ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళు పాల్గొనే ‘క్యాండిడేట్స్’లో ఉన్నదే 16 మంది. అందులో ముగ్గురు మగ వాళ్ళు (గుకేశ్, విదిత్, ఆర్. ప్రజ్ఞానంద), ఇద్దరు ఆడవారు (కోనేరు హంపీ, ఆర్. వైశాలి)తో మొత్తం అయిదుగురి అతి పెద్ద బృందం భారత్దే. ఇంతమంది ఆటగాళ్ళు ఈ క్లిష్టమైన అలాగే, 2024 ఏప్రిల్ నాటి ‘ఫిడే’ ర్యాంకింగ్స్లో టాప్ 25లో అయిదుగురు భారతీయ పురుషులే.
మహిళల ర్యాకింగ్స్లో టాప్ 15లో ముగ్గురు మనవాళ్ళే. జూనియర్ ర్యాకింగ్స్కు వస్తే టాప్ 20లో ఏడుగురు భార తీయులే. అదే టాప్ 30 జూనియర్స్ని గనక లెక్క తీస్తే మూడింట ఒక వంతు మన దేశీయులే.ప్రపంచ చదరంగ వేదికపై అంతకంతకూ విస్తరిస్తున్న భారతదేశ స్థాయికీ, స్థానానికీ ఇదే సాక్ష్యం.
ఈ కంప్యూటర్ యుగంలోనూ సంప్రదాయ శిక్షణ, క్లాసికల్ ఫార్మాట్పై ప్రేమ అతణ్ని భిన్నంగా నిలుపుతోంది. పిన్న వయస్సు (12 ఏళ్ల 7 నెలల 17 రోజులు)లోనే గ్రాండ్మాస్టర్గా నిలిచిన భారత ఆటగాడిగా చరిత్ర సష్టించిన గుకేశ్.. కేవలం 17 రోజుల తేడాతో ప్రపంచ రికార్డు కోల్పోయాడు. ప్రపంచంలో మూడో అతి పిన్న వయస్సు గ్రాండ్మాస్టర్గా నిలిచాడు. అలాంటి ఆటగాడు ఆరంభం నుంచి కోచ్ల శిక్షణలో, బోర్డుపై గేమ్లు ఆడుతూ ఎదిగాడు. ఎలో రేటింగ్ 2500 దాటిన తర్వాతే గుకేశ్ చెస్ ఇంజన్ల సాయం తీసుకున్నాడు. 36 ఏళ్లలో తొలిసారి విశ్వనాథన్ ఆనంద్ను వెనక్కినెట్టి నిరుడు గుకేశ్ భారత టాప్ ర్యాంకు ఆటగాడిగా నిలిచాడు.
గెలుపుతో స్ఫూర్తి పొందేవాళ్లను చూసుంటాం. కానీ ఓటమి నుంచి ప్రేరణ పొంది, కసిగా ఆడాలనేది గుకేశ్ మంత్రం. స్వీయ నమ్మకంతో ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనే చెక్కుచెదరకుండా ఏకాగ్రతతో, ఆత్మవిశ్వాసంతో నిలబడుతున్నాడు. 2022లో దిగ్గజం కార్ల్సన్పై విజయం సాధించాడు. 2022 ఒలింపియాడ్లో మొదటి బోర్డుపై వ్యక్తిగత స్వర్ణం గెలిచాడు. నిరుడు ఆసియా క్రీడల్లో పురుషుల జట్టుతో రజతం సొంతం చేసుకున్నాడు. గతేడాది అత్యధికంగా 2,758 రేటింగ్ సాధించిన గుకేశ్.. ప్రస్తుతం 2,743 వద్ద ఉన్నాడు. ప్రపంచ చెస్లో 2750 రేటింగ్ దాటిన పిన్న వయస్సు క్రీడాకారుడూ అతనే.
చిన్నప్పటి నుంచి అమ్మానాన్న నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. 2018 ఆసియా యూత్ ఛాంపియన్షిప్స్లో అయిదు స్వర్ణాలు గెలవడంతో వాళ్లకు నాపై పూర్తి నమ్మకం వచ్చింది. ఈఎన్టీ సర్జన్ అయిన నాన్న నా కోసం ప్రాక్టీస్ ఆపేశారు. అప్పుడు అమ్మ సంపాదనతోనే ఇల్లు గడిచేది. రెండేళ్ల పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ నాన్న ఏ కష్టాన్ని నా వరకూ రానివ్వలేదు. నేను గ్రాండ్మాస్టర్ అయ్యాక పరిస్థితి మెరుగైంది. కరోనా సమయంలో బయట టోర్నీలు లేకపోవడంతో నాన్న వైద్యుడిగా పనిచేశారు.
ఆనంద్ సర్ను ఆరాధిస్తూ పెరిగా. ఆయన అకాడమీలో శిక్షణ పొందడం గొప్ప అవకాశం. ఆయన సూచనలతో నా ఆట ఇంకా మెరుగైంది. ఇప్పుడు ఆయన బాటలోనే ప్రపంచ ఛాంపియన్షిప్కు అర్హత సాధించడం ఆనందంగా ఉంది.
మేం చెన్నైలో స్థిరపడ్డా మా కుటుంబంలో తెలుగు మూలాలున్నాయి. మా ముత్తాతలు పుత్తూరు సమీపంలోని సత్యవేడు దగ్గర గ్రామంలో ఉండేవాళ్లు. ఇప్పటికీ అక్కడ మాకు బంధువులున్నారు. చిన్నప్పుడు అమ్మానాన్నతో కలిసి అక్కడికి వెళ్లేవాణ్ని. కానీ చెస్ కెరీర్ కారణంగా ఇప్పుడు కుదరడం లేదు.
