Sopathi Archives - https://navatelangana.com/category/sopathi/ Sat, 19 Apr 2025 17:42:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Sopathi Archives - https://navatelangana.com/category/sopathi/ 32 32 చీకట్లోకి నెట్టేసే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ https://navatelangana.com/betting-online-pushing-into-the-dark/ Sat, 19 Apr 2025 17:41:34 +0000 https://navatelangana.com/?p=549400 Online betting that leads to darknessసత్యం 35 ఏళ్ల యువకుడు. ఆశలతో, చిన్న మొత్తంలో మొదలైన ఓ సరదా అతని జీవితాన్ని చీకటిలోకి నెట్టేసింది. ఐపీఎల్‌ బెట్టింగ్‌ యాప్‌లో తొలిసారి వంద రూపాయలు గెలవడంతో అతనికి కొత్త ఆశ కలిగింది. ఒక్కసారిగా లక్షలు సంపాదించగలనన్న భ్రమలో మునిగిపోయాడు. ఆతర్వాత చిన్న చిన్న నష్టాలను తట్టుకుని ముందుకు సాగాడు. కానీ కొన్ని నెలల్లోనే కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అప్పులు పెరిగి, బంధువులు, స్నేహితులందరూ దూరమయ్యారు. కుటుంబ సభ్యులు చివరి అవకాశం ఇస్తూ, నా దగ్గరికి కౌన్సెలింగ్‌కు తీసుకురాగా, అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు మన మనసును, ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మొదట ఒక చిన్న మొత్తంతో ఆడించి, కొంత నష్టపోయినా తిరిగి గెలుస్తానన్న ఆశను పెంచుతాయి. మన మెదడు డోపమైన్‌ అనే కెమికల్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆనందాన్ని కలిగించే హార్మోన్‌. మొదట గెలిచిన ఆనందంతో, ఆడటం కొనసాగిస్తారు. కానీ కొంతకాలానికి, గెలుపుల కంటే ఎక్కువ నష్టాలు వస్తాయి. అప్పటికే మెదడు ఈ యాప్స్‌కు అలవాటైపోయి, ఆగలేని పరిస్థితి ఏర్పడుతుంది.
బెట్టింగ్‌ ప్రభావం- కుటుంబాలపై దెబ్బ
బెట్టింగ్‌ వ్యసనం ఉన్నవారు ఇంట్లో ఎవరితోనూ మట్లాడరు. డబ్బు తిరిగి తెచ్చుకోవాలన్న తాపత్రయం, అప్పుల ఒత్తిడి వల్ల ఇంట్లో గొడవలు మొదలవుతాయి. చివరకు కుటుంబ బంధాలు తెగిపోతాయి. చాలామంది భార్యాభర్తల పట్ల నమ్మకం కోల్పోయి విడాకులు కోరుతున్నారు. ఆ ప్రభావం పిల్లల భవిష్యత్తుపై పడుతుంది.
తీవ్ర ప్రభావాలు – ఆత్మహత్యలు, మానసిక సమస్యలు
నష్టం తీవ్రంగా పెరిగినప్పుడు డిప్రెషన్‌ (ఉదాసీనత), ఆత్మహత్యా భావనలు పెరుగుతాయి. చాలామంది దీనికి బలవుతున్నారు. సమాజం ఈ వ్యసనాన్ని చిన్నగా చూడకూడదు. ఇది మద్యం, డ్రగ్స్‌ లాంటి ప్రమాదకరమైన వ్యసనమే.
సమస్య నుంచి బయట పడటానికి మార్గాలు
1. సహాయం కోరాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సైకాలజిస్టులను సంప్రదించాలి.
2. కుటుంబ సభ్యులు సహకరించాలి. బాధితులను తప్పుపట్టకుండా వారికి మద్దతుగా ఉండాలి.
3. ఆర్థిక నియంత్రణ పాటించాలి. డబ్బు ఖర్చు చేయడంపై నియంత్రణ పెంచాలి.
4. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. బెట్టింగ్‌ యాప్‌లపై కేసులు పెట్టి వీటిని ఆపే ప్రయత్నం చేయాలి.
సత్యం లాంటి వారిని కోల్పోకుండా, ముందుగా వారికి సహాయం చేయడం అవసరం. బెట్టింగ్‌ యాప్‌లు కేవలం గెలుపు ఆశ చూపిస్తాయి కానీ చివరికి మన జీవితాన్ని మింగేస్తాయి. మనకు ప్రియమైనవారు ఈ వ్యసనంలో పడకుండా చూడాలి. సమాజం కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ మానసిక వ్యాధిని అరికట్టాలి.
”సమయానికి ఆగితే గెలుపు, అలా కాకపోతే జీవితమే ఓటమి!”
డా|| హిప్నో పద్మా కమలాకర్‌, 9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

]]>
వింత లోకంలో మైమరపించిన పాట https://navatelangana.com/a-song-that-was-mesmerized-in-the-strange-world/ Sat, 19 Apr 2025 17:39:10 +0000 https://navatelangana.com/?p=549397 A mesmerizing song in a strange worldహృదయాన్నే దోచేసే అందమొకటి కళ్ళముందు కనబడితే హాయివానల్లో తడిసినట్టనిపిస్తుంది. జీవితానికి ఓ అందమైన వరం దొరికినట్టనిపిస్తుంది. ఆ అందాన్నే పొందాలనిపిస్తుంది. అదే బతుకుకు ధన్యమనిపిస్తుంది. అలాంటి అపురూపమైన అందాన్ని చూసినపుడు కలిగే ఆనందం ఎలా ఉంటుందో ఈ పాట తెలియజేస్తుంది. 2024 లో వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో తిరుపతి జావన-శేఖర్‌ చంద్ర రాసిన పాటనిపుడు పరిశీలిద్దాం.
ఊహలకందని అందమొకటి కన్నులకు విందు చేస్తూ, మనసును పులకింతలతో పునీతం చేస్తుంటే ఎవరూ ఏమి చేయలేని స్థితిలో ఉంటారు. ఆ అందాన్ని చూస్తూ మైమరచిపోతుంటారు. తిరుపతి జావన-శేఖర్‌ చంద్ర అలతి అలతి పదాల్లో ఆ అందాన్ని వర్ణిస్తూ అందమైన పాట రాశారు. ఈ పాట ఎంతమంది హృదయాలను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ నటన ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. హీరో తొలిసారిగా హీరోయిన్‌ను చూసినపుడు ఎలా అనుభూతి చెందుతాడో ఈ పాట చెబుతుంది.
కొత్తగా కంటికి కనబడిన అందమది. చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవడం లేదు. అలా అని మనసుతో చూస్తే కూడా.. మనసు ఆ అందాన్ని చూసి స్వర్గలోకాల అంచుల్లో విహరిస్తూ ఉంది. ఇక ఆ అందాన్ని చూసినప్పుడు మాటలు రావు. పాటలూ రావు. ఆ అనుభూతిని చెప్పడానికి ఏ కావ్యాలూ సరితూగవు. చూస్తూ నిశ్చేష్టులమవ్వడమే మన పని. కొంతసేపటికి తేరుకొని, యధాస్థితికి వచ్చి, ఆ అనుభూతిని ఉన్నది ఉన్నట్లుగా చెబితే ఎలా ఉంటుందో ఈ పాట చెబుతుంది.
ఇన్ని రోజుల వరకు ఇలాంటి వింత మైకంతో కూడిన లోకాన్ని నేను చూడలేదు. మనసెప్పుడూ ఇంత గొప్ప ఆనందాన్ని పొంది ఎరుగదు. మొదటిసారిగా నిన్ను చూశాకే ఇలాంటి ఆశ్చర్యానికి, అనుభూతికి లోనయ్యాను. నా మనసు నిన్ను చూసి తొలిసారిగా జారిపోయింది. ప్రేమలో సాగిపోయింది. అసలు ఈ మాయ ఏమిటి? ఎందుకిలా అవుతుంది? పిచ్చివాడిలా నాకు నేను కనబడతున్నాను. ఏం చేయాలో, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.. అంటే.. గొప్ప సౌందర్యాన్ని చూసినప్పుడు మనసు పొందే పరవశం ఎలా ఉంటుందో ఇక్కడ అర్థమవుతుంది. మనిషి పేరుకే ఈ లోకంలో ఉన్నాడు. అతను ఎటూ తోచని సందిగ్ధస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆనంద సౌందర్యాలను ఆస్వాదిస్తున్నాడు. సౌందర్యమే ఆనందంగా భావిస్తున్నాడు.
అంత అందం చూశాక ఇక పొందకపోతే జన్మ వృథా అనిపిస్తుంటుంది. ఇక్కడ హీరోకి కూడా అదే అనిపిస్తుంది. అతడు దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఆమెనే తన జీవితానికి తోడుగా పొందాలని ఫిక్స్‌ అయిపోయాడు. ఆమెను వదిలి ఉండలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఆమెను ఊపిరిలా భావిస్తున్నాడు. ఊపిరి విడిచిన ప్రాణం ఉండదు. ఆమెను విడిచిన బతుకూ ఉండదు. ఇది అతని ప్రస్తుత స్థితి. ఇక ఆమెను చూసినప్పటి నుంచి అతని కంటికి నిద్ర కరువయ్యింది. ఇది అంతా ఆమె మాయనే. అతడు సోయిలో లేడు. మనిషిగా భూమి మీద లేడు. స్పర్శ కూడా లేని లోతైన అనుభూతుల లోయల్లోకి వెళ్ళిపోయాడు.
ఆమెను చూడగానే ఇంకా ఎలా ఎలా అనిపిస్తుందో చెబుతున్నాడు. మనసులోపల వింత వింతగా ఉందట.. నది నుంచి బయటకి వచ్చి ఒడ్డున పడ్డ చేపలా ఉందట అతని మన:స్థితి. అంటే.. అంత విలవిలలాడుతున్నాడు. కరిగి కరిగి జలజల పారుతున్నాడు.
హీరో నడిపే ఆటోలో ఆమె ఎక్కి కూర్చుంటుంది. ఆమె ఎక్కడో దూరంగా ఉంటే అతని సంగతి వేరేలా ఉండేది. కొంత హద్దుల్లో అతని మనసుండేదేమో. కాని ఇక్కడ శృతి మించిపోయింది. ఆమె అతని పక్కనే ఉంది. అతన్ని పదేపదే తాకుతూ ఉంది. అదే అతను మరీమరీ పులకించిపోవడానికి కారణమైంది. పూలకొమ్మలాగా ఆమె వంగి వంగి, తన పక్కనే కూర్చొని జరిగి జరిగి తాకుతుంటే అతని మనసు ఎటో ఎటో పోతోంది. ఆటో వెళ్ళే దారి ఎలా ఉన్నా మనసు మాత్రం దారిమళ్ళేసింది. ఇక ఆమెనే అలా చూస్తూ, తాకుతూ ఉంటే ఆ తన్మయత్వానికి తాను తాళలేకపోతున్నానని, తాగకుండానే కిక్కెక్కిపోతుందని చెబుతుంటాడు. మనసుతో పాడుతుంటాడు.
పాట:
ఇంతకాలమూ లేదే వింత లోకమూ/ యెంటే జారిపడ్డదే మనసే నీకే నీకే/ ఏందమ్మడూ ఏందమ్మడూ/ పిచ్చోన్నయ్యా సే వాట్‌ టు డు/ ఈ కుర్రాడు ఫిక్సయ్యాడు నిన్నొదిలి పోనేపోడు/ ఊపిరై నువ్విక వీడనే వీడవే/ ఊహకే నిదురిక ఉండనే ఉండదే/ మాయ మాయ మాయ మాయ మాయ మాయమ్మ/ సోయ సోయ సోయ సోయ సోయే లేదమ్మా/ మనసు లోపల ఒడ్డున చేపలా ఉందిలే పిల్ల నీ వల్ల/ పూలకొమ్మలా వంగి వంగిలా తాకుతుంటే పడేదెల్లా/ నా వల్ల కాదే బొమ్మా… నీ కళ్ళు చూస్తే అమ్మా/ కిక్కెక్కుతోందే జన్మా హమ్మ హమ్మ హమ్మ..
– డా||తిరునగరి శరత్‌చంద్ర,

