నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట సభ అనంతరం హైదరాబాద్ వెళుతున్న సీఎం కెసిఆర్ ఒక్క సారి సిద్దిపేట దాబా వద్ద ఆగి చాయ్ త్రాగారు. సిద్దిపేట చాయ్ త్రాగిన రోజులు గుర్తు చేసుకున్నారు. ఢిల్లీకి రాజు అయిన తల్లికి కొడుకు అన్నట్టు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సిద్దిపేట కు బిడ్డ నే అనే మాటకు సీఎం కేసీఆర్ సదా సీదా గా సిద్దిపేట దాబా లో చాయ్ త్రాగి అశ్చర్యం కలిగించారు. ముఖ్యమంత్రి హోదా లో తొలి సారి గా సాధారణ వ్యక్తి గా తన పురిటి గడ్డ ఫై ప్రేమను చాటి చెప్పారు.
సిద్దిపేట కుటుంబంగ బావించే నాయకులు అనడానికి ఇదే గొప్ప నిదర్శనం.