ప్రపంచ చాంపియన్తో ‘డీ’
ఈ విజయంతో గుకేశ్.. ప్రపంచ చాంపియన్షిప్లో అతడు చైనాకు చెందిన డింగ్ లిరెన్తో తలపడాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కానప్పటికీ ఇక్కడా గెలిస్తే ప్రపంచ చాంపియన్గా నిలిచే అతి పిన్న వయస్కుడిగా అతడు రికార్డులకెక్కుతాడు.
– అనంతోజు మోహన్కృష్ణ, 8897765417
లక్ష్యమే నన్ను నడిపింది
‘జీవితంలో కచ్చితంగా ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. దాన్ని చేరుకునేందుకు ఈ ప్రపంచం నీకు ఏదో ఒకలా సహాయ పడుతుంది..’ అన్న ఆల్కెమిస్ట్ పౌల్ కోయెల్హో మాటల్నే స్ఫూర్తిగా తీసుకుంది కేరళకు చెందిన సారిక. సెరెబ్రల్ పాల్సీ కారణంగా చిన్న వయసు నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైన ఆమె.. ఈ శారీరక లోపాన్ని అధిమించి తానేంటో నిరూపించుకోవాలనుకుంది. ఈ సంకల్పంతోనే సివిల్స్ సాధన చేసిన సారిక.. తాజా ఫలితాల్లో 922 ర్యాంకు సాధించింది. తద్వారా శారీరక లోపాలు విజయానికి ఏ మాత్రం అడ్డు కావని నిరూపించింది. ‘సెరెబ్రల్ పాల్సీ కారణంగా నా కుడి చేయి పనిచేయదు. వీల్ ఛెయిర్ను కదిలించడం, రాయడం, తినడం, ఇతర పనులన్నీ ఎడమ చేత్తోనే చేస్తుంటా. అమెరికాకు చెందిన జెస్సికా కాక్స్ నా జీవితానికి అతిపెద్ద స్ఫూర్తి ప్రదాత. రెండు చేతులు లేకపోయినా కాళ్లతో విమానం నడిపి.. పైలట్ లైసెన్స్ సాధించిందామె. డిగ్రీ పూర్తయ్యాక సివిల్స్ సాధన మొదలుపెట్టా. ఇక నా సివిల్స్ జర్నీలో అమ్మానాన్నలూ ఎంతగానో సపోర్ట్ చేశారు. రెండో ప్రయత్నంలో నాకు ర్యాంకొచ్చింది. నాన్న ఖతార్లో పనిచేస్తున్నప్పటికీ.. నా సివిల్స్ పరీక్షల కోసం ఇండియాకొచ్చారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలకు హాజరయ్యే క్రమంలో అమ్మానాన్నలు నాతోనే ఉన్నారు. ఎన్ని సవాళ్లెదురైనా నాలో ధైర్యం నింపారు. ఏదేమైనా నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది..’ అంటోందీ సివిల్స్ ర్యాంకర్.
చీకటి వెనుక వెలుతురు
విశాఖపట్నానికి చెందిన వేములపాటి హనిత రెండో కోవకు చెందుతుంది. మొదటి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ దగ్గరే ఆగిపోయిన ఆమె.. నాలుగో ప్రయత్నంలో మెయిన్స్, ఇంటర్వ్యూ దశలు కూడా దాటి సివిల్స్లో 887వ ర్యాంకు సాధించింది. అరుదైన వ్యాధి కారణంగా చక్రాల కుర్చీకే పరిమితమైనా తన కలను సాకారం చేసుకుంది. ‘సివిల్స్ లక్ష్య సాధనలో నాకు ముందు నుంచీ సరైన గైడెన్స్ లేదు. కానీ ప్రతి ప్రయత్నంలో నన్ను నేను మెరుగుపరచుకున్నా. చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాను. ఆ పట్టుదలే ర్యాంకు తెచ్చిపెట్టింది. మన జీవితానికంటూ ఓ సార్థకత ఉండాలని పదే పదే మా గురువు గారు చెబుతుండేవారు. సివిల్స్ అందుకు చక్కని మార్గమంటూ దిశానిర్దేశం చేశారు. ఆయన మాటలే నన్ను సివిల్స్ వైపు అడుగులు వేయించాయి. ఐఐటీ ఖరగ్పూర్లో సీటొచ్చినప్పుడు Transverse Myelitis’ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డా. దీంతో ఒక్కసారిగా నడుస్తూనే సడెన్గా కింద పడిపోయా. నాలుగ్గంటల్లోనే పక్షవాతం రావడంతో నడుం కింది భాగం చచ్చుబడిపోయింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. వెన్నెముకలో ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వచ్చినట్లు, ఇక జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమవ్వాల్సి వస్తుందని వైద్యులు చెప్పారు. ఆ క్షణం మానసికంగా ఎంతో క్షోభను అనుభవించా. ఆ తర్వాత కోలుకొని డిగ్రీ పూర్తిచేశా.. నాలుగో ప్రయత్నంలో సివిల్స్ కలనూ సాకారం చేసుకున్నా. నా ఈ జర్నీలో అమ్మానాన్నల ప్రోత్సాహం ఎంతో ఉంది. సాధారణ వ్యక్తుల్లాగే ప్రత్యేక అవసరాలున్న వారినీ ఈ సమాజం సమాన దష్టితో చూడాలనేది నా కోరిక. ఓ సివిల్ సర్వెంట్గా నేనూ ఇదే చేయాలనుకుంటున్నా. చీకటి వెనుక వెలుతురు ఉంటుందని నేను నమ్మిన సిద్ధాంతమే నన్ను ఈ రోజు మీ అందరి ముందు నిలబెట్టింది..’ అంటూ తన జర్నీని పంచుకుంది హనిత.