[email protected]
సినీ గేయరచయిత, 6309873682

]]>
ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌తో హోలిస్టిక్‌ ఆరోగ్యం https://navatelangana.com/holistic-health-with-integrated-medicine/ Sat, 19 Apr 2025 17:32:11 +0000 https://navatelangana.com/?p=549391 (allopathy)ఆధునిక జీవనశైలి, పర్యావరణ కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల శరీరంలోహొఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌హొ(ఆక్సిజన్‌ రాడికల్స్‌ వల్ల కలిగే ఒత్తిడి) పెరుగుతుంది. ఇది క్రమంగాహొక్రోనిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌ ((Chronic Inflammation)కు దారితీసి, హదయ రోగాలు, మధుమేహం, క్యాన్సర్‌, న్యూరోడిజనరేటివ్‌ (అల్జైమర్స్‌, పార్కిన్సన్స్‌) వంటి అనేక దీర్ఘకాలిక రోగాలకు కారణమవుతుంది.
ఈ వ్యాసంలో ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ ఎలా దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుందో,హొఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ (సమగ్ర వైద్యం)హొద్వారా హోలిస్టిక్‌ ఆరోగ్యాన్ని ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం.
ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌, దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులు
1. ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ అంటే?
శరీరంలోహొఫ్రీ రాడికల్స్‌హొ(క్రియాశీల ఆక్సిజన్‌ అణువులు), యాంటీఆక్సిడెంట్లహొ(వాటిని తటస్థీకరించే పదార్థాలు) మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ ఏర్పడుతుంది.
ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ అనేది శరీరంలో ఆక్సిజన్‌ రియాక్టివ్‌ species (ROS) అనే హానికరమైన మూలకాల మోతాదు పెరిగినప్పుడు జరుగుతుంది.
ఫ్రీ రాడికల్స్‌ ఎక్కువగా ఉంటే, అవి శరీర కణాల్లోని ప్రోటీన్లు, కొలెస్ట్రాల్‌, DNA వంటి ముఖ్యమైన అణువులను దెబ్బతీస్తాయి. ఈ పరిస్థితి రోగనిరోధక శక్తిని తగ్గించి, శరీరంలో కణజాల నష్టాన్ని కలిగిస్తుంది.
ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ వల్ల క్రోనిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌: దీర్ఘకాలిక వ్యాధులకు గల ప్రధాన కారణం మన శరీరంలో ప్రాకతికంగా ఫ్రీ రాడికల్స్‌ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి శరీర కణాలను రక్షించడానికి, యాంత్రిక చర్యలకు తోడ్పడతాయి. కానీ ఎక్కువ మొత్తంలో ఫ్రీ రాడికల్స్‌ ఉత్పత్తి అయితే, అవి ఆరోగ్యానికి హానికరమైన ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను కలిగిస్తాయి.
ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ వల్ల క్రోనిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌ ఎలా జరుగుతుంది?
కణాల నష్టానికి దారితీస్తుంది: ఫ్రీ రాడికల్స్‌ DNA, ప్రోటీన్లు, సెల్‌ మెంబ్రేన్లపై దాడి చేస్తాయి.
ఇమ్మ్యూన్‌ సిస్టమ్‌ ప్రతిస్పందన: ఈ నష్టాన్ని గుర్తించిన శరీరం ఇన్‌ఫ్లమేటరీ రసాయనాలు విడుదల చేస్తుంది.
ఇన్‌ఫ్లమేషన్‌ శాశ్వతంగా మారుతుంది: శరీరం స్థిరంగా ఇన్‌ఫ్లమేటరీ స్థితిలో ఉండటం వల్ల ఇది క్రోనిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌గా మారుతుంది.
దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులకు కారణం:
క్రోనిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల కొన్ని ముఖ్యమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉత్పన్నమవుతాయి. ఇవి అన్ని కూడా క్రోనిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌ను ప్రేరేపించేవే కాదు, దాని ప్రభావానికి లోనయ్యేవి కూడా హదయ సంబంధిత వ్యాధులు (Cardiovascular diseases), ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ రక్తనాళాల్లో ప్లాక్‌ ఏర్పడేలా చేసి, హదయానికి రక్త సరఫరా తగ్గిస్తుంది. ఇది హార్ట్‌ అటాక్‌కి లేదా స్ట్రోక్‌కి దారితీస్తుంది.
టైప్‌-2 షుగర్‌(Type-2 Diabetes)
ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ కణాలలో ఇన్సులిన్‌ను గుర్తించగల శక్తిని తగ్గిస్తుంది. దీని వలన షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉండవు.
క్యాన్సర్‌
DNA ను హానిచేసే రియాక్టివ్‌ ఆక్సిజన్‌ స్పీషీస్‌ మ్యూటేషన్‌లకు కారణమవుతాయి. ఇవి కణాలు అబద్ధంగా పెరగడానికి దారితీస్తాయి. ఇది క్యాన్సర్‌కు దారితీయవచ్చు.
నాడీ సంబంధిత వ్యాధులు ((Neurodegenerative diseases))
పార్కిన్సన్‌, అల్జీమర్స్‌ వంటి వ్యాధులకు కారణం ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ కావచ్చు. ఇవి మెదడు కణాలనూ నెమ్మదిగా ధ్వంసం చేస్తాయి.
ఇంటెగ్రేటివ్‌ మెడిసిన్‌ – సమగ్ర ఆరోగ్యానికి దారి
ఇంటెగ్రేటివ్‌ మెడిసిన్‌ అనేది పాశ్చాత్య వైద్యం(allopathy) సంప్రదాయ/ ప్రాకతిక వైద్య విధానాలను (ఆయుర్వేదం, యోగా, ఎనర్జీ హీలింగ్‌ బయో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, పోషణ, ధ్యానం) సమ్మిళితంగా ఉపయోగించి శరీరం, మనస్సు, మనోవ్యవస్థ మరియు ఆత్మను సమగ్రంగా దష్టిలో ఉంచే వైద్య విధానం.
ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ పరిష్కారాలు
యాంటీఆక్సిడెంట్‌ సప్లిమెంట్స్‌: విటమిన్‌ సి, ఇ, క్యూర్సెటిన్‌, రెస్వెరాట్రాల్‌హొవంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ని తటస్థీకరిస్తాయి.
గ్లూటాథియోన్‌హొ(శరీరంలోని ప్రధాన యాంటీఆక్సిడెంట్‌) స్థాయిలను పెంచుతాయి.
ఆహారంలో మార్పులు: పచ్చి కూరగాయలు, పండ్లు, గింజలు, సీడ్స్‌హొ(అవకాడో, బెర్రిస్‌, బాదం) యాంటీఆక్సిడెంట్లతో సమద్దంగా ఉంటాయి.
చికిత్సలు:హొ మెడిటేషన్‌ మైండ్‌ఫుల్నెస్‌, (ఎనర్జీ హీలింగ్‌ (బయో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, మైండ్ఫుల్‌నెస్‌, ఒత్తిడిని తగ్గించి హౌలిస్టిక్గా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కౌన్సిలింగ్‌:హొ సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ మానసిక భావోద్వేగ సంక్షోభాలను మెరుగుపరుస్తాయి
ఆంటీ-ఇన్ఫ్లేమేటరీ ఆహారాలు:హొటర్మరిక్‌, అల్లం, ఆలివ్‌ ఆయిల్‌. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించడంలో సహాయపడతాయి
లైఫ్‌స్టైల్‌ మేనేజ్మెంట్‌: యోగా, ధ్యానం వ్యాయామం, నిద్ర, ద్వారా శరీరంలోని హొఒత్తిడిని తగ్గించి సమతుల్యంగా ఉంచడం
నేచురల్‌ సప్లిమెంట్స్‌: టర్మరిక్‌ (హల్దీ), అశ్వగంధ వంటి ఔషధ మొక్కలు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించగలవు.
ముగింపు:
ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ క్రోనిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌కు మూలకారణం. ఇది శరీరంలోని అనేక అవయవ వ్యవస్థలను ప్రభావితం చేసి, దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. దీనిని సమర్థవంతంగా నియంత్రించడానికి, ఇంటెగ్రేటివ్‌ మెడిసిన్‌ ద్వారా శరీరం, మనస్సు, ఆత్మను సమగ్రంగా సంరక్షించడం అవసరం.
”ఆరోగ్యం అంటే కేవలం రోగాలు లేకపోవడం కాదు. శరీరం, మనస్సు, ఆత్మ యొక్క సమగ్ర సామరస్యం.”
ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌, దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందాలంటే,హొ”నిజమైన నయం అనేది ప్రకతితో సహజ సామరస్యంలో జీవించడంలోనే నిహితమై ఉంది.”
”ఆరోగ్యం అనేది ప్రయాణం, గమ్యం కాదు”హొఈ ప్రయాణంలో ప్రతి రోజు చిన్న చిన్న మార్పులు, పెద్ద పెద్ద విజయాలకు దారి తీస్తాయి!
”జీవితాన్ని జీవించండి, కేవలం బ్రతకకండి! మరో మూల కారణంతో, వచ్చేవారం మళ్ళీ కలుద్దాం.

Dr.Prathusha. Nerella
MD(General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician, Positive Psychologist certified Nutritionist, Diabetes And Lifestyle Expert, Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach. Ph: 8897684912/040-49950314

]]>
పరీచ్చలు రాయంగనే పాసైనట్టు గాదు https://navatelangana.com/gadda-passed-away/ Sat, 19 Apr 2025 17:21:52 +0000 https://navatelangana.com/?p=549387 It's not like you've passed the exams by accident.ఏందిర పిల్లలు ఆడంగాడంగ జమై ఏం జేస్తున్నరుల్లా? ఇంకేం జేస్తరు, ముచ్చట్లు, ఆటలే గద. పరీచ్చలైపోయినంక బోరైతున్నద? మంచిగ రాసినం పాసైపోతమని బరోసతోని ముచ్చట్లా. పాసైపోతె మంచిదేగాని, లేకుంటే జర జాగ్రత్తబడుండ్రి.
పరీచ్చలు రాసేటప్పుడే మీకెర్కైతది గదా. కొన్ని కొన్ని పేపర్లు గట్టిగొచ్చినయని. ఎందకైన మంచిది. గా పేపర్లు, పొస్తకాలు తీసి సద్వడం సురు చేయండ్రి.
మల్లి రిజల్టొచ్చినాంక, కర్మకాలి పెయిల్‌ అయితే ఇన్‌స్టాటేదో అంటరుగద. గవ్విట్కి నెల దినాల్కన్న ఎక్క్వుండదు. గిప్పుడంత లాపర్వాగ ఎగిరిదుంకి, చుట్టాలిండ్లకు మొహమాన్‌ బోయి కృసి మనాయించి దిమాగ్ల సదువుమాట వుండదు మల్ల.
పరిచ్చలు రాసేస్నమ్‌ మమ్మండ్లని అడిగెటోడు లేరని, ఆడ్కుంట, పాడ్కుంట టైమ్‌ వేస్ట్‌ చేయకండ్రి. నల్గురొక్క తాన జమై, మజాకులు, మంతఖాలు సూస్తనే వున్న.
గమ్మున రిజల్టొచ్చి రెండు మూడిట్ల ఫేల్‌ అయితే గప్పుడేంది కత? పొస్త్కాలేడ ఆడమైన వెల్వుగూడ సోయుండదు.
ఆ కమ్లేశుని మెకానిక్‌ దుక్నమ్‌ల పెడ్తె ఆడనె కుడ్తిల పడ్ల ఎల్కలెక్క అయిండు. గా పొద్దు కన్పిస్తె అడుగిన మాడైతదక్క, దినమంత గాడ్నె అయితదని అన్నడు.
ఒక పాలి పెయిలైన, సమ్మచ్చరం పోయినట్టె. సర్కారోల్లు ఇన్‌స్టాంటు బెట్టి పున్యం చేస్కుండ్రు. పాసయి కాలేజిల శేరితే గానికి సర్కారోల్లు మీకిచ్చిన మంచి దారని తెల్సుకొని లాబం పొందుండ్రి. ఇప్పట్ల సద్విలేకుంటె జల్మ బెకార్‌.
పతి సమ్మచ్చరం రత్నం లెక్క ముత్యంలెక్క అన్నట్టు. దొరలకు అన్ని సద్వినీకె నెల్దినాలేమి సర్పోవచ్చు? గప్పుడు గూడ డుమ్కి గొడ్తే మల్లొచ్చె సమ్మచ్చరమంత బేకారే గద. అంద్కె జర కల్లు తెర్చి పవర్తించుండ్రి అంటున్న. మీరు ఫెయిల్గావాల్నని కోరుకుంటున్న నన్కుంటుండ్ర.
కరోనాదినాల్ల అందరూ కొట్కపోయిండ్రు. గుంపులో గోమిందాన్నట్లు ఎప్పట్కట్లనే అయితదా? పోయినేడు, అటు పోయినేడు సౌబాగ్య అన్న కమ్లేశుముచ్చటేమైంది?
మీ మొకాలకు పాసయ్యడ్ది ఏముంది? ఆమె కన్నోల్లు పెల్లి జేసి పంపిస్తె, పిల్ల తల్లయింది కానీ పరిచ్చ మాత్ర కాకపోయె. అందరు గొప్ప సద్వులే సద్వాలని లేది. నీతిగ బత్కనీకె ఏదైన మంచి సద్వుండాలె. ఏం సద్విన రెక్కల కస్టమో, దిమాఖస్టమో ఏదో ఒకటి పడాల్సిందె. కూసోబెట్టి ఎవ్వలు తినబెట్టడు. గసువంటి బత్కు మనకొద్దుగూడ. ఒకల్లనొకల్లు బడి పిరిగా తినె బత్కు జమాన కాదు.
పద్దక్క ఏందిట్ల అనబట్టె అని తిట్టుకోకండ్రి. సొచాంచండ్రి. ఏమంటున్న? నేన్‌ జన సేన్కాడ్కి పోయొస్త.
– గంగరాజ పద్మజ, 9247751121

