– గతంలో ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసిన బీఆర్ఎస్
– రాష్ట్ర ఐటి పరిశ్రమల, శాసన సభ వ్యవహారల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ఆరోపణ
నవతెలంగాణ – మల్హర్ రావు
ఈసీ అక్కసుతో రైతులపై బీజేపీ కుట్రలు చేస్తుంటే, గత బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిందని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆరోపించారు..పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకి ఓటువేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా దుద్దిళ్ల మాట్లాడారు యాసంగిలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సమయము కంటే ముందే రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసిందన్నారు..ఈసి ఎలక్షన్ ని అస్రంగా చేసుకొని బీజేపీ రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకుండా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.కేంద్రంలో బిజెపి నల్ల చట్టాలను తీసుకవచ్చి రైతులను నట్టేట్ట ముచ్చే కార్యక్రమం చేసిందని.నల్ల చట్టలపై పోరాటము చేసిన రైతులను బీజేపీ పార్టీ ఇబ్బందులకు గురి చేసి పొట్టన పెట్టుకుందన్నారు. రాష్ట్రములో బిఆరెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతు బంధు (రైతు బరోనా)తో రైతుల ఖాతాలల్లో డబ్బులను జమ చెయ్యడం జరిగిందని,.ఈసిని అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీ రైతుల ఖాతాలో జమ అయినా సొమ్మును నిలిపివేసే కార్యక్రమం చేస్తుందని ఆరోపించారు.బీజేపీ చేస్తున్న కుట్రలు రైతులు అందరూ గమనించాలన్నారు.రైతు బందు (రైతు భరోసా) డబ్బులు రైతులకు రైతుల ఖాతాలల్లో క్రమ క్రమంగా జమ చేస్తుంటే దీనిని ఈసి ఎందుకు నిలిపిసిందని బీజేపీలో భాగంగానే కుట్ర అని చాలా స్పష్టంగా కనబడుతుందన్నారు.బీజేపీ,బిఆరెస్ పార్టీలు రైతు బంధు (రైతు భరోసా) నిధులను నిలుపుదల చేసి రెండు పార్టీ లు కుట్రలు చేశాయని,రైతులకు ఈ రెండు పార్టీ లు రైతులకు సమాధానం చెప్పాలన్నారు.బీజేపీ, బిఆరెస్ పార్టీలకు రైతులు గట్టిగా బుద్ది చెప్పాలని ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
రైతులకు సంబందించిన ఎరువులు,పని ముట్లకు ఎలాంటి సబ్సిడీ లేకుండా చేశాయన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీ లలో ఉచిత బస్ సౌకర్యం,రూ.500 గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల ఉచిత కరెంట్,రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ అమలు చేశామన్నారు.ఎలక్షన్ కోడ్ తర్వాత మిగిలిన హామీలను తప్పకుండ అమలు చేస్తామన్నారు. ప్రతి పేద వాడికి ఉపయోగపడే కార్యక్రమాన్ని ముందుకు తీసుకవేళ్తామన్నారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం చదువుకున్న యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగిందని, ఈ పది సంవత్సరాల్లో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు.ఎరువులు,డీజిల్,పెట్రోల్ ల ధరలు పెంచి రైతులకు అన్ని రకాలుగా నష్టం చేయడం జరిగిందని ఆరోపించారు.బీజేపీ పార్టీ ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు కదా.సోనియా గాంధీ నాయకత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదలు పెట్టిందని, కాంగ్రెస్ పార్టీ ఉపాధి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిదంగా సమాచార హక్కు చట్టాన్ని కూడా ప్రతి ఒక్కరి సమాచారం తెలియజేయాలనీ కొత్త చట్టాలను తీసుకవచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ చేసిందన్నారు.గత కేంద్రం బడ్జెట్ లో ఉపాధి హామీ పథకాన్నీ నీరు గార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు.కేంద్రంలో బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పటం, బీసీ,ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్ లను మారుస్తాం అని చెప్పటం ప్రత్యేక్షముగా పరోక్షంగా చెప్పటం వాస్తవం కదాని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన లాల్ శర్మను ప్రశ్నించారు.డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రచించి, రాజ్యాంగాన్ని స్ఫూర్తి సమానత్వాన్ని, ప్రతి ఒక్క వ్యక్తికి సమాన హక్కులు కల్పించి వ్యవస్థలను నిర్మాణం చేసేది రాజ్యాంగం స్ఫూర్తి.డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి కి అనుగుణంగా 75 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ బడుగు వర్గాలకు,బీసీ లకు,మైనారిటీ లకు మేలు చెయ్యాలని సమానత్వాన్ని తిసుకరావాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ రాజ్యాంగాన్నీ తిరగరాసి ఎస్సి,ఎస్టీ,బీసీ రిజర్వేషన్ లు తీసివేయాలని బీజేపీ పార్టీ విధానాలు చూస్తే స్పష్టంగా కనబడతవుందన్నారు.సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గె , ఓబీసీ లకు కుల గణాన కార్యక్రమం రాష్ట్రములో మొదలు పెట్టడం జరిగిందని,జనాభా కుల గణన ప్రకారం బడ్జెట్ కేటాయింపు చేసుకొని రాహుల్ గాంధీ నాయకత్వంలో జనాభా ప్రతిపాదికన ఆ శాతం వారికీ ఆర్థికంగా,సామాజికంగా రాజకీయంగా హక్కులను కల్పియాలని ఆలోచన చేసిన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో నిర్ణయం తీసుకోని బీసీ లకు కుల విభజన ఒక విప్లవత్మకమైన అలోచన చేసి ముందుకు తిసుకెళ్తున్నామన్నారు.రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే దేశ స్థాయిలో కూడా అన్ని వర్గాల వారికీ మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పారు.రాష్ట్ర విభజన సమయంలో ఇదే ప్రధాన మంత్రి రాష్ట్ర ప్రజలను,మనోభావాలను హేళన చేశారని.రాష్ట్ర మనోభావాలను దెబ్బ తియ్యడమే కాకుండా విభజన చట్టాలను అమలు చెయ్యకుండా రాష్ట్రనికి రావాల్సిన వ్యస్థలను రానీయకుండా అడ్డుకుంటూ.. బీజేపీ పార్టీ కి కి బిఆరెస్ పార్టీ వెనుక నుండి పూర్తిగా స్థాయిలో సపోర్ట్ చేస్తూ.. విభజన చట్టంలో ఉన్న విశ్వ విద్యాలయాలు,బయ్యారం ఉక్కు ఫ్యాక్టరి,ఐటీడిఏ,ఎన్టీపిసి,మైనింగ్ యూనివర్సిటీ గాని అనేక అంశాలు పక్కన పెట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.