పట్టుదలతో సాధించలేనిది లేదు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం, వెలిచాలకు చెందిన నందాల సాయి కిరణ్ సివిల్స్లో 27వ రాంక్ సాధించారు. సాధారణ కుటుంబంలో పుట్టారు సాయికిరణ్. తండ్రి కాంతారావు చేనేత కార్మికునిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. క్యాన్సర్ బారినపడి 2016లో మతి చెందాడు. బీడీ కార్మికురాలైన తల్లి లక్ష్మి రెక్కల కష్టంపై కుటుంబం నడిచింది. దీనితో తాను చదువుకునే వయసులోనే కుటుంబానికి సాయంగా ఉండేందుకు తాను ఉద్యోగం చేస్తూనే సివిల్స్కి ప్రిపేర్ అయ్యారు. చివరికి దేశంలోనే 27వ ర్యాంక్ సాధించి పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదని నిరూపించి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సాయి అక్క స్రవంతి ప్రస్తుతం ఏఈఈగా ఉద్యోగం చేస్తుంది.
రోజుకు 14 గంటలు చదివాను..
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన దోనూరు అనన్యరెడ్డి… దోనూరు మంజుల, సురేశ్రెడ్డిది వ్యవసాయ కుటుంబం. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్దమ్మాయి అనన్య. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని యూనివర్సల్ పాఠశాలలో ప్రాథమిక విద్య, కాకతీయ పాఠశాలలో ప్రాథమికోన్నత విద్య, గీతం పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. హైదరాబాద్లోని హయత్నగర్ నారాయణ ఐఏఎస్ జూనియర్ కళాశాలలో ఇంటర్… ఢిల్లీలోని మిరిండా హౌస్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అప్పటి నుండే… సివిల్స్ వైపు దష్టి పెట్టిన ఆమె… ఆంత్రోపాలజీ ఆప్షనల్ సబ్జెక్టుగా సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. ప్రతిరోజు 12 నుంచి 14 గంటలపాటు పుస్తకాలతో కుస్తీ పట్టడంతో తొలి ప్రయత్నంలోనే విజయం ఆమెను వరించింది.
తల్లీ మరణం కృంగదీసినా
అనుగుల్ జిల్లాలోని తాల్చేర్కు చెందిన అనిమేశ్.. కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు. రావుర్కెలాలోని ఎన్ఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం దిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీస్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. 2022లో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించా. సోషియాలజీని ఆప్షనల్గా ఎంచుకున్నా. రోజుకు 5-6 గంటల పాటు చదివా. పరీక్ష కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. సివిల్స్ ఫలితాలు చాలా సంతప్తిని ఇచ్చినా… 2015లో తండ్రిని, సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు తల్లిని కోల్పోవడం అత్యంత విషాదం. ”ఐఏఎస్కు తొలి ప్రాధాన్యం ఇచ్చానని, ఒడిశా క్యాడర్ ఆశిస్తున్నాను. నా రాష్ట్ర ప్రజలు.. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, వెనుకబడిన ప్రాంతాల వారి అభ్యున్నతి కోసం పని చేయాలనుకుంటున్నా” అని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పార్లమెంటరీ డిబేటింగ్, మీడియా అడ్వకసీ- జర్నలిజం, ఫ్రీ-స్టైల్ డ్యాన్స్ అతని హాబీలు.
– అనంతోజు మోహన్కృష్ణ, 8897765417
ఈ రోజు (26.6.2022) నవతెలంగాణ సోపతిలో నీ బీటెక్ జర్నీ కవిత చదివినంక (నీ కవితలను నవ తెలంగాణ పత్రికలలో ప్రచురించి నీకు ధైర్యాన్ని ఇచ్చిన అనంతోజు మోహనన్నకు ప్రేమలు) మనసంతా వానకు తడిసిన విత్తనపు సాలు లెక్క మారింది. పదేళ్ళ క్రితం పాల్కురికి సోమనాథుని పాఠాన్ని చెబుతుంటె కనురెప్ప వేయకుండ విన్న ఎం.వి.ఆకాశేనా ఇది రాసింది? బడి అయిపోయినంక బస్సెక్కిందాక నిలబడి సాగదోలిన నా ప్రియమైన ఆకాశమేనా ఇది రాసింది? ఎంతని ప్రేమనైనా గుండెలోనె దాచుకొని ఋషి లెక్క కనిపించె వెస్ట్ మారేడుపల్లి నా స్టూడెంటేనా ఇది రాసింది?” అని మనసులో ఎంత సంతోషపడ్డనో మాటల్లో చెప్పలేను.
నేను వెస్ట్ మారెడుపల్లిలోని విద్యాకిరణ్ టెక్నో స్కూల్లో టీచర్గా పనిచేసింది రెండేళ్ళే అయినా జీవితాంతం మరిచిపోని ప్రేమను పంచింది. సికింద్రాబాద్కు ఏ పని మీద వొచ్చినా విద్యా కిరణ్ టెక్నో స్కూల్ను తలువకుండా, మిమ్మల్ని కలువకుండా పోయిన రోజులు లేవు. మీ స్కూల్ నుంచి నేను వెళ్ళిపోయేటపుడు ఎనిమిదవ తరగతిలో నీవు రాసిన కొలవరి సాంగ్ గుర్తుందా? ఎన్నెన్ని వెచ్చటి కన్నీటి జ్ఞాపకాలో ఆ పాట చుట్టూ. పేరడి పాటను ఎంతో ఉద్వేగంగా నడిపిన నీ ప్రతిభ గురించి ఇప్పటికీ మా బడిపిల్లల ముందు గుర్తుచేసుకుంట.
ఇప్పటి వరకు నీవు రాసిన కవితలన్నీ ఊహాలోకంలో విహరించి రాసినవి కావు. జీవితంలో ఎదురైన వాస్తవ దశ్యాలను నీలోకి తీసుకొని, తనివితీరా అనుభవించి, పలువరించి రాసినవి. ఇప్పటిదాక ఏడెనిమిది కవితలే రాసినా, నిరు పేదల జీవితాన్ని చిత్రించినవి, శ్రామికుల చెమట బొట్ల ముందు మోకరిల్లి రాసినవే ఉన్నయి.