]]>
నవ్య‌ సినీ దిగ్గజం https://navatelangana.com/navya-cinema-giant/ Sat, 19 Apr 2025 17:16:20 +0000 https://navatelangana.com/?p=549378 Navya is a film legendఆధునిక ప్రపంచంలో సినీ మాధ్యమానికున్న ప్రాధాన్యత, విలువ మరే మాధ్యమానికి లేదంటే అతిశయోక్తి గాదు. ఓ వందేండ్ల క్రితం మొదలై మూకీ నుండి టాకీ చేరి ప్రజలకు వినోదం + విజ్ఞానం అందించడం విధిగా భావించారు నాటితరం నిర్మాతలు, దర్శకులు. అయితే నేటి సినిమాలు ఫక్తు వాణిజ్యంగా మార్చి జుగుప్సా, భీభత్సం, అశ్లీలం వగైరా గుణాలతో ప్రజల్ని పూర్తిగా చెడుదారి పట్టించడం మొదలైంది. ప్రపంచ ఆర్థిక, సామాజిక రంగాల మార్పులతో ఈ మాధ్యమం కూడా ప్రజల నుండి దూరమవుతుంది. 1950, 1960 ప్రాంతాల్లో ఇటలీ, ఫ్రెంచ్‌ సినీ దిగ్గజాలను ఆదర్శంగా తీసుకొని భారద్దేశంలో సినిమాను నవ్యరీతుల్లో నడిపి వినోదం, విజ్ఞానంతో బాటు సందేశాన్నిచ్చే సత్తాగల మాధ్యమంగా తీర్చిదిద్దేందుకు నాంది పలికిన వ్యక్తి బెంగాల్‌ సినీ దిగ్గజం సత్యజిత్‌రే.
సత్యజిత్‌ రే వేసిన నవ్య సినిమా బాట మృణాల్‌సేన్‌, రుత్విక్‌ ఘటక్‌, ఖాజా అహ్మద్‌ అబ్బాస్‌, శ్యామ్‌ బెనెగల్‌, అదూర్‌ గోపాలకృష్ణ, బాలచందర్‌, బి.నర్సింగ్‌రావు లాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషల్లో సినిమాలు నిర్మించి కళాత్మక, సమాంతర సినీ ప్రపంచాన్ని ప్రజల ముందుంచారు.
నవ్య సినిమాకు నాంది పలికిన సత్యజిత్‌ రే సినీ నిర్మాత, దర్శకుడేగాక స్వయంగా రచయిత, సంగీత విద్వాంసుడు, స్క్రిప్టు రచయిత, క్యాలిగ్రాఫర్‌ కవి. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందిన సత్యజిత్‌రే 2 మే 1921 నాడు కలకత్తాలో సుకుమార్‌ రారు, సుప్రభరారులకు జన్మించారు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన రే మేనమామ ఇంట్లో పెరిగాడు. అప్పుడే అతని తెలివి తేటల్ని పసిగట్టిన అందరూ ‘మాణిక్‌దా’ అని పిలిచేవారు. ‘మాణిక్‌దా’ అంటే ‘మాణిక్యం దాదా’ అని అర్థం.
సత్యజిత్‌కు చిన్నప్పటి నుండే సినిమా అన్నా, సంగీతమన్నా పిచ్చి అభిమానం. హాలీవుడ్‌ నటీనటుల బొమ్మలు కత్తిరించి దాచుకునేవాడు. అలా తన అభిరుచి దర్శకుల మీదికి మళ్ళింది. అట్లే రకరకాల సంగీతాల రికార్డులు వినేవాడు. సినిమాకు నాంది పలికే కంటే ముందే సత్యజిత్‌కు చిత్రకళలో ప్రవేశం కూడా వుంది. అదే సినిమాలలో కూడా అతనికి ఉపయోగపడింది. 1947లోనే చిదానంద దాస్‌ గుప్తాలాంటి వారితో కలిసి కలకత్తా ఫిలిమ్‌ సొసైటీ స్థాపించాడు.
1943లో బ్రిటీష్‌వాళ్ళ అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీలో ఉద్యోగం సంపాదించి దాని ‘కళాదర్శకుడు’గా ఎదిగాడు. 1949లో ఫ్రెంచ్‌ డైరెక్టర్‌ జీన్‌ రెనోర్‌ ప్రోత్సాహంతో సత్యజిత్‌ సినీ దర్శకత్వం వైపు మొగ్గు చూపాడు. బెంగాల్లో బాగా ప్రాచుర్యం పొందిన విభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ రాసిన నవల ‘పథేర్‌ పాచాలి’గా 1952లో మొదలై 1955లో పూర్తయింది. ‘పథేర్‌ పాంచాలి’ అంటే రహదారి వినిపించే గేయకావ్యం. ఈ సినిమాకు కొనసాగింపుగా అపరాజిత, అపూర్‌సంసార్‌ సినిమాలు తీశాడు.
ఈ మూడు సినిమాల్లోనూ పేద బ్రాహ్మణ పూజారి కొడుకు అపు అటు సంప్రదాయం, ఇటు ఆధునికం – రెంటిమధ్య ఎలా కొట్టుమిట్టాడుతాడనేది సినీ సారాంశం. ఇంకా చారులత, దేవి, దహీరో, జల్‌సగర్‌, మహానగర్‌, 1943-44 బెంగాల్‌ కరువుపై వచ్చినది ‘అహసని సంకేత్‌’, అరణ్య దిన్‌రాత్రి, ప్రతిద్వంది, సీమబద్ది, అజ అరణ్య పికూ, గణశత్రు, శాఖాప్రశాఖ, అగంతక్‌ సినిమాలు ఆయన తీసినవే.
సినీ దర్శకునిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో అలాగే గొప్ప సాహితీ కృషి కూడా చేశాడు. కథలు, కవితలు, నవలలు, అనువాదాలు లెక్కకు మించిన రచనా సామర్థ్యం సత్యజిత్‌కే సొంతం.
సినీ రంగంలో అత్యుత్తమ అవార్డ్‌ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు, దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’తో బాటు గౌరవ ఆస్కార్‌ అవార్డ్‌ కూడా దక్కడం ఆయన ప్రతిభకు నిదర్శనం.
బిబిసి వాళ్ళు తయారు చేసిన 100 విదేశీ సినిమాల జాబితాలో సత్యజిత్‌ ‘పథేర్‌ పాంచాలి’ 5వ స్థానంలో నిలిచింది. మానవత్వం, ఉన్నత విలువలు, సామాజిక చింతనతో  సినిమాలు నిర్మించి, దర్శకత్వం వహించిన సినీ దిగ్గజం ఆయన. భారతదేశంలోనే గాక ప్రపంచ సినీ పరిశ్రమలో గొప్ప కళాత్మక దర్శకేంద్రునిగా సత్యజిత్‌రే నిలిచాడు. ఆయన  శతజయంతి జరుపుకోబోతున్న ఈ వేళ భారత సినీ పరిశ్రమ ఫక్తు వాణిజ్య, అశ్లీల, జుగుప్సాకర మార్గం వీడి సత్యజిత్‌రారు లాంటి వాళ్ళు వేసిన కొత్త దారిన సాగాలని మనసారా  ఆశిద్దాం. సత్యజిత్‌రే తన 71వ ఏట 23 ఏప్రిల్‌ 1992న చనిపోయాడు.

