెంపొందించడానికి అంకితం చేయబడింది. ఇది మార్కెట్ ప్లేస్ యొక్క ప్రస్తుత డిమాండ్లను తీర్చడమే కాకుండా భవిష్యత్తులో సవాళ్లు, అవకాశాలను అంచనా వేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లో మా కొత్త బిటెక్ ప్రోగ్రామ్ మా నిబద్ధతకు నిదర్శనం ” అని NIIT విశ్వవిద్యాలయం అధ్యక్షుడు ప్రొఫెసర్ ప్రకాష్ గోపాలన్ అన్నారు. దరఖాస్తు చేసిన విద్యార్థులందరికీ NU 100% ప్లేస్మెంట్ రికార్డును స్థిరంగా నిర్వహిస్తోంది. 2023 తరగతికి సంబంధించి, 94% కంటే ఎక్కువ మంది విద్యార్థులు సిస్కో, మోర్గాన్ స్టాన్లీ, PWC మొదలైన అనేక ప్రసిద్ధ సంస్థలలో ఆశించిన ఉద్యోగాలను పొందారు.
– అడ్మిషన్లు, ప్లేస్మెంట్ల గురించి మరింత సమాచారం కోసం https://niituniversity.in/admissions వద్ద లాగిన్ అవ్వండి..
]]>