నవతెలంగాణ – నారాయణపేట: లోక్ సభ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న తరుణంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల అధినాయకుల ప్రచారాలు హోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈనెల10న ఒక్క గంట తేడాతో ..బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎన్నికల ప్రచార సభలు భారీ సభలను నిర్వహించేందుకు ఆయా పార్టీల నాయకులు సన్నద్ధం అవుతున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఈ నెల10న షెడ్యూలు ఖరారు అయ్యింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానుండడంతో సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సారథ్యంలో ఆ పార్టీ నాయకులు సన్నద్ధం అయ్యారు. ఇదిలా ఉండగా..నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందు రెడ్డికి మద్దతుగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఈ నెల 10న షెడ్యూల్ ఖరారు అయ్యింది. ప్రధానమంత్రి సభ ఆరంభమైన గంట తర్వాత మధ్యాహ్న 3 గంటల నుండి కాంగ్రెస్ సభ జరగనుంది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఒకేరోజు నారాయణపేట జిల్లాలో జరిగే రెండు బహిరంగ సభలకు ఇటు ప్రధాని, అటు ముఖ్యమంత్రి హాజరవుతుండడం తో శాంతిభద్రతలను కాపాడవలసిన పోలీసులు, జన సమీకరణ చేయవలసిన నాయకులు, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు.
నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కె. కృతివాసన్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.25.4 కోట్లు వేతనంగా తీసుకున్నారు. గతేడాది జూన్ 1న కంపెనీ బాధ్యతలు తీసుకున్న ఆయన, అంతకుముందు కంపెనీ బీఎఫ్ఎస్ఐ గ్లోబల్ హెడ్గా పనిచేశారు. అయితే, కృతివాసన్ జీతం కంపెనీ మాజీ సీఈఓ రాజేష్ గోపీనాథన్ కంటే కొంచెం తక్కువగా ఉంది. రాజేష్ గోపీనాథన్ 2022-23లో రూ. 29.16 కోట్ల వేతనాన్ని అందుకున్నారు.
చిన్నతనంలో ట్రాఫిక్ రూల్స్ పై ఈ పిల్లలు అవగాహన కల్పిస్తోన్న తీరు అభినందనీయం. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల జరిగే అనర్ధాల గురించి ఒక్కొక్కటిగా పిల్లలకు అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు, టీచర్స్ వారిలో సామాజిక స్పృహను నింపాలి. @MORTHIndia #Road #RoadSafety #TrafficRules pic.twitter.com/XWxyjtlzuv
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 9, 2024
]]>
Request all fellow citizens to stock up on the following products
Six Guarantees
1. Inverter
2. Charging bulbs
3. Torch lights
4. Candles
5. Generators
6. Power Banks
Remember it’s the Congress Govt, Not BRS’
Vote wisely on 13th May #Vote4Car #KCRForTelangana
— KTR (@KTRBRS) May 9, 2024