– ఎనిశెట్టి శంకర్‌
98666 30739

]]>
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ https://navatelangana.com/kannada-kantirava-rajkumar/ Sat, 19 Apr 2025 17:12:29 +0000 https://navatelangana.com/?p=549377 Kannada Kanthirava Rajkumarఆయనకు చదువు లేదు… ఎందుకు కొరగాడని అందరూ వెక్కిరించారు… యాదచ్చికంగా వేదికనెక్కినప్పుడు ఆయనలోని కళాకారుడు బయటికొచ్చాడు. చిన్న వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ భారం ఆయనపైనే పడింది. ఇరవైఎళ్ళ వయసులో కళామతల్లినే నమ్ముకుని తన నటనకు మెరుగులద్దుకునేందుకు విపరీతంగా శ్రమించారు. ఆ శ్రమే ఆయన్ని వెండితెరకు చేరువ చేసింది. స్వయంకషితో ఒక్కో మెట్టు అధిరోహించి కొట్లాదిమంది అభిమానులకు ఆరాధ్యుడిగా మారారు. నటుడుగా, గాయకుడుగా ఐదు దశాబ్దాలకు పైగా మకుటంలేని మహారాజుగా వెలుగొందాడు.. ఆయనే కన్నడిగుల తెరవేల్పు డా.రాజ్‌కుమార్‌. ఈ నెల 24 న ఆయన జయంతి సందర్బంగా ఈ వ్యాసం మీ కోసం…
చలనచిత్ర రంగంలో 1954లో తొలిసారి ‘బెదర కన్నప’ చిత్రంతో నటుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 2000లో ‘శబ్దవేది’ చివరి చిత్రం వరకు అర్ధశతాబ్దం పాటు 200లకు పైగా చిత్రాలలో నటించి, భారతదేశంలోని ప్రముఖ నటులలో ఒకరిగా గుర్తింపు పొంది, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న రాజ్‌కుమార్‌ను ఆయన అభిమానులు ‘నటసార్వభౌమ’, ‘కన్నడ కంఠీరవ’, ‘గానగంధర్వ’, ‘బంగారద మనుష్య’, ‘వర నట’, ‘రాజన్‌’ అనే బిరుదులు పొందిన రాజ్‌కుమార్‌ను ‘డాక్టర్‌ రాజ్‌’, ‘అన్నావ్రు’ అని ప్రేమగా పిలిచేవారు. సినిమా రంగానికి రాజ్‌కుమార్‌ అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం 1983లో పద్మభూషణ్‌, 1995లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులను అందించింది. 2002వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యన్టీఆర్‌ జాతీయ అవార్డుతో రాజ్‌కుమార్‌ను గౌరవించింది.
డా.రాజ్‌కుమార్‌ 1929, ఏప్రిల్‌ 24వ తేదీన అప్పటి మైసూరు రాజ్యంలోని గాజనూరులో కన్నడ కుటుంబంలో జన్మించాడు. ఈ గ్రామం ఇప్పుడు తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలో కర్ణాటక సరిహద్దు వెంట ఉంది. ఈయన మాతభాష కన్నడ. తండ్రి సింగనల్లూరు పుట్టస్వామయ్య రంగస్థల నటుడు. తల్లి లక్ష్మమ్మ. వీరి పెద్ద కొడుకైన రాజ్‌కుమార్‌ కు మొదట ‘ముత్తత్తి రాయుని’ పేరుమీద ముత్తురాజ్‌ అని పేరు పెట్టుకున్నారు. చదువబ్బక అయిదో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పి ఓ నాటకాల కంపెనీలో వేషాలు వేయడం ప్రారంభించాడు. ఓ సారి నారద పాత్రదారి సెలవు మీద వెళ్లడంతో ఆ నాటకసంస్థ ప్రత్యామ్నాయ నటుడు కోసం అన్వేషిస్తున్న సమయంలో ముత్తురాజ్‌ (రాజ్‌కుమార్‌) తానే స్వయంగా కంపెనీ ప్రతినిధిని కలిసి ఆ పాత్రను తాను పోషిస్తానని చెప్పడంతో.. మరోదారి లేక ఆ కంపెనీ ప్రతినిధి ఒప్పుకున్నాడు. అనుకోకుండా లభించిన ఈ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనుకున్న రాజ్‌ నారద పాత్రలో ‘బాల కనకమయజల సుజన’ అంటూ తన్మయుడై పద్యాన్ని అలపించడంతో ఆహుతులు మంత్రముగ్దులై.. వన్స్‌ మోర్‌ అంటూ కరతాళ ధ్వనులతో అభినందించారు. ఆ పాత్రలో లీనమైపోయి చెప్పిన డైలాగులూ, పాడిన పద్యాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. ఆ తర్వాత సుబ్బయ్యనాయుడు నాటక సంస్థలో ముత్తురాజ్‌ (రాజ్‌కుమార్‌) ప్రధాన సభ్యుడయ్యాడు. ఇది ఆయన జీవితంలో ఓ మేలిమలుపు.
సినీరంగ ప్రవేశం
ఆ తర్వాతి కాలంలో ముత్తు రాజ్‌ ‘డా.రాజ్‌కుమార్‌’గా చిత్రసీమ వైపు ఆడగులు వేసి తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. గుబ్బి డ్రామా కంపెనీ తొలిసారి నిర్మించిన ‘గుణసాగరి’ చిత్రం విజయవంతం కావడంతో, తమ సంస్థ నిర్మించే రెండవ సినిమాకి కథానాయకుడి కోసం ఆ చిత్ర దర్శకుడు హెచ్‌.ఎల్‌.ఎన్‌. సింహా గాలిస్తున్న సమయంలో ముత్తురాజ్‌ని ఈ చిత్రానికి కథానాయకుడుగా ఎంపిక చేస్తే ఎలా ఉంటుందని ఆలోచనతో చిత్ర నిర్మాతలతో చర్చించగా దర్శకుడు సింహా ప్రతిపాదనను వారు అంగీకరించారు. దీంతో ‘రాజ్‌కుమార్‌’ అనే కొత్త పేరుతో ‘బెడర కన్నప్ప’ చిత్రంతో ముత్తురాజ్‌ సినీరంగ ప్రవేశం చేశాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఇదే సినిమాను ‘శ్రీ కాళహస్తీశ్వర మహత్యం’ పేరిట తెలుగులో నిర్మించారు.
‘డా.రాజ్‌కుమార్‌’ ఆ తర్వాత ‘సోదరి, భక్త విజయ, హరిభక్త, ఓహిలేశ్వరా, సతి నళాయిని, భూకైలాస, శ్రీకష్ణ గారడీ, రణదీర కంఠీరవ’ నుండి మొదలుకుని దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించారు. రాజ్‌కుమార్‌ ‘బంగారద మనుష్య’ చిత్రంతో సూపర్‌ స్టార్‌ గా ఎదిగారు. ఈ చిత్రం కన్నడ సినీపరిశ్రమలో రికార్డులు సష్టించి, ఏడాదిపాటు ప్రదర్శితమైంది. ‘భక్త ప్రహ్లాద, బబ్రువాహన, సత్యహరిశ్చంద్ర’ వంటి పౌరాణిక.. ‘మయూర, వీరకేసరి’ వంటి జానపద, సంగీత ప్రధానమైన చిత్రాల్లో రాజ్‌కుమార్‌ తన అసమాన నటనా సామర్థ్యాలని ప్రదర్శించారు.
నట, గాయకునిగా
చిత్తూరు నాగయ్య స్ఫూర్తితో రాజ్‌కుమార్‌ నటగాయకునిగా సాగాలని పరితపించేవారు. రాజ్‌ నాటకాల్లో నటిస్తున్న సమయంలో సొంతగా పద్యాలు, పాటలు పాడుకున్నారు. ఆ అనుభవంతోనే 1956లో రూపొందిన ‘ఓహిలేశ్వర’లో ”ఓం నమశ్శివాయ” పాటను పాడారు రాజ్‌కుమార్‌. ఆ చిత్రానికి మన తెలుగువారయిన జి.కె.వెంకటేశ్‌ సంగీతం సమకూర్చారు. ఆ తరువాత రాజ్‌కుమార్‌ నటనకు, పి.బి.శ్రీనివాస్‌ గానానికి జోడీ కుదిరింది. వారిద్దరి కాంబినేషన్‌ కన్నడసీమలో జైత్రయాత్ర చేసింది. అయితే నటగాయకుడు కావాలన్న రాజ్‌కుమార్‌ అభిలాషను 1974లో రూపొందిన ‘సంపత్తిగా సవాల్‌’ చిత్రం తీర్చింది. ఇందులో ”యారే కూగాడలి” అనే పాట పాడి ఆకట్టుకున్నారు రాజ్‌కుమార్‌. ఈ చిత్రం తెలుగులో చలం హీరో గా ‘తోటరాముడు’ పేరుతో రీమేక్‌ అయి విజయం సాధించింది. ఇక అప్పటి నుంచీ స్వీయగానంతో నటిస్తూ సాగారు రాజ్‌కుమార్‌. ఆయన నోట పలు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ పలికి, అభిమానులను ఎంతగానో అలరించాయి. తను నటించిన చిత్రాలకే కాక, నేపధ్య గాయకునిగా ఇతర నటులకు కూడా గాత్ర దానం చేశారు. ఇంకా అనేక భక్తి గీతాలు కూడా పాడారు. ముఖ్యంగా మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి వారిపై రాజ్‌కుమార్‌ పాడిన భక్తిగీతాలు తెలుగువారినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. నటునిగా, గాయకునిగా రాజ్‌కుమార్‌కు ఎనలేని ఖ్యాతి లభించింది. అభినయంలో పలు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నా రాజ్‌కుమార్‌ 1992లో తాను నటించిన ‘జీవనచైత్ర’ చిత్రంలో ”నాదమయ” అంటూ సాగే పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకునిగా ఆయన అవార్డు అందుకున్నారు. ఓ పాపులర్‌ స్టార్‌కు బెస్ట్‌ సింగర్‌గా నేషనల్‌ అవార్డు దక్కడం అదే మొదటి సారి. ఇప్పటి వరకూ మరో స్టార్‌ హీరో ఈ అవార్డు సాధించలేదు.
కన్నడ సినిమా అభివద్దికి కృషి
కన్నడ సినిమా అభివద్ధికి రాజ్‌కుమార్‌ ఎంతగానో కషి చేశారు. మదరాసు నుండి కన్నడ చిత్రసీమను కర్ణాటకకు తీసుకువెళ్ళడంలో రాజ్‌ పాత్ర మరపురానిది. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లోనే ఆయన చిత్రాల షూటింగులన్నీ జరిగేలా ప్లాన్‌ చేసుకున్నారు. ఇక కన్నడ చిత్రాలకు తెలుగు, తమిళ సినిమాల ద్వారా పెద్ద పోటీ ఉండడంతో, తమ సినిమా ఉనికిని చాటుకొనేందుకు కన్నడ చిత్రాలకు ‘యాభై శాతం పన్ను మినహాయింపు’ తీసుకు రావడంలోనూ రాజ్‌కుమార్‌ పాత్ర ఎంతో ఉంది. పన్ను రాయితీ కారణంగానే రాజ్‌కుమార్‌ చిత్రాలు బెంగళూరులో పరభాషా చిత్రాలకు పోటీగా నిలదొక్కుకొని ‘బంగారుద మనుష్య, శంకర్‌ గురు’ వంటి చిత్రాలు సంవత్సరం పైగా ప్రదర్శితమయ్యాయి. సినిమా రంగానికి రాజ్‌కుమార్‌ అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం 1983లో పద్మభూషణ్‌, 1995లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులను అందించింది. 2002లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యన్టీఆర్‌ జాతీయ అవార్డుతో రాజ్‌కుమార్‌ను గౌరవించింది. కన్నడ రాజ్‌కుమార్‌గా భారతీయ చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నా రాజ్‌కుమార్‌కు తెలుగువారి మదిలోనూ ఓ ప్రత్యేక స్థానం ఉందని చెప్పక తప్పదు.
తెలుగువారంటే రాజ్‌కు అభిమానం
అంతకు ముందు కన్నడ సీమలో కొందరు రంగస్థల నటులు రాజ్యమేలారు. రాజ్‌కుమార్‌, కళ్యాణ్‌ కుమార్‌, ఉదరు కుమార్‌ ముగ్గురూ కన్నడ చిత్రసీమలో తమదైన బాణీ పలికించారు. ఈ ముగ్గురినీ ‘కన్నడ చిత్రసీమ త్రిమూర్తులు’ అని పిలిచేవారు. అయితే వారిలో అత్యధిక కాలం స్టార్‌గా వెలుగొందింది మాత్రం రాజ్‌కుమార్‌ అనే చెప్పాలి. ‘కాళహస్తి మహాత్మ్యం’లో తనని ఎంతగానో ఆదరించిన తెలుగువారంటే రాజ్‌కుమార్‌కు ఎంతో అభిమానం. ఇక ఆయన ఇష్టదైవం తెలుగునేలపై కొలువైన మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి.
యన్టీఆర్‌ తోనే పోటీ!
తెలుగునాట సూపర్‌ స్టార్స్‌గా వెలుగొందిన చిత్తూరు వి.నాగయ్య, యన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అంటే రాజ్‌కుమార్‌కు ఎంతో గౌరవం. వారిలో యన్టీఆర్‌ అంటే మరింత అభిమానం. అందుకు కారణం లేకపోలేదు.. యన్టీఆర్‌ తెలుగులో నటించిన అనేక చిత్రాలు కన్నడలో రాజ్‌కుమార్‌ హీరోగా రీమేక్‌ అయ్యాయి. అంతేకాదు, యన్టీఆర్‌ లాగా తానూ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో నటించి కన్నడ వాసులను అలరించారు రాజ్‌కుమార్‌. యన్టీఆర్‌ నటించిన ‘పెళ్ళిచేసి చూడు, సత్య హరిశ్చంద్ర, భూకైలాస్‌, బందిపోటు, కదలడు- వదలడు” చిత్రాలు కన్నడ రీమేక్స్‌ లో రాజ్‌కుమార్‌ నటించారు. యన్టీఆర్‌ నటజీవితంలో తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘కులగౌరవం’. ఈ చిత్రానికి కన్నడలో రాజ్‌కుమార్‌ నటించిన ‘కులగౌరవ’ ఆధారం. యన్టీఆర్‌ లాగే కన్నడనాట శ్రీరామ, శ్రీకష్ణ వంటి దేవతామూర్తుల పాత్రల్లో నటించి, రావణ, హిరణ్యకశ్యప, కంస, శిశుపాల వంటి ప్రతినాయక పాత్రల్లోనూ అలరించారు రాజ్‌కుమార్‌. ఇక బెంగళూరు, బళ్ళారి, హోస్పేట్‌, రాయచూర్‌ వంటి కేంద్రాలలో యన్టీఆర్‌కు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉండేది. ఆ యా ప్రాంతాల్లో యన్టీఆర్‌తో పోటీగా రాజ్‌కుమార్‌ సినిమాలు విడుదలయ్యేవి. వారిద్దరి మధ్యనే కన్నడవాసులు పోటీ ఉందని భావించేవారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో యన్టీఆర్‌ నటించిన అనేక చిత్రాలు ఘనవిజయాలు చూశాయి. అక్కడ తమిళ స్టార్‌ హీరోస్‌ ఎమ్జీఆర్‌, శివాజీగణేశన్‌ చిత్రాలు విడుదలైనా, ఎందుకనో అభిమానులు రామారావునే రాజ్‌కుమార్‌కు పోటీగా భావించేవారు. అయితే, రాజ్‌కుమార్‌ మాత్రం యన్టీఆర్‌ను తన అన్నలాగే అభిమానించేవారు. మరో విశేషమేమంటే, రాజ్‌కుమార్‌ తనయుడు శివరాజ్‌ కుమార్‌, యన్టీఆర్‌ నటవారసుడు బాలకష్ణ నూరవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో అతిథి పాత్రలో కనిపించారు. ఇక రాజ్‌కుమార్‌ మరో కుమారుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా నటించిన ‘చక్రవ్యూహ’ చిత్రంలో జూనియర్‌ యన్టీఆర్‌ ”గెలెయ గెలెయా..” అంటూ సాగే కన్నడ పాట పాడి ఆకట్టుకున్నారు.
తెలుగు నటులతో చిత్రబంధం!
కన్నడలో రాజ్‌కుమార్‌ నటించిన ‘సంత తుకారాం’ను ఏయన్నార్‌తో ‘తుకారాం’గా తెరకెక్కించారు. ‘భక్త కుంబార’ చిత్రాన్ని తెలుగులో అక్కినేనితో ‘చక్రధారి’గా రూపొందించారు. రాజ్‌కుమార్‌ ‘శ్రావణబంతు’ ఆధారంగా ఏయన్నార్‌ ‘వసంతగీతం’ వచ్చింది. ఏయన్నార్‌ ధరించిన సత్యవంతుడు, కాళిదాసు వంటి పాత్రలను రాజ్‌కుమార్‌ కూడా పోషించడం గమనార్హం! రాజ్‌కుమార్‌ చిత్రాలను తరువాతి తరం హీరోలయిన కష్ణ, శోభన్‌ బాబు, కష్ణంరాజు కూడా రీమేక్‌ చేశారు. రాజ్‌కుమార్‌ కెరీర్‌ లోనే కాదు, కన్నడ నాట అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా ‘బంగారద మనుష్య’ నిలచింది. ఈ చిత్రం ఆధారంగా తెలుగులో కష్ణ ‘దేవుడు లాంటి మనిషి’ రూపొందింది. రాజ్‌కుమార్‌ ‘శంకర్‌ గురు’నే కష్ణ ‘కుమార రాజా’గా తెరకెక్కింది. రాజ్‌కుమార్‌ నటించిన ‘సనాది అప్పన్న’ తెలుగులో శోభన్‌ బాబుతో ‘సన్నాయి అప్పన్న’గా, ‘చెలుసువే మోడగళ్‌’ ఆధారంగా ‘రాజ్‌కుమార్‌’ రూపొందాయి. కష్ణంరాజు హీరోగా రూపొందిన ‘పులిబిడ్డ’కు రాజ్‌కుమార్‌ నటించిన ‘తాయిగె తక్క మగ’ మాతక. పాటలతో పులకింప చేసిన రామకష్ణ ‘పూజ’ సినిమాకు రాజ్‌కుమార్‌ ‘ఎరడు కనసు’ మాతక. ఇలా పలువురు తెలుగు సినిమా స్టార్స్‌ రాజ్‌కుమార్‌ చిత్రాల రీమేక్స్‌ తో సాగారు.
విశ్వవిఖ్యాత కన్నడ నట సార్వభౌమ
ఆయన కన్నడ చలనచిత్రాలలో పోషించని పాత్రే లేదు అంటే అతిశయోక్తి కాదు. విశ్వవిఖ్యాత కన్నడ నట సార్వభౌమ అంటే ‘ప్రపంచం’ లోని కన్నడిగులందరికీ తెలిసిన నటుడు అని. మన తెలుగునాట ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమ’ అంటే నందమూరి తారక రామారావు కదా! ఆయనకు టి.సుబ్బిరామిరెడ్డి ఇచ్చిన బిరుదు. ఇంతకుముందు రాజ్‌కుమార్‌ విషయంలో లాగే విశ్వ అనే పదానికి ప్రపంచం అని తీసుకున్నట్టుగా ఈయన విషయంలో కూడా ప్రపంచమనే తీసుకోవాలి. ప్రత్యేకించి రాజ్‌కుమార్‌ ఉపయోగించినట్టుగా తెలుగు నట సార్వభౌమ అని ఎన్టీఆర్‌ని అనడం ఆయనను తక్కువ చేయడమే అవుతుంది. ఎందుకంటే తమిళ చిత్రాలకు కూడా కొన్ని కీలకపాత్రలు ఆయనే కావలసి వచ్చింది అంటే అతిశయోక్తి కాదు. ఇలా ఎన్ని భాషాల పేర్లని చేర్చగలం? కాబట్టి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని ఉపయోగించడం దోషం లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా రాజ్‌కుమార్‌ ఉదాహరణ లాగే ‘విశ్వం’ అంటే ప్రపంచమని, బిరుదు తెలుగువారికి అర్థమవుతుంది కాబట్టి తెలుగువారి ప్రపంచంలో నట సార్వభౌముడనీ అనుకోవాలి.
రాజ్‌కుమార్‌ వివాహం
పదమూడేండ్ల వయసులో హైస్కూల్‌ లో చదువుకుంటూ, సుబ్బయ్య కంపెనీలో నాటకాలు వేస్తున్న సమయంలో రాజ్‌కుమార్‌కు పార్వతమ్మతో వివాహం జరిగింది. పెండ్లి అయ్యాకనే తన దశ తిరిగిందని రాజ్‌కుమార్‌ ఎప్పుడూ చెపుతుండేవారు. వీరికి ఐదుగురు సంతానం. ఈ ఐదుగురిలో శివరాజ్‌ కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌ అనే ముగ్గురు మగ పిల్లలు, లక్ష్మీ, పూర్ణిమ అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. రాజ్‌కుమార్‌ ముగ్గురు కుమారులు సినీరంగంలోనే కొనసాగుతుండగా గత రెండు సంవత్సరాల క్రితం మూడో కుమారుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండె పోటుతో మరణించాడు.
రాజ్‌కుమార్‌ను అపహరించిన వీరప్పన్‌
2000 జూలై 30వ తేదిన రాత్రి 9:30 ప్రాంతంలో, తమిళనాడు లోని గాజనూరు ఫాంహౌస్‌ వద్ద రాజ్‌కుమార్‌ని గంధపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లర్‌ వీరప్పన్‌ పన్నెండు మంది అనుచరులతో కలిసి అపహరించాడు. గాజనూరులో రాజ్‌కుమార్‌ తాను కొత్తగా కట్టించుకున్న ఇంటి గహప్రవేశం కోసం జూలై 27 న అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఫాంహౌస్‌ పై వీరప్పన్‌, అనుచరులు చేసిన సాయుధ దాడిలో రాజ్‌కుమార్‌ను ఆయనతో పాటు మరో ముగ్గురిని వీరప్పన్‌ అపహరించి వీరిని సత్యమంగళ అడవిలోకి తీసుకెళ్లాడు.
ఆ సమయంలో రాజ్‌కుమార్‌ విడుదల కోసం లక్షలాదిమంది అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలకు, ఆందోళనలకు దిగారు. తమ అభిమాన నటుడిని విడుదల చేయాలని పెద్ద ఎత్తున గొడవలకు చేశారు.. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కష్ణ శాటిలైట్‌ ఫోన్లో వీరప్పన్‌తో చర్చలు జరిపి రాజ్‌కుమార్‌ విడుదలకు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు కొన్ని షరతులు అంగీకరించి 108 రోజుల తరువాత 2000వ సంవత్సరం నవంబరు 15వ తేదిన రాజ్‌కుమార్‌ను వీరప్పన్‌ విడుదల చేశారు. అయితే వీరప్పన్‌ నటుడు రాజ్‌కుమార్‌ని కిడ్నాప్‌ చేసిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఎంతో మానసిక సంక్షోభానికి గురయ్యారు. ఆ సమయంలో వీరప్పన్‌ పెద్ద ఎత్తున డబ్బు డిమాండ్‌ చేయడానికి రాజ్‌కుమార్‌ని కిడ్నాప్‌ చేశారని వార్తలు వచ్చాయి. పాత్రికేయుడు శివసుబ్రహ్మణ్యన్‌ రాసిన పుస్తకంలో రాజ్‌కుమార్‌ విడుదల కోసం మూడు విడతలుగా మొత్తం రూ.15.22 కోట్లను అప్పటి ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కష్ణ ప్రభుత్వం వీరప్పన్‌కు అందజేసిందని పేర్కొన్నారు. శివసుబ్రమణ్యన్‌ వీరప్పన్‌ జీవితంపై ”లైఫ్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ వీరప్పన్‌” అనే పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మొత్తానికి రాజ్‌కుమార్‌ విడుదల తర్వాత కన్నడ సినీ పరిశ్రమ, కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
– డా. పొన్నం రవిచంద్ర,
9440077499

