ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి: చిరంజీవి

నవతెలంగాణ – హైదరాబాద్: దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చిరంజీవి ఆయనకు నివాళి అర్పించారు. ‘కొందరి కీర్తి అజరామరం. భావితరాలకు ఆదర్శం. తారక రామారావు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచిత గౌరవం అని భావిస్తున్నా. తెలుగువారి ఈ చిరకాల కోరికను కేంద్రప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Spread the love