నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో స్పెయిన్కు చెందిన క్రిస్టియన్ రాబర్టో (70,200 మెట్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలనే సందేశాన్ని చాటేందుకు ఈ రికార్డు సృష్టించినట్లు ఆయన తెలిపారు. స్థానిక వైశాలి నగర్లో మొత్తం 439 మెట్లున్న 20 అంతస్తుల భవనాన్ని హిమ్మత్సింగ్ 81 సార్లు ఎక్కి, 80 సార్లు దిగారు. సోమవారం (మే 6) సాయంత్రం 5.30 గంటలకు మెట్లు ఎక్కడం ప్రారంభించి, మంగళవారం సాయంత్రం 5.22 గంటలకు పూర్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల పీఈటీల బృందం ఈ విన్యాసాన్ని పర్యవేక్షించింది. హిమ్మత్సింగ్ మెట్లు ఎక్కుతున్న దృశ్యాలను గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కు పంపుతామని పీఈటీ సంతోష్ రాఠోడ్ తెలిపారు.
]]>
అధ్యయనం ప్రకారం..
వార్షిక క్యాన్సర్ కేసుల సంఖ్య దాదాపు 2020లో దాదాపు 1.4 మిలియన్ల నుంచి 2025 నాటికి 1.57 మిలియన్లకు పెరుగుతుందని అధ్యయనం అంచనా వేసింది. రొమ్ము, గర్భాశయం, అండాశయ క్యాన్సర్ మహిళలపై ప్రభావితం చూపితే, పురుషులలో ఊపిరితిత్తుల, నోటి క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. రాబోయే రెండు దశాబ్దాలలో ”క్యాన్సర్ కేసులు, మరణాలు మరింత పెరుగుతాయని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి భావిస్తున్నారు” వద్ధాప్యం, అనారోగ్యకరమైన ఆహారం, క్యాన్సర్ కారకాలతో నిండిన వాయు కాలుష్యానికి గురికావడం, వాతావరణ మార్పు వల్ల కూడా ఈ కేసులు పెరుగుతు న్నాయి. అపోలో హాస్పిటల్స్ నివేదిక ప్రకారం ఇతర దేశాల కంటే భారతదేశంలోని కొన్ని క్యాన్సర్లు తక్కువ వయస్సున్న వారిపై ప్రభావం చూపుతున్నాయి.