]]>
ఉద్యమాల వెలుగులో… https://navatelangana.com/in-the-light-of-movements/ Sat, 19 Apr 2025 16:58:32 +0000 https://navatelangana.com/?p=549362 In the light of the movements...తుర్లపాటి లక్ష్మి ఉపాధ్యాయినిగా వత్తిలో చేరిన నాటి నుండి వివిధ మహిళా సమస్యలు, సామాజిక ఉద్యమాలు- వివిధ హోదాలలో ఉపాధ్యాయ సంఘాలలో క్రియాశీలకంగా పనిచేసి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. వారి అనుభవాలను కథలుగా మలిచి ‘సూర్యునితో పోటీపడి..’ అనే పుస్తకంగా వెలువరించారు.
కథా రచయితలకు ఏర్పాటుచేసిన వర్క్‌షాప్‌కు రెండు రోజులు వెళదామని ఎంతో ఉత్సాహపడినా, ఇంటి పరిస్థితులు ఆమెను నీరుగార్చివేస్తాయి. ప్రతిదానికి తన మీద ఆధారపడే భర్త, పిల్లల అవసరాలు తీర్చడంతోనే రోజంతా గడిచిపోతుంది. తనను అన్ని విధాలా ఇంటికి, వంటింటికి కట్టివేస్తున్న బంధాల నుంచి బయటపడటం అసలు సాధ్యమేనా? అని ‘అన్నీ మరిచి’ కథలో చర్చకు పెడతారు. ఈ ప్రపంచంలో ఒంటరి ఆడది బ్రతకడం కష్టం. మంచివాడో, చెడ్డవాడో ‘కుక్క’ లాంటి మనిషి ఒకడు అండగా ఉంటే, మిగతా కుక్కలు ఏం చేయలేవని ధీమాగా పలికిన గౌరి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. చదువులు, ఉద్యోగాలే స్త్రీలకు సొంత ఆలోచనలు, స్వీయ వ్యక్తిత్వం పెంచుకోవడానికి ఉపయోగపడతాయని ‘మెరుపు మెరిసింది’ కథలో చెబుతారు. ఇంట్లో పని, బయట ఉద్యోగం చేస్తున్న స్త్రీ బహుపాత్రాభినయంతో ‘సూర్యునితో పోటీపడి’ పనిచేస్తుంది. సంపాదించలేని ఆడవాళ్లు ఒక్కరే కాదు. సంపాదించే స్త్రీలు కూడా జీవచ్ఛవాలలాగా పడి ఉంటుంటే – నర్సమ్మ మగవారితో సమానంగా కష్టపడి, పోటీపడి తన కొడుక్కి చదువు చెప్పించి సమాజానికి ప్రయోజనం కలిగించే ఒక బాధ్యతగల పౌరునిగా తీర్చిదిద్దిందంటే , ఆమె లాంటి వాళ్లే కదా ఈ సమాజానికి ఆదర్శం అని ‘జీవన సమరం’ కథ తెలియజేస్తుంది.
కుటుంబ హింస లీగలైజ్‌ అయిపోయింది. భార్యను కొట్టి చంపినా ఎవరూ ముందుకు వచ్చి ‘సాక్ష్యం’ ఇవ్వలేని పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు? అని మహిళా సంఘాల వాళ్ళు అక్కడి ప్రజలను చైతన్యపరచడానికి పూనుకుంటారు. ఇంటి పనిమనిషిగా చేరిన బాలికను లైంగికంగా వేధించి రేప్‌ చేసి చంపిన డాక్టర్‌ దంపతులను శిక్షించాలని పట్టుబట్టిన మహిళా సంఘం వారు ‘ఒక పాప కథ’ లో కనిపిస్తారు. నక్సలైట్లను పట్టుకోవడానికి తలపెట్టిన కూంబింగ్‌ ఆపరేషన్‌ పేరుతో అటవీ ప్రాంతాల ప్రజలను చిత్రహింసలు పెట్టి, అత్యాచారాలు చేసిన పోలీసుల మీద చర్య తీసుకోవాలని మహిళా సంఘాలు పోరాటం ‘ఖాకీ పులి’ కథలో కనిపిస్తుంది. ఈ కథలోనే కానీ నిజంగా ఎక్కడా పోలీసులకు శిక్ష పడిన దాఖలాలే లేవు.
ప్రేమలేఖతో పట్టుబడ్డ స్కూల్‌ అమ్మాయిని అందరి ముందు ఇంటరాగేషన్‌ చేసి అవమానపరిస్తే, ఆ అమ్మాయి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే దానికి కారణం ఎవరు? ఇలాంటి సమస్యను టీచర్లు సామరస్య పూర్వకంగా, ప్రేమతో పరిష్కరించాలని ‘శాపం’ కథ తెలియజేస్తుంది. ఉపాధ్యాయులే మాస్‌ కాపీయింగ్‌కు ప్రోత్సహింస్తే, ఆ విద్యార్థుల భవిష్యత్తు గురించి విచారించే ఒక ఉపాధ్యాయుడు కథే ‘ఈ ప్రశ్నకు బదిలేది’.
ప్రైవేట్‌ స్కూల్‌ మేనేజ్మెంట్‌ నియంతత్వ విధానాన్ని తిప్పికొట్టడానికి ఆ స్కూల్‌ టీచర్లు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల సహాయంతో ‘అందరూ ఒక్కటి కావడం’ చూసి మేనేజ్మెంట్‌ వారు రాజీకి వస్తారు. ట్రాన్స్ఫర్‌ కోసం లంచమిచ్చి మోసపోయిన ఒక టీచర్‌, ఉపాధ్యాయ యూనియన్లో చేరడమే ‘ప్రేరణ’ కథ. పే రివిజన్‌ కమిషన్‌ విధానాన్ని తిప్పికొట్టడమే ‘మామూళ్లు’ కథ. స్కూల్‌ అటెండర్‌ రిటైర్‌ అయినా పింఛన్‌ ఇతర బెనిఫిట్స్‌ కోసం చెప్పులరిగేలా తిరిగి, చివరికి యూనియన్లో చేరడం ‘వెలుగు రేఖ’ కథలో కనిపిస్తుంది.
చావలేక బతకలేక కొట్టుమిట్టాడే మధ్యతరగతి వాళ్లకు, నిరుపేదలకు అభివద్ధి ఫలాలు అందినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని ‘స్వాతంత్రం అంటే’ కథ చెబుతుంది. కాలుష్యాన్ని నివారించాలంటే, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఒక ఉపాధ్యాయుడు నిరూపించిన కథ ‘నాంది’.
ఒకప్పుడు టీచర్లకు ఏదైనా సమస్య వస్తేనే యూనియన్‌లో చేరేవారు. ఆ ధోరణ ఈ కథలలో కనిపిస్తుంది. ‘ప్రేరణ’ కథలో ట్రాన్స్ఫర్‌ కోసం, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ల కోసం ‘వెలుగు రేఖ’ పే ఫిక్సేషన్‌ కోసం యూనియన్‌లో చేరడం ‘మామూళ్లు’ కథలో చూడవచ్చు. అప్పట్లో యూనియన్లు నిస్వార్ధంగా పనిచేసేవి. ప్రస్తుతం యూనియన్‌లే ప్రతిదానికి ఒక రేటు ఫిక్స్‌ చేసి వసూళ్లకు దిగుతున్నారు. ఇప్పుడు అంతా అడ్జస్ట్‌ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగినులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ కథలు చిత్రించాయి. మహిళా సంఘాలు అయినా, ఉపాధ్యాయ సంఘాలు అయినా అందులో చేరి ఉమ్మడిగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఈ కథలు తెలియజేస్తాయి. నిజాయితీతో, నిబద్ధతతో రూపొందించిన ఈ కథలు పాఠకులను ఆసక్తిగా చదివింపజేస్తాయి. 2000లో వెలువడి పాఠకాదరణలను పొందిన ఈ కథల పుస్తకాన్ని, మళ్లీ ఇప్పుడు రెండవ ముద్రణగా తీసుకొని రావడం విశేషమే.
– కె.పి.అశోక్‌ కుమార్‌
9700000948