కార్మికుల దినోత్సవం సందర్భంగా రాసిన ‘నెత్తుటి యోధులు’ కవితలో కార్మికుల శ్రమను గొప్పగా కవిత్వకరించావు.
”ఎర్రని మట్టి గంపను నెత్తిన పెట్టుకొని/ ఐదు అంతస్తులు మేడ ఎక్కుతుంటే/ సూర్యుడినే ఆకాశానికి/ తీస్కపోతున్నటు కనిపిస్తరు”
మట్టిగంపలో పెట్టుకొని సూర్యుడిని ఆకాశానికి తీసుకపోతారడనం గొప్ప ఊహ. నీ భావుకత సహజమైనదో, గొప్పదో చెప్పడానికి ఇలాంటి వాక్యాలు చాలు.
వాస్తవిక నగర జీవితాన్ని అద్దంలో చూపించిన కవిత ‘మంచీళ్ళొచ్చినై’. కొన్ని గల్లీలకు నీళ్ళు రానపుడు వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులను కండ్లకు కట్టినట్టు చూపించావు. హైద్రాబాద్ అనంగనే విలాసాలకు లోటు లేని నగరంగానో, గొప్ప దర్శనీయ స్థలంగానో చెబుతుంటారు గాని ఇలాంటి జీవితాల గురించి ఇంకా రావలసిన అవసరం ఉంది.
”సాయంత్రం ఐతే/ రాత్రైనా ఇంటికిరాని కొడుకు/ గురించి చూసినట్టు/ మంచినీళ్ళ గురించి ఎదురు చూస్తరు
బోరునీల్లు విడిచేది గంటసేపే/ ఒచ్చేదే ఇంటికి రెండు బిందలే/ పుస్తకాలలో చదువుకున్న కురుక్షేత్రాన్ని/ రోజు ఇంటి ముందుట చూస్తుంటం
డ్రమ్ముల కాడికెల్లి/ చిన్న సర్వల దాకా/ నీళ్ళ పండుగ చేసుకుంటయి/ రాత్రికి ఒండే అన్నంకి/ బియ్యం కూడా ఇప్పుడే/ కడిగి పెట్టుకుంటరు”
గల్లీలలో నీళ్ళ కోసం ఎదురుచూసే ఎదురుచూపులను కవిత్వీకరించడంలో ఎంతో సహజత్వం ఉంది.
డ్రమ్ముల దగ్గర నుంచి చిన్న చిన్న సర్వల దాక నీళ్ళు పట్టుకునే దశ్యాన్ని చెప్పడంలో నీ సూక్ష్మ పరిశీలన పరిశీలన తెలుస్తుంది.
మనల్ని వద్దనుకునే వాళ్ళు గొప్పవాళ్ళ దగ్గర ఉండడం కన్నా మనల్ని కావాలనుకునే చిన్న వాళ్ళ దగ్గర ఉండాలి అనే జీవిత సత్యాన్ని ఒక మినీకవితలో చెప్పావు.
”వెలుగు నన్ను ఒదిలేసినా/ కటిక చీకటి చేయందించింది/ పండుటాకును చెట్టు కొమ్మ వద్దనుకున్నా/ సిరులు పండించె నేల గుండెకు అద్దుకుంది”
ఈ మినీకవితలో నీదైన అనుభవాన్ని ఎంతో గాఢతతో వ్యక్త పరిచావు. దేనికీ తొందరపడని తనం, అందరినీ కలుపుకొని నడిచే స్నేహ గుణం, సున్నితమైన దశ్యాలకు కదిలిపోయే తత్వం, పెద్దరికంగా ఆలోచించె విధానం నీలోని ప్రత్యేకత. అవి నీ కవిత్వంలో కనబడకుండా ఎలా ఉంటాయి చెప్పు ?
‘బి.టెక్ జర్నీ’ కవిత బి.టెక్ పూర్తి చేసిన విద్యార్థి మళ్ళీ తన కాలేజి జ్ఞాపకాల్లోకి వెళ్ళినట్లుగా ఉంది. కాలేజీలోకి అడుగుపెట్టింది మొదలు ఫైనల్ ఇయర్ దాక బి.టెక్ జీవితమంతా ఈ కవితలో కనబడింది. క్లాసురూంలలో ఎలాంటి కేరింతలు ఉంటాయో, క్యాంటిన్ల దగ్గర ఎలాంటి సరదాలు ఉంటాయో చెబుతూనే బి.టెక్ చదువులు ఎలా సాగుతాయో చెప్పావు. బి.టెక్ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరిని వాళ్ళవాళ్ళ కాలేజి రోజుల్లోకి తీసుకపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కవిత చదవగానే ”పాదమెటు పోతున్న/ పయనమెందాకైనా” పాట గుర్తొచ్చింది. కొంత భాగమైనా ఆ కవితను మళ్ళీ గుర్తు చేస్తా.
