– రంపచోడవరం సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుకై కదిలిన తెలంగాణ బందం
– ముంపు మండలాలలో సీపీఐ(ఎం) తెలంగాణ నేతల ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కమ్యూనిస్టుల కంచుకోటగా పిలవబడిన పూర్వపు భద్రాచలం డివిజన్లో ఆనాటి ఉద్యమాల జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ రంపచోడవరం సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి లోత రామారావు గెలుపుని కాంక్షిస్తూ పూర్వపు భద్రాచలం డివిజన్ ఉద్యమ నాయకులు ముంపు మండలాలలో విస్తతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సీపీఐ(ఎం) నుండి మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 13న జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ బలపరుస్తున్న సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి లోత రామారావు, సీపీఐ(ఎం) అరకు పార్లమెంటు అభ్యర్థి పాచిపట్ల అప్పలనర్సుల గెలుపుని కాంక్షిస్తూ మన్నెంలో ఉద్యమ ఓనమాలు నేర్చుకున్న పూర్వపు భద్రాచలం డివిజన్ నాయకులు ప్రస్తుత సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, నాయకులు ఎంబీ. నర్సారెడ్డి బండారు శరత్ బాబు, ఎర్రంశెట్టి వెంకట రామారావు, నాదెండ్ల లీలావతి, డీ.సీతాలక్ష్మిలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు మండలపు జ్యోతి, కే.సత్యాలు విస్తతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని చింతూరు వీఆర్ పురం కూనవరం ఎట్టపాక మండలాలలో భద్రాచలం డివిజన్ నాయకులకు విడదీయలేని ఉద్యమ అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. తునికాకు పోరాటాలైన పోలవరం వ్యతిరేక ఉద్యమాలైన ఆదివాసి హక్కుల సాధనాలైనా ఈ ప్రాంత ఉద్యమ సరళిని అణువణువునా తెలిసిన బండారు రవికుమార్ కూనవరం వీఆర్ పురం చింతూరు మండలాలలో పాతతరం నాయకుల చరిత్రలను తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన బండారు చందర్రావు, భీష్మారావు, శ్యామల, వెంకటరెడ్డి, టివిఆర్ చంద్రం, పులి రామయ్య, మడివి ముకయ్యలతోపాటు మచ్చలేని ప్రజాప్రతినిధులైన కుంజా బుజ్జి సున్నం రాజయ్య చరిత్రను ఈ నేటితరం యువతకు తెలియపరుస్తూ గిరిజన సంస్కతి సంప్రదాయాలను అద్దం పట్టేలాగా ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం డివిజన్ నుండి పార్టీ పట్టుకొమ్మలుగా ఉన్న నాలుగు మండలాలు ఆంధ్రలోకి వెళ్లినప్పటికీ ఆ ప్రాంత ప్రజలతో ఆ ప్రాంత నాయకులతో వీరుకున్న అనుబంధాన్ని సంబంధాన్ని నెమరేసుకుంటూ ఎన్నికల కథనరంగంలో రంపచోడవరం నియోజక వర్గంలో ఎర్రజెండాను ఎగిరేసేందుకు శక్తి వంచన లేకుండా కషి చేస్తున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ వైఫల్యాలతో పాటు ఈ ప్రాంతానికి ఎన్డీఏ కూటమి చేసిన అన్యాయ ఫలితంగా సీపీఐ(ఎం)కి అంతకంతకు ప్రజల నుండి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గంలో ఈ ఎన్నికలలో ఎర్రజెండా రెపరెపలాడటం ఖాయమని స్పష్టమవుతుంది. సీపీఐ(ఎం) నిలబెట్టిన లోత రామారావు సైతం ప్రజా ఉద్యమాలలో రంపచోడవరం పరిధిలో ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తి కావడంతో ఎన్నికలలో సీపీఐ(ఎం) గెలుపు ఖాయమని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రాంతాలుగా విడిపోయిన ఉన్న ఉద్యమ సంబంధాలతో ఆదివాసి గిరిజన ప్రజల చెంతకు ఎర్రజెండాను తీసుకువెళ్లడం కోసం రాష్ట్ర సరిహద్దును దాటి సీపీఐ(ఎం) తెలంగాణ నేతలు చేస్తున్న కషిని అభ్యుదయ వాదులు అభినందిస్తున్నారు.
ప్రాంతాలుగా వేరైనా ఉద్యమ బంధాలు విడిపోవు..సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు
బండారు రవికుమార్
రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ముంపు పేరుతో భద్రాచలం డివిజన్ని ముక్కలుగా విభజించి సీపీఐ(ఎం)కి ఉద్యమాల పట్టుకొమ్మగా ఉండే చింతూరు వీఆర్ పురం, కూనవరం, ఎట్టపాక మండలాలను భద్రాచలం డివిజన్తో విడదీసి నాటి తెలుగుదేశం, బీజేపీలు ఆంధ్రాలో కలిపినప్పటికీ ఈ ప్రాంత ప్రజలతో ఉన్న ఉద్యమ బంధాలను ఎప్పటికీ విడదీయలేరు. పూర్తి స్థాయిలో ఆదివాసి సంస్కతి, సంప్రదాయాలు కలిగిన నాలుగు మండలాల ఆదివాసి ప్రజల కోసం బండారు చందర్రావు, భక్తుల భీష్మారావు, శ్యామల వెంకటరెడ్డి, పులి రామయ్య, మడివి నూకయ్య వంటి సీపీఐ(ఎం) ఉద్యమ నిర్మాతలు, నక్సలైట్లతో పోరాడి తమ ప్రాణాలర్పించిన చరిత్ర సీపీఐ(ఎం)కే ఉంది. పోరాటాలతో పాటు ఈ ప్రాంత సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులు నిస్వార్థ పాలన ఫలితంగానే నాలుగు మండలాల అభివద్ధి అన్న విషయం ఈ ప్రాంత ప్రజలకు తెలియంది కాదు. సీపీఐ(ఎం) త్యాగాలను స్మరిస్తూ ఈ నెల 13 న జరిగే ఎన్నికల ప్రచారం ఉద్యమ పందాలు కొనసాగుతుంది. ప్రజల్లో రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణను చూస్తే కచ్చితంగా మరోసారి మన్యంలో ఎర్రజెండా రెపరెపలాడటం ఖాయమని స్పష్టమవుతుంది.
]]>