]]>
తియ్యటి శత్రువు https://navatelangana.com/a-sweet-enemy/ Sat, 19 Apr 2025 16:56:11 +0000 https://navatelangana.com/?p=549365 Sweet enemyఆమెకో సఖి ఉన్నది
సఖి ముమ్మాటికీ ఆమెకు మర్మాల నెరజాణ!
కులం స్థావరంలో పూడ్చబడిన ఆమె
నిర్వచనం ప్రశ్నార్థకం అయినపుడు
స్నేహాంతో సహా అన్ని వేలాడుతున్న ప్రశ్నలే!
వింత సఖి మర్మపు సఖుడు
నిరంతరం వారు ఆమెతోనే అంటకాగుతరు
కాని
అస్సలు కనపడరు.!.
వినపడరు..!!
అవసరాన్ని బట్టి జెండర్‌ అవతారాలు మారె పర్వమే..
జెండర్‌ వైరుధ్యం ఆసాంతం అత్యవసరం
‘పేదరికం, కులవివక్షలే నా గురువు’లని గుఱ్ఱం జాషువా అంటే
ఆమె మాత్రం వారిని సఖీ సఖులే అంటుంది
ప్రతి క్షణం ఆమెను అల్ముకొనే ఉంటది కదా మరి!
చంటి బిడ్డ తల్లిని కర్సు కున్నట్లు, భర్త భార్యను కావిలించుకున్నట్లు
ఆమెను దరించిన గర్భం పొట్టలాగా తనను సఖి హతుక్కొనుంటది
ఆ గోడ, కొయ్య, ఇనుప దర్వాజ, నీరు, మట్టి కంటికి కనపడ్డట్ల
సఖి కనపడదు, వినపడదు.
కాని నిరంతరం వస్త్రంలాగే ఆమెను కప్పేస్తుంది
ఇనుపతీగలా అల్లుకుపోతుంది.
బిడ్డకు బదులు సర్పమై స్థనాలను పీల్చి రక్తం తాగుతుంది.
తాగొద్దని ఎట్ల చెప్పగలదు?
అది ఆమెకు కనపడదుగా!
తన అసలు బిడ్డకు పాలు సరిపోత లేదని మాత్రమే ఆమెకు తెలుస్తుంది
ఏమి చేయగలదు?
ఆమెకు జెర్ర అనుమానమొస్తున్నది
వాడలో తనను నమిలిమింగేసే సఖి
ఊరులో ఘనాపాటీలకు రక్త మాంసాలు దట్టించి వారికీ బతికే ఆయుస్సుపెంచుతున్నదని.
అదే సఖి
పీల్చి నలిపి నమిలి మింగి క్రమంగా ఆమె జీవిత కాలాన్ని పద్నాలుగు సంవత్సరాలు తగ్గించింది
మరణమై ఆమెను వశపర్చుకుంటున్నది.
ఇంత చేసినా సఖి ఆమె జీవితంలోకి ఎప్పుడొచ్చిందో
ఆమెకు ఎర్క లేదు.
అందరిలా ఆడుకునేచోటనో, చదువుకునే చోటనో సఖి కలువ లేదు
ఆమె పుట్టక ముందే జిగిరితొ బంధం ఫిక్షయింది.
ఇష్టం అయిష్టం అస్సలు విషయం కాదు! లెక్కలోకి రావు.
జానెదేవ్‌
ఐదో మెట్టులో తనను పూడ్చిపెట్టిన ప్రియ సఖుడే
ఐదోతనంగా అవతరించే!
పెళ్ళిళ్లు స్వర్గంలో ఫిక్స్‌ అయితయో లేదో తెలువదు
కాని సఖునితో ఆమె బంధం మాత్రం
భూమ్మీదనే ఫిక్స్‌ అయింది.
సఖుడి అవతారాల గురించి చెప్పాలంటే దశావతారాలు సరిపోవు.
పొయ్యి పేణం రెండూ
ఆమె బతుకులో యుద్ధ రంగాలైనయి
కాల్చి మసి చేసినై
బతుకు బూడిద అయినపుడు
కాసింత ప్రాణవాయువు కోసం చలనశీలత జాడలను వెతుకులాడింది
వాడ పక్కన మోడుబారిన మొండి చింతచెట్టు నుండొచ్చే ముత్తెమంత ప్రాణవాయువే పెద్ద తాక తైతంది.
తక్షణమే ఫీనీస్‌ అయి అవనిలోకి ఎగిరింది
ముఖంలో చిరునవ్వు వికసించింది
మర్మపు సఖి ఆధునిక ముసుగేసుకున్నది.
పాత గాయాలకు కొత్త మర్మపు మొలాం తియ్యగా పూస్తున్నది
మళ్ళీ మళ్ళీ సఖి లాలిస్తూ వశపర్చుకుంటున్నది
అదను చూసి తన పక్కన వేద పీటేసుకొని బిందాస్‌గా కూసున్నది
తెగిన తలలను పీటల కింద జమాయించి
తల పీఠ రాజులు తమ రాణులతో
హింస తాండవ నత్యాలు చేస్తూనేవున్నరు
ఆలిసమ్మ మనీష రాజవ్వల శౌర్యాలు
బాధిత బహుమానాలుగా వంకర చిరునవ్వులతో
అందించబడుతూనే ఉన్నయి
కాకపోతే ఏమిది మరి?
ఉడికినమెతుకులు ఇర్సుకొని పంచుకోనీకే నాలుగు దశకాలాయె.
ఏ సంకెళ్లను ముద్దాడ మన్నరో తెల్వదు కానీ
ఆమె మాత్రం వేదభూమిలో బానిస సంకెళ్లను
ఇంకా ముద్దాడుతూనే ఉన్నది.
ఆమె వైపు నిరంతరం నవ్వుల పువ్వులు మెత్తగా
విసరబడుతూనే ఉన్నయి.
అవి తన ఊపిరిని నలిపేసే ఉక్కు కౌగిలే అయినా
తాజా పువ్వుల ఆలింగనంగా బముస్తున్నది.
ప్రతి సారి ఆమె వంచన నీడనే సేదతీరుతున్నది
జస్ట్‌ ఫర్‌ చేంజ్‌ అనివార్యమైనప్పుడు
చక్కున పలుకరించే సూర్యోదయాన్ని
ఎవరి కంట పడకూడదని ఎవ్వరి చెవులు వినకూడదని
చిన్నగొంతుతో సణుగుతూ అడిగింది
”మనిషితనంతో నేను నీవు, మనం నిండుగా బతికేది ఎప్పుడు సఖుడా” అని.
– డా|| గోగు శ్యామల