”జీవితంలో వెనుకబడుతాను అనుకున్నాడేమో/ మా M1 సార్ ఎప్పుడు క్లాస్కొచ్చినా/ లాస్ట్ బెంచ్ నుంచి ముందుకు తిస్కొచేట్టోడు/ క్లాస్ బంక్కొట్టి మల్టీప్లెయర్ గేమ్స్ ఆడుతుంటే/ ఇంక మిరు మారరా అని అనే M3 మేడం మాటలు/ మా లక్ష్యాన్ని గుర్తు చేసేవి/ ఎగ్జామ్ హల్లో వెనుక ఆన్సర్ షీట్ను/ చూడడం కోసం చేసే ప్రయత్నం/ ఏ సర్కస్ ఫీట్కు తీసిపోదు/ చివరి క్షణంలో చెమటబొట్టు/ కంటిరెప్పను పలకరిస్తూ అన్సర్ శీట్తో చేయి కల్పడం/ ఇంకా నా కళ్లముందే కదులుతుంది/ ఎగ్జామ్స్ తర్వాత బావర్చిలో ఫ్రెండ్స్ అందరం కలిసి తిన్న బిర్యానీ వాసన ఇంకా చేతులకి అలానే ఉంది/ అస్సైన్మెంట్ సబ్మిషన్ రోజు/ పెన్ను పెపర్లతో మేమంత కుస్తిపడుతుంటే/ పక్కనోని అసైన్మెంటును జిరాక్స్ తీసి సబ్మిట్ చేసే/ కష్ణలీలలు మా ఫ్రెండ్ ఒక్కడికే సాధ్యం
ఇస్త్రీ చొక్కా ఎసుకొని చేతికో వాచి తగిలించి/ కొత్త పెళ్లి కొడుకులా ముస్తబయ్యి/ లాబ్ ముందు నిల్చునేటోల్లం/ వైవాలో అడిగిన క్వశ్చన్లకు/ అరుంధతి నక్షత్రం దిక్కు తలలు తిప్పెటోలం/
సీనన్నకు గొంతినంగనే మా ఆకలి తెలిసేదేమో/ ఫోన్ కొట్టంగనే క్యాంటీన్లో ఎంతపెద్ద లైన్ ఉన్నా/ ముందు మాకు ఫ్రైడ్ రైస్ పంపించేటోడు/ సాయంకాలం పానిపూరి తిని ఖాతాపుస్తకంలో/ హజీరు వేయించుకునేవాళ్ళం
జ, జంం, జీaఙa అంటూ/ కంప్యూటర్ లాంగ్వేజ్ వెనుక/ ఎన్నో పరుగులు తిసాము/ GRE,Toefl అంటూ/ విమానాన్ని పట్టుకోడానికి జింకపిల్లలక్క/ చంగుచంగుమని మరెన్నో గంతులేసాం/ Data structures ఇంకాSQL టేబుల్స్లో/ మా జ్ఞాపకాలను పదిలంగా భద్రపరిచాము”
సబ్జెక్టుల విషయంలో బి.టెక్ విద్యార్థులు మాట్లాడుకునే భాష (M1,M3), తరగతి వాతావరణం కవితకు తాజాదనాన్ని తెచ్చాయి. కంప్యూటర్ విద్యకు సంబంధించిన పరిభాష కూడా ఈ కవితకు కొత్త అభివ్యక్తిని తెచ్చింది. చాలా ఒడుపుగా కంప్యూటర్ భాషలను, పరిభాషను పోలికలుగా వాడుతూ కవితను నడిపించావు.
GRE (Graduate Record Examinations), toefl(టోఫెల్-Test of English as a Foreign Language) లు విదేశాలకు పోవడానికి రాసే పరీక్షలు. విమానాన్ని పట్టుకోవడానికి జింక పిల్లల లెక్క అనడంలో ఆ పరీక్షల లక్ష్యం స్పష్టంగా సమన్వయం కుదిరింది.Sql (Structured Query Language) టేబుల్ అనేది కంప్యూటర్లో మనకు కావలసిన డేటాను స్టోర్ చేసేది. data structure బతీవ కూడా అలాంటిదే. వీటిల్లో జ్ఞాపకాలను భద్రంగా స్టోర్ చేశామని చెప్పడం చాలా కొత్తగా ఉంది.
ల్యాబ్లో అడుగుపెట్టిన విద్యార్థులను కొత్త పెళ్ళికొడుకుతో పోల్చి వెంటనే వైవాలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పక దిక్కులు చూడడాన్ని అరుంధతి నక్షత్రం దిక్కు చూస్తారని చెప్పడం విషయ కవిత మీద నీకున్న శ్రద్ధను తెలియజేస్తుంది. పోలికల మధ్య సమన్వయం చెడకుండా జాగ్రత్తపడ్డావు.
ఏ కవితకైనా ఎత్తుగడ, ముగింపులు ప్రాణనాడులలాంటివి. కవితలోనికి వెళ్ళడానికైనా, కవిత చదివినంకా ఇంకా అది మనల్ని వెంటాడడానికైనా వీటి ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. ఈ కవితలో నీవిచ్చిన ముగింపు అలాంటిదే. ‘నాలుగేళ్ళు నా ఇల్లైన కాలేజీ గుర్తొస్తుంది’ అనడం ద్వారా ఒక కుటుంబంగా జీవించిన కాలేజి ప్రేమలన్నింటిని చూపించావు.
హైద్రాబాద్ జీవితం నీ కవిత్వానికి ముడిసరుకు కావాలి. చిత్తు కాగితాలు ఏరుకునె వాళ్ళ దగ్గర నుంచి సాయంత్రం క్లినిక్లో పని చేసే మిత్రుల జీవితాల వరకు నీ చూపు విస్తరించాలి. కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వెస్ట్ మారెడు పల్లి ప్రజల జీవనాడి దొరికిచ్చుకోవాలి. సిటీలైఫ్ను సరికొత్తగా దర్శించాలి.
నాయిన ఆటో నడుపుతూ నిన్ను, అన్నను ఎంత కష్టపడి చదివించిండో దగ్గరి నుండి చూసిన వాడిని. దండ కడియానికి కేంద్ర సాహిత్య యువ పురస్కారం వచ్చినపుడు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అభినందన సభ ఏర్పాటు చేసినపుడు నాన్ననే తన ఆటోలో స్వయంగా దించి వెళ్ళడం ఎంతో గౌరవం అనిపించింది.
