– ఏడుగురికి పద్మ విభూషణ్
– 19 మందికి పద్మ భూషణ్..
– 113 మందికి పద్మశ్రీ
– ఏడుగురు తెలుగువారికి పురస్కారాలు
– తెలంగాణ నుంచి ఇద్దరు..
– ఏపీ నుంచి ఐదుగురు
– వైద్య విభాగంలో దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్
– ప్రజా వ్యవహారాలు కేటగిరిలో మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ
– ఏపీ నుంచి నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్
– మరో నలుగురికి పద్మశ్రీ
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 ఏడాదికి గానూ కేంద్రం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఏడుగురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. పద్మ అవార్డుల్లో ఏడుగురు తెలుగువారున్నారు. వీరిలో తెలంగాణ నుంచి ప్రఖ్యాత వైద్యులు దువ్వూరి నాగేశ్వర్రెడ్డి.. పద్మ విభూషణ్కు ఎంపికయ్యారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ వరించింది. ఇక ఏపీ నుంచి కళల విభాగంలో సినీనటుడు బాలకష్ణ పద్మభూషణ్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. బ్రెజిల్కు చెందిన వేదాంత గురు జోనల్ మాశెట్టి, కువైట్కు చెందిన షేకా ఏజే అల్ సబాహ్, నేపాల్కు చెందిన నరేన్ గురుంగ్లు పద్మశ్రీ అవార్డులకు ఎంపికైనవారిలో ఉన్నారు.
ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తారు. పద్మ అవార్డులను పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో కేంద్రం అందిస్తుంది. కళల, సమాజ సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలతో పాటు వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలు అందించినవారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు.
పద్మ విభూషణ్ వీరికే
దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (వైద్యం) – తెలంగాణ
జస్టిస్ జగదీశ్ ఖేహర్ (రిటైర్డ్) (ప్రజా వ్యవహారాలు) – చండీగఢ్
కుముదిని రజినీకాంత్ లాఖియా (కళలు) – గుజరాత్
లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు) – కర్నాటక
ఎం.టి.వి.వాసుదేవన్ నాయర్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) – కేరళ
ఓసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) – జపాన్
శారదా సిన్హా (కళలు) – బీహార్
పద్మభూషణ్ వీరికే..
నందమూరి బాలకష్ణ (కళలు) – ఆంధ్రప్రదేశ్
ఎ.సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – కర్నాటక
అనంత్ నాగ్ (కళలు) – కర్నాటక
బిబేక్ దెబ్రారు (మరణానంతరం) (సాహిత్యం, విద్య) – ఎన్సీటీ ఢిల్లీ
జతిన్ గోస్వామి (కళలు) – అసోం
జోస్ చాకో పెరియప్పురం (వైద్యం) – కేరళ
కైలాశ్ నాథ్ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) – ఎన్సీటీ ఢిల్లీ
మనోహర్ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – మహారాష్ట్ర
నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) – తమిళనాడు
పీఆర్ శ్రీజేశ్ (క్రీడలు) – కేరళ
పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) – గుజరాత్
పంకజ్ ఉదాస్ (మరణానంతరం) (కళలు) – మహారాష్ట్ర
రామ్బహదుర్ రారు (సాహిత్యం, విద్య, జర్నలిజం) – ఉత్తర్ప్రదేశ్
సాధ్వీ రీతంభర (సామాజిక సేవ) – ఉత్తర్ప్రదేశ్
ఎస్.అజిత్ కుమార్ (కళలు) – తమిళనాడు
శేఖర్ కపూర్ (కళలు) – మహారాష్ట్ర
శోభన చంద్రకుమార్ (కళలు) – తమిళనాడు
సుశీల్ కుమార్ మోడీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – బీహార్
వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – అమెరికా
పద్మశ్రీ అవార్డులు
మందకృష్ణ మాదిగ (ప్రజావ్యవహారాలు) – తెలంగాణ
కె.ఎల్ కృష్ణ (సాహిత్యం, విద్య) – ఆంధ్రప్రదేశ్
మాడుగుల నాగఫణి శర్మ (కళలు) – ఆంధ్రప్రదేశ్
మిర్యాల అప్పారావు(మరణానంతరం) (కళలు)- ఆంధ్రప్రదేశ్
వదిరాజ్ రాఘవేంద్రచార్య పంచముఖి (సాహిత్యం, విద్య) – ఆంధ్రప్రదేశ్
జోనస్ మాశెట్టి (వేదాంత గురు) – బ్రెజిల్
హర్వీందర్సింగ్ (పారాలింపియన్ గోల్డ్మెడల్ విన్నర్) – హర్యానా
భీమ్ సింగ్ భవేష్ (సోషల్వర్క్) – బీహార్
పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు)- పుదుచ్చేరి
ఎల్.హంగ్థింగ్ (వ్యవసాయం-పండ్లు)- నాగాలాండ్
బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) – మధ్యప్రదేశ్
షేఖా ఎ.జె. అల్ సబాహ్ (యోగా)- కువైట్
నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) – నేపాల్
హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) – హిమాచల్ ప్రదేశ్
జుమ్దే యోమ్గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్ప్రదేశ్
విలాస్ దాంగ్రే (హౌమియోపతి వైద్యుడు) – మహారాష్ట్ర
వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) – కర్నాటక
నిర్మలా దేవి (చేతి వృత్తులు) – బీహార్
జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు)- అసోం
సురేశ్ సోనీ (సోషల్వర్క్- పేదల వైద్యుడు)- గుజరాత్
రాధా బహిన్ భట్ (సామాజిక కార్యకర్త)- ఉత్తరాఖండ్
పాండి రామ్ మాండవి (కళాకారుడు) – ఛత్తీస్గఢ్
లిబియా లోబో సర్దేశారు (స్వాతంత్య్ర సమరయోధురాలు) – గోవా
గోకుల్ చంద్ర దాస్ (కళలు)- పశ్చిమ బెంగాల్
సాల్లీ హౌల్కర్ (చేనేత)- మధ్యప్రదేశ్
మారుతీ భుజరంగ్రావు చిటమ్పల్లి (సాంస్కృతికం, విద్య)- మహారాష్ట్ర
బతూల్ బేగమ్ (జానపద కళాకారిణి) – రాజస్థాన్
వేలు ఆసన్ (డప్పు వాద్యకారుడు) – తమిళనాడు
భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట) – కర్నాటక
పర్మార్ లావ్జీభారు నాగ్జీభారు (చేనేత)- గుజరాత్
విజయలక్ష్మి దేశ్మానే (వైద్యం)- కర్నాటక
చైత్రం దేవ్చంద్ పవార్ (పర్యావరణ పరిరక్షణ)- మహారాష్ట్ర
జగదీశ్ జోషిలా (సాహిత్యం)- మధ్యప్రదేశ్
నీర్జా భట్లా (గైనకాలజీ) – ఢిల్లీ
హ్యూ, కొల్లీన్ గాంట్జర్ (సాహిత్యం, విద్య -ట్రావెల్) – ఉత్తరాఖండ్