]]>
పద్నాలుగు భాషల నిత్య విద్యార్థి… ఏడుపదుల బాల ‘భాస్కరు’డు https://navatelangana.com/fourteen-languages-u200bu200beternal-student/ Sat, 19 Apr 2025 16:20:17 +0000 https://navatelangana.com/?p=549385 పద్నాలుగు భాషల నిత్య విద్యార్థి... ఏడుపదుల బాల 'భాస్కరు'డుపిల్లలూ! మనం అబద్ధం ఆడనివారిని సత్యవాక్పరిపాలకుడని… ఆదర్శపురుషుడు అని చదువుకుంటాం కదా! నేను చూసినవారిలో వీటికి సరిపోయే ఆదర్శాల సంగమం రూపుకడితే అది డాక్టర్‌ నలిమెల భాస్కర్‌! నిరంతర విద్యార్థి అని తరచుగా వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. నాకు తెలిసి నిఖార్సుగా సరిపోయే ఉదాహరణ కూడా అయనే! ఏడుపదుల వయసులోనూ అప్పుడే బడికివోతున్న ఏడేండ్ల బడి పిల్లవానిలా రోజూ ఏదో ఒక విషయాన్ని… భాషను… లేదా సంగీతాన్ని.. సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవడమో… లేదా వివిధ ప్రాంతాలు తిరగడమో ఆయన చేస్తుంటారు.
ఈ వ్యాసం రాస్తున్నప్పుడు నలిమెల తివేండ్రం నుండి కన్యాకుమారి మీదుగా మధురై ప్రయాణం చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒడియా, బెంగాలీ, అస్సామీ, మరాఠీ, గుజరాతి, పంజాబీ, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీషు భాషలు నేర్చుకున్న వీరు వందరూపాయల నోటు మీది కశ్మీరి, సింధీ భాష తప్ప అన్ని భాషలు చదవడం, రాయడంతో పాటు రచనలు, అనువాదాలు చేస్తున్న భారతీయ భాషా సరస్వతి. ఇటీవల సంగీతవాయిద్యాలతో పాటు గానం నేర్చుకుంటున్నారు.
నలిమెల భాస్కర్‌ 12 ఫిబ్రవరి, 1956న నేటి సిరిసిల్ల జిల్లాలోని నారాయణపురంలో పుట్టారు. తల్లితండ్రులు శ్రీమతి నలిమెల బుచ్చమ్మ – రామచంద్రం సార్‌. నలిమెల పుట్టిన ఈ ప్రాంతం తొలినాళ్ళ నుండి చైతన్యవంతమైన భూమి. గోల్కొండ కవుల సంచికలో ఈ ఊరి నలుగురు కవులున్నారు. ఉభయవేదాంత విద్వాన్‌ తిరుమల రాఘవాచార్యులు, డా.తిరుమల శ్రీనివాసాచార్య, సాంస్కృతిక బంధువు డా. కె.వి.రమణాచార్య ఐ.ఎ.ఎస్‌లు ఇక్కడివారే! ఇంకా పీపుల్స్‌వార్‌ కార్యదర్శులు శంకర్‌ వంటివారిది కూడా ఈ నేలనే. ఈ శంకర్‌ పాత్రతోనే రాణా హీరోగా ‘విరాటపర్వం’ సినిమా వచ్చింది. ప్రాథమిక విద్య స్వగ్రామంలో, మాధ్యమిక విద్య ఎల్లారెడ్డిపేటలో, ఇంటర్మీడియట్‌, డిగ్రీలు కామారెడ్డిలో చదివారు. 1977లో నలిమెల రాసిన గేయాలు ‘మానవుడా!’ పేర కామారెడ్డి ఆర్ట్స్‌Êసైన్స్‌ కళాశాల పక్షాన వెలువరించడం విశేషం. 1977లో ‘కిరణాలు’ వెలువడ్డాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్య వేటూరి ఆనందమూర్తి మార్గదర్శకత్వంలో ‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సామెతలు-కుటుంబ జీవన చిత్రణ’ అంశంపై తులనాత్మక అధ్యయనం చేసి పిహెచ్‌.డి పట్టా పొందారు. ఎం.ఫిల్‌ కూడా నాలుగు దక్షిణాది భాషల్లో తులనాత్మక అధ్యయనంగా చేశారు. 1979 అంతర్జాతీయ బాలల సంవత్సరం సమయంలోనే నలిమెల రాసిన గీతం ఆకాశవాణి ద్వారా జాతీయ గీతంగా ఎంపికై దేశమంతా ప్రచారమైంది. కవి, రచయిత, అనువాదకులు, పరిశోధకులు, నిఘంటు రూపకర్త, పరిష్కర్త అయిన నలిమెల రచనల లిస్టు అతిపెద్దది. పరిశోధనల వివరాలు అంతకు మిక్కిలి ఎక్కువ. ‘తెలంగాణ పదకోశం’ మొదలు 8 కవితా సంపుటాలు, 3 నిఘంటువులు, పద ప్రయోగ సూచికలు, 8 భాషా సాహిత్య గ్రంథాలు, ఇతర భాషల్లోంచి తెలుగులోకి 15 అనువాదాలు, తెలుగులోంచి తమిళంలోకి 2 అనువాదాలు, 4 వ్యాస సంపుటాలు, 15 వరకు అనువాదాలు నలిమెల రచనలు. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం మొదలుకుని తెలంగాణ ప్రభుత్వ కాళోజీ అవార్డు వరకు యాభైకి పైగా గౌరవ సత్కారాలందుకున్నారు.
‘ప్రశ్న నిన్ను నడపాలి/ ప్రశ్న నువ్వు జరపాలి/ సందేహం తీరుటకై/ సంకోచం వదలాలి/ అర్థం అయ్యేదాకా/ పాఠం అడిగి చెప్పించుకో/ అడిగితేనే అమ్మ బువ్వ/ పెడుతుంది గుర్తుంచుకో’ అంటూ బాల్యంలోనే ప్రశ్నై నిలవాలని చెప్పే నలిమెల పిల్లలకోసం తొలి నుండి రచనలు చేస్తున్నారు. 1979లో అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భంగా రేగులపాటి కిషన్‌రావు, ఎర్రోజు సత్యం, వేముల సత్యనారాయణలతో కలిసి ‘ఈ తరం పాటలు’ పుస్తకం తెచ్చారు. ‘నీతీ న్యాయం నిండుగవున్న/ కుర్రాల్లారా! రారండిరా!/ దుర్మార్గపు సంఘాన్ని కూల్చగ’ అంటూ ఇందులో రాశారు యువ భాస్కర్‌ బాల భాస్కరుల కోసం. దీనిని ‘రాక్షస దోపిడీకి గురవుతున్న బాలలకు అంతర్జాతీయ పిల్లల సంవత్సరం సందర్భంగా అంకితం’ చేశారీకవి. ‘పిల్లలమండీ’లో ఎక్కడ చూసినా కనిపించే బాల కార్మికులను చూపిస్తూ ‘బీడీలు చేయించుకుని/ బోళ్ళు కడిగించుకుని/ పసివాళ్ళ యేడాదంటూ/ ప్రగల్బాలు పలుకుతున్నారు’ అని నిలదీశారు. తరువాత భాషాసాహిత్యాల అధ్యయనం అనువాదాల్లో తలమునకలైవున్నా పిల్లల కోసం రాయడం మానలేదు. ఇప్పటికీ ఆ గేయ రచన, అనువాదం కొనసాగుతోంది. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ కోసం మలయాళం లోంచి ‘సముద్రశాస్త్రజ్ఞురాలు అమ్ము’, బెంగాలీ లోంచి ‘నాన్న’ పుస్తకాలు అనువదించారు. మరికొన్ని అనువాదాలు చేస్తున్నారు.
బంకీంచంద్రుని వందేమాతరంను పిల్లల కోసం ‘తల్లికీ వందనం… తల్లికీ వందనం/ మంచి నీరులా… మంచి ఫలములా../ మలయపు చలువులా.. పచ్చని పైరులా…’ అంటూ తెలుగు చెబుతారు. పిల్లలకోసం రాసిన గీతాల్లో ‘పచ్చి వెన్నముద్దల వలె/ చల్లని బుగ్గల పిల్లల్లారా/ లోతుకుపోయిన చెంపల పేద/ పిల్లలను మరువద్దు/ చేతులు చెఱుకుగడల వలె గల/ ముద్దుమురిపాల పిల్లల్లారా/ పుల్లల చేతుల పిల్లల జూసి/ పొరపాటున నువ్వు నవ్వొద్దు’ అంటూ బోధిస్తారు. ‘బంగారు కొండలు/ ఓ వువ్వులు చెండులు/ గారాల పిల్లలు/ కూరుముల తల్లులు/ మీరు మా హృదయంలో/ నవ్వుల నాట్లేస్తారు/ మీరు మా చెవుల్లోన/ తేనెలు కురిపిస్తారు/ పాడవడిన బీడువడిన/ మా ముఖాల పొలాల్లో/ ప్రసన్నమైన శాంతమైన/ పంటలు పండిస్తారు’ అంటూనే బాలల గొప్పను ‘మీ గుండ్రటి ముఖాలను/ చూసిన తరువాత/ తెలుగు అక్షరాలు/ గుండ్రంగా కుదిరాయి/ మీ ముద్దులు మూటగట్టు/ మాటలు విన్నంకనే/ తెలుగు పాటలెంతో/ తీయంగా అమరినాయి’ అని చెబుతారు. ‘పిల్లలు చిరునవ్వుల ముల్లెలు/ బాలలు ఓ నడుస్తున్న మాలలు/ మీ నవ్వుల కాంతులతో/ మమ్ముల వెలిగింతురు’ అంటారు. ఇంకోచోట ‘నేలకు పచ్చని తల/ వెంట్రుకలు చెట్లు/ గుట్టలకు ఈ చెట్లు/ గొప్ప పచ్చబొట్లు/ పాపలపుడు ఊగినట్టి/ తొట్టెలు ఈ చెట్లు’ అని చెబుతారు తరువుల పరువు గురించి. చైతన్యాన్ని మారుపేరుగా… సంస్కారం.. మంచికి నిదర్శనంగా నిలిచే ఈ భాషా భాస్కరుడు మూడు దశాబ్దాలు తెలుగు పాఠాలు చెప్పి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. పిల్లల కోసం, తన ముద్దుల మనవరాలు ఔచిత్య కోసం డా. నలిమెల భాస్కర్‌ ఇటీవల రాసిన బాల గీతాలు అచ్చులోకి రావాల్సివుంది. జయహో! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

]]>
నవ్వుల్‌ పువ్వుల్‌ https://navatelangana.com/smile-power-2/ Sat, 19 Apr 2025 16:06:30 +0000 https://navatelangana.com/?p=549373 సంతాన భాగ్యం
లక్ష్మి: నాకు 20సంవత్సరాల దాకా పిల్లలే పుట్టలేదు తెలుసా?
పూర్ణ: అవునా.. మరి అప్పుడేం చేశావ్‌?
లక్ష్మి : ఏముంది… 21 వ యేడురాగానే మావాళ్ళు పెళ్ళి చేశారు. తర్వాతి సంవత్సరంలోనే మా చింటూ గాడు పుట్టేశాడు.
ఈ శుభవార్త కోసమే
భర్త మీద అలిగి ఇల్లు విడిచి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్యకి రోజూ ఫోన్‌ చేసి ”ఎలా ఉన్నావ్‌?” అని అడిగేవాడు.
ఒక రోజు అతని అత్తగారు ఫోన్‌ తీసుకుని… ”మా అమ్మాయి నీ మీద కోపంతో ఉంది. ఇంక నీతో అస్సలు మాట్లాడదంట. నీ ఇంటికి కూడా రాదు. ఎందుకలా రోజూ ఫోన్‌ చేస్తావ్‌?” అంది.
”ఈ మాట వినడం కోసమే రోజూ ఫోన్‌ చేస్తున్నా అత్తా” అన్నాడు సదరు అల్లుడు.
సరదా సరదా
భార్య : ఏమండీ మనం సోమవారం షాపింగ్‌కి, మంగళవారం హోటల్‌కి, బుధవారం ఔటింగ్‌కి, శుక్రవారం సినిమాకు, శనివారం పిక్నిక్‌ వెళ్తే ఎలా ఉంటుంది. సూపర్‌ కదా!
భర్త : ఇవన్నీ జరిగితే మనం ఆదివారం గుడికి వెళ్ళాలి
భార్య : ఎందుకు?
భర్త : అడుక్కోటానికి..
నిజం తెలుసుకుందామని…

నోకియా మొబైల్‌ ఉన్న రోజుల్లో చలపారు ఒక మొబైల్‌ షాప్‌కి వెళ్ళాడు
చలపారు : నోకియా మోబైల్‌ లో ఏదైనా పెద్ద స్క్రీన్‌ ఉన్నది చూపించు…
(షాప్‌ అతను ఒక మొబైల్‌ ఇచ్చాడు. మనోడు దాని ఆన్‌, ఆఫ్‌ చేసి చూసి మళ్ళీ ఆఫ్‌ చేసి అక్కడ పెట్టేశాడు.)
చలపారు : దీని కంటే పెద్దది చూపించు…
షాపతను : ఇంకాస్త పెద్దది చూపించాడు.
మనోడు మళ్లీ అలానే చేసి చూడాడు
షాపతనికి కోపం వచ్చి మీకు ఏం కావాలి అని గట్టిగా అడిగాడు
చలపారు : ఏం లేదు నోకియా మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ ఆన్‌ చేసినపుడు, ఇద్దరు చేతులు కలుపుకుంటారు కదా…
వాళ్ళిద్దరూ ఎవరో పెద్ద స్క్రీన్‌లోనైతే కనిపిస్తుందేమోనని!
పని – జీతం
రాజు : ఈ ఇంట్లో బట్టలుతకడం, అంట్లుతోమడం, వంటపని అంతా నేనే చేస్తాను.
సురేష్‌ : అలాగా, జీతం ఎంతిస్తారేమిటి?
రాజు : అయ్యో జీతం అడిగితే మా ఆవిడ ఇంట్లోంచి బయటకు తరిమేస్తుంది.