హైద్రాబాద్ పోయిన కొత్తలో నగరజీవితం పట్ల ఒక నిరసన భావం ఉండేది. హైదరాబాద్ జీవితం తీరిక లేనిది, మనుషుల మధ్య అంత అనుబంధాలు ఉండవనే అనుకునేది. కానీ విద్యాకిరణ్ స్కూల్లో పని చేసినన్ని రోజులు వాటన్నింటిని దూరం చేసింది. ప్రేమిస్తే ప్రాణమైన ఇచ్చె హైద్రాబాదీల తత్వం మీ స్నేహం వలన నాకు తెలిసింది. ఆకాశ్! ఎప్పుడూ చెబుతుంటాను మీరంతా నా ఆత్మీయ ప్రపంచమే కాదు, ఆత్మ కూడా.
2013లో మా నాయిన చనిపోయినపుడు మీ టెన్త్ క్లాస్ బ్యాచంతా చూడడానికి భవాని టీచర్తో కలిసి మా ఊరికి వచ్చిండ్రు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలను తల్చుకుంటే గుండె సెలిమె నిండుతది. ఆసిఫ్, భరత్, విష్ణు, రాకేష్ అన్నను అడిగినట్లు చెప్పు. ఆకాశ్! ఇక ఉంటాను, సరేనా. అత్యంత ప్రేమతో
మీ తగుళ్ళ గోపాల్
– తగుళ్ళ గోపాల్
9505056316
నిజమైన ప్రేమ ధనిక, పేద అనే తారతమ్యాలకు తావివ్వదు. అందచందాలకు ప్రాధాన్యమివ్వదు. జీవిత రథం సాఫీగా సాగాలంటే బంధాలు బలంగా ఉండాలి. అది నమ్మకమనే పునాదిపై నిర్మితమవుతుంది. అప్పుడే ఆ బంధం పటిష్ట భవనమై చిరకాలం నిలుస్తుంది. స్వార్థాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వదు. స్వార్థం ఉన్న చోట ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్న చోట స్వార్థం నిలవదు. ఈ రెండు కలిశాయంటే ప్రేమ చచ్చిపోయినట్టే. విడిపోవడం చాలా సులువు. కానీ, కలిసి బతకడం గొప్ప. సమస్యలు రావచ్చు. అభిప్రాయ భేదాలు ఎదురుకావచ్చు. మాట పట్టింపులు ముప్పుతిప్పలు పెట్టవచ్చు. అయినా సరే, కడదాకా కలిసి ఉండే ప్రయత్నమే చేయాలి.
ప్రేమంటే.. పవర్ఫుల్
నగరంలో బాగా పేరుమోసిన వ్యక్తి కూతుర్ని ప్రేమిస్తాడు ఓ సాధారణ యువకుడు. అతడు పేదవాడని తెలిసి కూడా ఆ అమ్మాయి మనసు ఇస్తుంది. ఆమె ఆస్తిపాస్తులతో సంబంధం లేదు.. ఆమె ప్రేమే తనకు ముఖ్యమని భావిస్తాడు అతడు. ఒకరునొకరు చూసుకోకుండా క్షణం కూడా ఉండలేరు. పార్కులు, రెస్టారెంట్లు, సిన్మాలు, షికార్లు.. ఇలా ఎక్కడ చూసినా వీళ్లే. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారనే విషయం పెద్దలకు తెలుస్తుంది. అగ్గి మీద గుగ్గిలమవుతాడు అమ్మాయి తండ్రి. అబ్బాయికి వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి తన కూతురి వైపు కన్నెత్తి చూస్తే కండ్లు పీకేస్తానంటాడు. అమ్మాయిని బయటకు వెళ్లకుండా నిర్బంధిస్తాడు. అయినా అబ్బాయి సాహసం చేస్తాడు. అమ్మాయికి ఆ చెర నుంచి విముక్తి కలిగిస్తాడు. ఆమె కుటుంబ సభ్యుల కండ్లు గప్పి దూరంగా తీసుకెళ్లిపోతాడు. అమ్మాయి కనిపించడం లేదని తెలవడంతోనే ఆమె తండ్రి ఆగ్రహంతో ఊగిపోతాడు. తన అనుచరుల ద్వారా వెతికిస్తాడు. ఎట్టకేలకు వాళ్ల ఆచూకీ దొరుకుతుంది. అమ్మాయి ఎదుటే అబ్బాయిని చితకబాదుతారు. అయినా ఆమెను మరచిపోవడానికి అతడు ససేమెరా అంటాడు. దీంతో మరింత కోపోద్రిక్తులై అతడిని హత్యచేయడానికి సిద్ధమవుతారు. అప్పుడు అమ్మాయి అడ్డొస్తుంది. అతడిని చంపాలనుకుంటే ముందు తనను చంపమని అంటుంది. దీంతో తండ్రి మనసు కరుగుతుంది. ఏమిటీ గొప్పదనం.. ప్రేమ ఇంత పవర్ఫుల్గా ఉంటుందా? అనుకుని ఇద్దరిని దగ్గరికి తీసుకుంటాడు. అల్లుడిగా ఆ అబ్బాయిని స్వీకరిస్తాడు.
ఇదంతా సిన్మా స్టోరీలా ఉంది కదూ! అవును.. అలాంటిదే. ఇది సిన్మా స్టోరీ లాంటిదైనా నిజ జీవితంలో కూడా ఇలాంటి కథలు ఉంటాయి. ప్రేమంటే.. అంతేమరి! మహారాజులకోట కంటే గొప్పది ప్రేమ. మహామహుల వేటకైనా చిక్కనిది. మహాశాసనాలనైనా ఎదిరించేది. మరణ ఆసనాలనైనా వేయించేది. ఎలాంటి గుండెనైనా నునువెచ్చని సెగసోకిన వెన్నలాగా కరిగించేది ప్రేమ.
ప్రేమ ఎన్ని రకాలు..?
ఆలోచించి ప్రేమించే వాళ్లుంటారు. ఆకర్షణ వల్ల ప్రేమించేవారూ ఉంటారు. అవసరం కోసం ప్రేమించే వాళ్లు కూడా ఉంటారు. ఆలోచించి ప్రేమించే వారు తమ భవిష్యత్తును, తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని ప్రేమించాలనుకుంటారు. తన కుటుంబ పరిస్థితులను పరిగణనలో తీసుకుంటారు. ముందు చదువు, ఆ తర్వాత జాబ్ లేదా మంచి వ్యాపారం. జీవితంలో సెటిల్ కావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంటారు. ఈ దారిలో ఎన్ని ‘ఆకర్షణలు’ ఎదురైనా మనసు పారేసుకోరు. వారలా చేస్తున్నారంటే ప్రేమంటే వీరికి పడదని కాదు. తమ లక్ష్యాలు, కర్తవ్యాలను నెరవేర్చుకోవాలనే తపనే అలా చేయిస్తుంది. ఇది మంచిదే. తాను సెటిల్ కావాలనుకోవడంలో తప్పులేదు. స్థిరపడ్డాక ప్రేమ గురించి ఆలోచిస్తున్నారంటే దూర దృష్టితో ఆలోచిస్తున్నారనుకోవాలి. అనుకున్నట్టు లక్ష్యాలు సాధించాక ఇలాంటి వాళ్లూ ప్రేమలో పడతారు. అప్పుడు కలిగే ఆత్మసంతృప్తి వెలకట్టనిది.
రెండో అంశం ఆకర్షణ. దీన్ని ప్రేమ అనుకుంటే పొరపాటే. ప్రేమ వేరు, ఆకర్షణ వేరు. ఆకర్షణ ఆయుష్షు చాలా తక్కువ. ఇది కొంతకాలమే ఉంటుంది. ప్రేమ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆకర్షించి ప్రేమించే వారు ఆ ఆకర్షణ ఉన్నంత వరకే ప్రేమించుకుంటారు. ఆ తర్వాత మరో ‘ఆకర్షణ’ మాయలో పడిపోతారు. వీరిది నిలకడ లేని మనస్తత్వం. ఇక మూడో అంశం.. అవసరం కోసం పుట్టే ప్రేమ. అన్నింటికన్నా ఇది ప్రమాద కరమైనది. ఎప్పుడైతే తమ అవసరం తీరిపోతుందో అప్పుడు ఈ ప్రేమ కూడా ముగిసిపోతుంది. నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు.
ప్రేమ వర్ధిల్లాలంటే..
ప్రేమను పంచటంలో ఉండే ఆనందం వేరు.. ప్రేమను స్వీకరించడంలో ఉండే ఆనందం వేరు. మనం కావాలనుకున్న వారు ఎప్పుడూ మనతోనే ఉంటారు. బంధాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలనుకున్న వారు నిస్వార్థంగా వ్యవహరిస్తారు. అహంభావాన్ని దరిదాపుల్లోకి రానివ్వరు. ఒకర్నొకరు ఉత్సాహ పర్చుకుని ముందుకు వెళ్తారు. అప్పుడే ప్రేమ వర్ధిల్లుతుంది.
1. కమ్యూనికేషన్
బంధాల బీటలకు తొలి కారణం.. కమ్యూనికేషన్ లోపించడం. అలా అని, సన్నిహితులకు మన విషయాలన్నీ చెప్పాలని మాత్రం కాదు. వాళ్లంతట వాళ్లే అర్థం చేసుకుంటారని అనుకోవడమూ మంచిది కాదు. కాకపోతే మనం చెప్పదలచుకున్న విషయంలో స్పష్టత ఉంటే సరిపోతుంది.
2. పరస్పర నమ్మకం
నమ్మకం దానంతట అదే రాదు. నిరంతర ప్రయత్నాలతో నిర్మించుకోవాలి. ఎదుటివారి బాధలను సానుభూతితో అర్థం చేసుకోవాలి. అలా నమ్మకాన్ని నెమ్మదిగా పటిష్ఠం చేసుకోవాలి. అయితే, నమ్మకం ఒక్కసారి దెబ్బతింటే మళ్లీ పునర్నిర్మించుకోవడం కష్టం. ఏ బంధానికైనా నిజాయతీ పునాది.
3. గౌరవం- సమానత్వం
గౌరవం లేని ప్రేమ నిలబడదు. కాబట్టి, ఎదుటి మనిషి ప్రవర్తన మనకు కష్టంగా అనిపించినట్టే, మన ప్రవర్తన కూడా సన్నిహితులకు కష్టంగా తోచవచ్చు. కించిత్ కూడా ఆధిపత్య ధోరణి కూడదు. మన విలువలు, నైతికత, ప్రవర్తన ఉన్నతంగా ఉండాలి. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి.
4. మద్దతు- ప్రోత్సాహం
నేను అనుకోవడం కంటే.. ‘మనం’ అనుకున్నప్పుడే బంధాలు ఎక్కువ కాలం మన్నుతాయి. ఒక్కోసారి సన్నిహితులతో ఏకీభవించకపోయినా సరే.. వారి నిర్ణయాలకు అండగా నిలవాలి. పరిస్థితులు తలకిందులైనప్పుడు కూడా సన్నిహితుల వెన్నంటి ఉండాలి.
5. సంక్షోభంలో ధైర్యం
కష్టకాలంలో మనం ఎలా ప్రవర్తిస్తాం అనే దానిపైనా జీవిత భాగస్వామి సహా సన్నిహితులతో మన సంబంధాలు ఆధారపడి ఉంటాయి. మనం ధైర్యంగా ఉంటేనే వాళ్లూ తమ కష్టసుఖాలను మనతో పంచుకుంటారు. దయ, సహానుభూతి ఈ విషయంలో కీలకంగా నిలుస్తాయి.