]]>
మానవీయ స్పర్శ ఉన్న పాట https://navatelangana.com/the-song-with-a-humanistic-touch/ Sat, 12 Apr 2025 18:20:18 +0000 https://navatelangana.com/?p=544999 A song with a human touchపాట జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఉద్యమాలకు ఊతమిస్తుంది. చైతన్యపరుస్తుంది. సామాజిక గీతాలకు ఉన్న ఆదరణ కవిత్వానికి కూడా ఉండదు. పాట సులువుగా నోళ్ళల్లో నానుతుంటుంది. కవిత్వం సామాన్యుడు సులువుగా పట్టుకోలేడు. పాట ప్రాశస్త్యాన్ని కవిత్వంగా మార్చిన గోపగాని రవీందర్‌ కవిత ఎన్ని పార్శ్వలను పరిచయం చేస్తుందో తెలుసుకుందాం. కవి ‘నేనొక పాటను’ అని రాసిన ఈ కవితలో తనను పరవశమొందించిన ‘పాట’ జీవాన్ని పట్టుకుందాం.

పాట పసిపిల్లాడిగా ఉన్నప్పుడే మనిషి జీవితంలోకి ప్రవేశిస్తుంది. జోలపాటలా మారి నిద్రపుచ్చుతుంది. పాట పాడకపోతే నిద్రపోని శిశువులు ఉన్నారు. పాటలో మత్తు ఉంది. మహత్తు ఉంది. అలాంటి పాటలా మారిపోయాడీ కవి. ఎత్తుగడలో ఈ విషయాన్ని పట్టుకొచ్చి ఓ క్రమ పద్ధతిగా కవితను నిర్మించాడు. పాటలా మారిపోయి కవి మానవీయతను, ప్రకతిని తనలోకి తీసుకొని మంచిదారిని నిర్మాణం చేస్తున్నాడు. ఎవరైనా ఒకరు ఆ దారి గుండా నడవక పోతారా అనే ఆశ కవి వాక్యాల్లో కనిపిస్తుంది.
పాటకు, పచ్చని చెట్టుకు ఏం సంబంధం ఉంది అనే ప్రశ్న వేసుకుంటే అడవికి, మనిషికి ఉన్న సంబంధం ఉంది. ఈ సందర్భానికి జయరాజు రాసిన పాట ”పచ్చని చెట్టును నేను రా, పాలు గారే మనసు నాదిరా” గుర్తొస్తుంది. కవికి, చెట్టుకు, పాటకు విడదీయరాని అనుబంధం ఉంది. సూర్యకాంతికి, చెట్టుకు మధ్య ఉండే సంబంధం అదే. ఈ కవితా పాటలో కవి ప్రకతిలోని పచ్చదనానికి కారణమైన వెలుగు కిరణాలను స్మరిస్తున్నాడు. పాటైనా, కవితయినా వెలుగును ప్రసాదించేదే కదా! అందుకోసమే రవీందర్‌ ‘నేనొక పాట’ను అంటూ తపిస్తున్నాడు.
కవి సమాజంలోని మనుషుల మధ్య సంబంధాలను కోరుకుంటున్నాడు. మాటలతో సమాజాన్ని పునర్నిర్మాణం చేయాలన్న కాంక్షను కలిగినవాడు. ఆత్మీయతతో అందరూ ఒక దగ్గర కూడాలని ఈ కవిత వాక్యాల ద్వారా సందేశం పంపుతున్నాడు. ప్రకతిలో భాగమైన పంట పొలాల అవసరం గూర్చి చెబుతూ అందరినీ సమానంగా చూస్తూ అందరి ఆకలి తీర్చే పొలాల వంటి పాటను నేను అని రైతు పక్షాన గొంతు విప్పి మాట్లాడుతున్నాడు. ఈ పాట తన ఒక్కడి పాట కాదు. మనందరి పాట. ప్రకతి పాట. మానవీయ స్పర్శ ఉన్న పాట.
ఈ కవితా పాటలో కవి ప్రకతిని గూర్చి పలవరిస్తూ రాసినా, మానవీయత అవసరాన్ని ఎలుగెత్తి చాటినా మనిషి కోసమే రాశాడు. మనిషిలో పచ్చదనాన్ని అద్దటం కోసమే తాపత్రయపడ్డాడు. ‘నేనొక పాట’ను అంటూ బయలుదేరి మనల్ని కూడా పాటలుగా మలిచే దారిలోకి చకచగా అడుగులు వేస్తున్నాడు. ఈ పాటలోకి వెళ్లి ఆ దారిని గమనించండి. ఆ తదుపరి ఎవరి దారి వాళ్ళు చూసుకోండి.
‘నేనొక పాటను’
కాలం వంతెన మీద
పసిపిల్లాడిని నిద్రపుచ్చడానికి
తల్లి పాడే జోలపాట లాంటి పాటను..!
అడవిలోని పచ్చని చెట్లకు
ఊపిరిపోసే
వెలుగు కిరణాల లాంటి పాటను..!
మాటకు మాటకు మధ్యన
మొలకెత్తుతున్న ఆత్మీయతలకు
ఆయువు పట్టులాంటి పాటను..
దారి పొడుగున పలకరిస్తున్న
అన్నార్తుల ఆకలిని తీర్చే
తల వంచని పొలాల వంటి పాటను..!
అలుపులేని జీవన సమరంలో
సగటు మనిషిని అక్కున చేర్చుకునే
మానవీయమైన స్పర్శలాంటి పాటను..!
చూడముచ్చటైన దశ్యాలతో
చుట్టూ అలరారుతున్న రమణీయతతో
ఆలపిస్తున్న ప్రకతి లాంటి పాటను..
– గోపగాని రవీందర్‌

– డా|| తండ హరీష్‌ గౌడ్‌
8978439551

]]>
బండి ఒడాయగద! https://navatelangana.com/the-cart/ Sat, 12 Apr 2025 18:19:01 +0000 https://navatelangana.com/?p=544996 The cart is moving!ఏంది సిన్నమ్మ జగదీసు ఇస్కుల్కి పోతలేడా? ఎప్పట్సంది? ఎందుకంట? కిలాసులో కూసొని సారు పాటం చెప్తంటే ఇనక తిక్కమాటలు కోతి సాతలు చేస్తాంటే సారు యాస్టకొచ్చి బయటికి దొబ్బిండ, తోటి పోరగాళ్లు నవ్విన్రని ఈ దొరకు రోసం ఒచ్చినాది?
నువ్వెమ్‌ బుగుల్పడకు, నేను సీద జేస్త. అగో ఒస్తుండు గద దొర. ఎండకు మొకం అంత మార్చుకుని కడ్పు గాలిందేమొ తినిపోడాని అస్తుండేమొ ఇల్లు గుర్తుచ్చిందేమొ.
ఏం జెగ్దిస్‌ బేట! యాడ్నుండోస్తున్నవ్‌ ముకం గుంజుక పోయింది ఎప్పడెల్లినవ్‌ ఇంటి నుండి? కాల్సేతులు కడ్కోని ముందు ఇంత దిను. సిన్నమ్మ ముందు అన్నం దినవెట్టు నీ కొడ్కుకి.
తిన్నవా.. చెయ్యి, మూతి కడ్కోని ఇగరా. సూడు ఇస్కుల్కు ఎందుకు పోతలేవ్‌ చెప్పు, నీవు మాట తప్పించుకు నాకంత ఎర్కనే. నేను ఇస్కుల్ల అర్సుకున్న మీ దోస్తులు కూడ సెప్పిండ్రు, నివ్వు కిలాసుల కోతి సాతలు సెయ్యడం నీ తప్పు. నీకు పాటాలు చెప్పనీకె దూరం నుండి సార్లు, టీచర్లు ఒస్తుంటే మీరు కిలాసుల ఇస్వంటి పనులు చేస్తుంటే యాస్టకు రాద? నివ్వు ఇనవంట, పక్కోని ఇయనీయవంట. తప్పు నీకాడ పట్కుని రోసుపడ్తె ఎవర్కి నష్టం? ఆ వంక పెట్టి యిస్కుల్కు పోవడం మానేసి, రోడ్ల పోట తిరుగుతున్నవ్‌!
రేపటి సంది ఇస్కుల్కి పోవాలె ఏంది? రేపు సుట్టినా! ఎందుకంట? ఏమి తెల్వద? చుట్టి ఎందుకో తెల్సున, అంబెత్కర్‌ సాబు పుట్టినదినం. ఆయనెవరని అడ్గుతున్నావ్‌? నీ యసంటోడు గాడు. తన తప్పేమ్‌ లేకున్న సదువు మీద ఇంటరెస్టుతో ఇస్కుల్లకు తోల్కపోతె బతిమిలాడి జాయిన్‌ అయి, చిన్న కులపోడని అందర్పక్కన, బేంచిల మీద కుసోనియకుంటే దూరంగ తల్పుకాడ నేలమీద కుసొని సద్వి, బేంచిల మీద కూసున్న పెద్ద కులపోల్ల కన్న ఎక్వ మార్కులు తెచ్చుకుండు.
గాదినాల్ల పెద్దకులపోల్లకి ఎదుర్పడ్డ తప్పె, తలెత్తి చూన్న తప్పే. ముట్టుకున్న తప్పె, దూపైతె తాగనికి నీల్లు కూడా ఇచ్చెటోల్లు కాదు. పైసలిచ్చిన బండిల ఎక్కనిచెటోల్లు కాదు. అన్ని కస్టాలు బడికూడ గా మన్సి ఒక్క దినం సద్వు మాన్లె. ఏడ్సుకుంట ఇంట్ల కూసోలే. అన్నిట్కి ఓర్సుకుని పట్టుదలగా చదివి కామ్యబ్‌ అయ్యిండు.
గా సద్వులు గూడ గన్ని ఇయిన్న గావు, ఆ దినాల్ల వున్న సద్వులని గాయిన్నె సద్విండన్నట్లు. గవ్వెట్టి పేర్లు గూడ మనకు నోర్దిర్గవ్‌. సద్వులెక్కనె పెద్ద పెద్ద కొల్వులు గూడ చేసిండు.
ఇంగ్లీసోల్లు ఎల్పోయి మన దేశానికి సొతంత్రం ఒచ్చినంక ఉక్మతు తీరంత మార్చెసిండ్రు. గప్పుడు మనమంద్రం గెటెట్ల నడ్సుకోవాలే, ఏమేమ్‌ సరతలు అన్ని సూపిస్త ఒక పెద్ద పొస్తకం రాపించిండ్రు, గది రాజ్యంగం మన్నట్లు. పాపం ఓప్కెతోని అన్ని రాసి తయారు సేసిండ్రు. దాని పకారమె మనమంద్రం నడ్సుకుంటున్నం. గప్పుడు బెయిజ్జతు చేసిన పెద్ద కులపోల్లు యాడికిపోయిండ్రో? నీలెక్క రోసపడి కూసుంటే గియ్యన్ని అయ్యేటివా. బండి ఓడాయగద!
– గంగరాజ పద్మజ, 9247751121

]]>