6. సాన్నిహిత్యం, ఆపేక్ష
మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మనం అనుకున్న వాళ్ల యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉండాలి. సన్నిహితుల పట్ల నిరంతరం ప్రేమ, అనురాగం చూపించాలి.
7. స్వతంత్రం
మానవ సంబంధాల్లో అత్యంత ముఖ్యమైనది, చాలావరకు మనం పట్టించుకోనిది ఒకటుంది.. మన సన్నిహితులకు కూడా వారిదైన జీవితం ఒకటి ఉంటుంది. కెరీర్, కుటుంబాలు, హాబీలు ఇందులో భాగంగా ఉంటాయి. ఈ సంగతి మరిచిపోవద్దు.
అనుమానం పెరిగితే..
సంసారంలో కోపతాపాలు.. అరుచుకోవడం. ఆపై.. అనునయించుకోవడం వంటివి మామూలే. అక్కడితో ఆ వివాదానికి ముగింపు ఉండాలి. అలాకాకుండా ఒకరిపై మరొకరు అనుమానపడటం మొదలైతే ఆ బంధం బలహీనపడే ప్రమాదం ఉంది. భార్యాభర్తల్లో ఒకరిపై మరొకరికి పూర్తి నమ్మకం ఉండాలి. ఇరువురూ దాన్ని వమ్ము చేసుకోకుండా కాపాడుకుంటేనే ఆ బంధం బలంగా ఉంటుంది. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పడం లేదా ముందు రోజు చెప్పిన కారణాన్ని మర్చిపోయి మరోలా వివరించడం వంటివన్నీ భాగస్వామికి మీపై నమ్మకాన్ని దూరం చేస్తాయి. అబద్ధం చెప్పకుండా అసలైన కారణాన్ని చెప్పడం మంచిది. లేదంటే ఆ తర్వాత నిజం తెలిసినప్పుడు తనను ఎదుటివారు మోసం చేశారని భావించే ప్రమాదం ఉంది. జీవితభాగస్వామి తనతో అబద్ధాలు చెబుతున్నారనే ఆలోచన వారిని అభద్రతా భావంలోకి నెట్టేస్తుంది. మోసం చేస్తున్నారనే అనుమానం మొదలవుతుంది. అసూయగా మారకుండా.. మొదట్లోనే తమ మధ్య అనుమానానికి చోటివ్వకుండా ఉండటానికి దంపతులిద్దరూ ప్రయత్నించాలి. అనుమానం పెనుభూతంగా మారడమే కాకుండా, క్రమేపీ అది అసూయగా పరిణమిస్తుంది. అందుకే జరిగిన సందర్భాన్ని లేదా విషయాన్ని వివరంగా చెప్పాలి. ఒకవేళ మీకే అనుమానం వస్తే ఎందుకో వివరంగా కూర్చొని మాట్లాడాలి. ఇరువురూ చర్చించుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. మరోసారి అటువంటి సందర్భం రాకుండా ఉంటుంది.
– అనంతోజు మోహన్కృష్ణ, 8897765417
]]>– మదన్ మోహన్ రెడ్డి 9989894308
]]>కవిత్వమంటే వసంతం రాక మానదని చెప్పే ఒక ఆశావాదం. దాడికి ప్రతిదాడి. సజనాత్మక ప్రతిఘటన. మనల్ని మనం మానవీకరించుకోవటానికి పనికొచ్చే కళాత్మకమైన పనిముట్టు.
– దొంతం చరణ్
కవిత్వమంటే ఆలోచనలకు, అక్షరాలకు మధ్య జరిగే సంధి. భావోద్వేగాలకు, భావార్థాలకు మధ్య జరిగే పొత్తు. సున్నితమైన ఊహలను కవిత్వం చేయాలనుకుంటాను. బతుకు చట్రంలో వెంటాడే అనేక విషయాలను కవిత్వంలోకి తీసుకురావాలనుకుంటాను. ఇవాళ్టి కాలానికి రాయాల్సిన కవిత్వం చాలా వుంది.
– సుంక ధరణి
కవిత్వమంటే ఒక్కో కవికీ/ కవయిత్రికి ఒక్కో రకమైన నిర్వచనం వుండి వుంటది. అది సమాజం పట్ల వాళ్ళ దక్పథాలను, వాళ్ళ ఆలోచనల్ని ప్రతిబింబిస్తూ వుంటది.
అందరిలాగే కవిత్వమంటే నాకూ ఓ నిర్వచనం వుంది. ”మతం, మార్కెట్ రెండూ ఒక్కటై విశాల ప్రజా సముహంపై దాడి చేస్తున్నప్పుడు మనుషులని సామాజికంగా, వ్యక్తిగతంగా కాపాడేది. మనిషిగా నిలబెట్టేది. అవసరమైన ప్రతీ చోట మనిషిని చైతన్యవంతంగా తీర్చి దిద్దేది.” మార్పు కోసం మాత్రమే కాదు మీలో మనిషితనం కాపాడుకోవడం కోసం ప్రతీ ఒక్కరూ కవిత్వం రాయండి.
– అమృత రాజు
కవిత్వం నాకు మానసిక ఆత్మకథ లాంటిది. అందులో ప్రజల ఏడుపు, పోరాటం, శ్రమ, సౌందర్యం కలిసి ఉంటాయి. కాబట్టి అది సామూహిక ఆత్మకథ అవుతుంది. ఆ సామూహిక ఆత్మకథను చెప్పటం కోసం నేను కవిత్వం రాస్తాను.
– గూండ్ల వెంకట నారాయణ
– అనంతోజు మోహన్కృష్ణ, 8897765417
]]>– సలీమ,
94900 99083