క్యాన్సర్‌తో బాధపడుతున్న 93 ఏళ్ల వృద్ధునికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన సిటిజన్స్ హాస్పిటల్‌

Citizens Hospital gave a new life to a 93-year-old man suffering from cancerనవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ) ఎసెండింగ్ కోలన్ (పెద్దప్రేగులో భాగం మరియు ఉదరం లో కుడి వైపున పై దిశగా ఉంటుంది) క్యాన్సర్‌తో బాధపడుతున్న 93 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా చికిత్స అందించింది. అధునాతన క్యాన్సర్ చికిత్స మరియు కనీస కోత శస్త్ర చికిత్స పద్దతి లో ఆసుపత్రి నైపుణ్యాన్ని ఇది ప్రదర్శిస్తుంది. శ్రీ ఘీసారం, గత రెండు నెలలుగా కడుపు నొప్పి మరియు బరువు తగ్గడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. శ్రీ ఘీసారంను క్షుణ్ణంగా పరీక్షించిన తరువాత , శస్త్రచికిత్సా బృందం అత్యంత క్లిష్టమైన లాపరోస్కోపిక్ అసిస్టెడ్ రాడికల్ రైట్ హెమీ కోలెక్టమీని నిర్వహించింది. దీనిలో భాగంగా పెద్దప్రేగు యొక్క కుడి వైపు భాగాన్ని కొంత తీసివేసి, పేగులోని మిగిలిన భాగాలను తిరిగి కనెక్ట్ చేసింది. రోగి వయస్సు ఎక్కువగా ఉండటం ఈ శస్త్ర చికిత్స లో ఒక ప్రత్యేకమైన సవాలును అందించింది, అయితే ఏఓఐలోని నిపుణుల బృందం ఈ ప్రక్రియను అత్యంత ఖచ్చితత్వంతో జాగ్రత్తగా నిర్వహించగలిగింది. రోగి స్థిరంగా కోలుకున్నారు, ఫలితంగా శస్త్ర చికిత్స చేసిన అనంతరం 5వ రోజున అతనిని డిశ్చార్జ్ చేశారు. భారతదేశం అంతటా క్యాన్సర్ సంరక్షణను అభివృద్ధి చేయడంలో ఇటువంటి ఫలితాల యొక్క ప్రాముఖ్యతను సిటిఎస్ఐ – దక్షిణాసియా సీఈఓ – హరీష్ త్రివేది నొక్కిచెప్పారు. ఆయన మాట్లాడుతూ “ఈ కేసు ఏఓఐలో నైపుణ్యం మరియు ఆవిష్కరణలను హైలైట్ చేస్తుంది. క్యాన్సర్ చికిత్సలో నూతన ప్రమాణాలను చేయడం కొనసాగించడమే మా లక్ష్యం, అత్యంత సంక్లిష్టమైన కేసులకు కూడా ప్రపంచ స్థాయి సంరక్షణ అందుబాటులో ఉందనే భరోసా మేము అందిస్తున్నాము. శ్రీ ఘీసారం యొక్క విజయవంతమైన ఫలితం రోగులకు వారి వయస్సు లేదా ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా మెరుగైన వైద్యం అందించడంలో మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.
ఈ రోగికి అతి తక్కువ కోత తో లాపరోస్కోపిక్ శస్త్ర చికిత్స చేశారు. ఈ చికిత్స అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో రోగి త్వరగా కోలుకోవడం , శస్త్రచికిత్స వల్ల ఎదురయ్యే ప్రమాదాలు తగ్గించబడటం వంటివి వున్నాయి. ముఖ్యంగా పెద్ద వయసు రోగులకు ఇది చాలా కీలకం. ఈ శస్త్రచికిత్సలో అధునాతన లాపరోస్కోపిక్ పద్ధతులు & కాంప్లెక్స్ అనస్థీషియా పర్యవేక్షణ వంటివి భాగంగా వున్నాయి. పెద్దప్రేగు యొక్క ప్రభావిత విభాగం ను సురక్షితమైన మరియు ప్రభావవంతమైన రీతిలో తొలగింపును ఇది నిర్ధారిస్తుంది. డాక్టర్ ప్రభాకర్ పి, ఏఓఐ, రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (ఆర్ సిఓఓ), తమ బృందం సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు: “ అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో ఉన్న ఈ పెద్ద వయస్సు రోగికి విజయవంతంగా చికిత్స చేయడం మా ఆంకాలజీ బృందం యొక్క అంకితభావం మరియు నైపుణ్యానికి నిదర్శనం. ఏఓఐలో మా దృష్టి అత్యాధునిక క్యాన్సర్ కేర్‌ను అందించడంపై మాత్రమే కాకుండా, వయస్సు లేదా కేసు యొక్క సంక్లిష్టతతో సంబంధం లేకుండా మా రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడంపై కూడా ఉంది..” అని అన్నారు.రోగి యొక్క పురోగతిపై డాక్టర్ ప్రతాప్ వర్మ, (సర్జికల్ ఆంకాలజీ & థొరాసిక్ సర్జరీ), లాపరోస్కోపిక్, రోబోటిక్, మరియు హైపెక్ సర్జన్ మాట్లాడుతూ “శ్రీ ఘీసారం యొక్క వయస్సు ఎక్కువగా ఉండటం చేత , మేము ప్రమాదాలను చాలా జాగ్రత్తగా చూసుకున్నాము. అయినప్పటికీ, అతని స్థిరత్వం మరియు మా మినిమల్లీ ఇన్వాసివ్ టెక్నిక్‌ల అనస్థీషియా బృందం యొక్క సామర్థ్యాలు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడానికి మాకు తోడ్పడ్డాయి. అతను బాగా కోలుకోవడం మరియు మంచి ఆరోగ్య స్థితికి తిరిగి రావడం చూసి మేము సంతోషిస్తున్నాము” అని అన్నారు. రోగి యొక్క ఆరోగ్యం మరియు కోలుకునే క్రమాన్ని ఏఓఐ వద్ద ఉన్న డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తుంది, అతను మెరుగైన సంరక్షణ మరియు అవసరమైన మద్దతును పొందుతున్నాడని నిర్ధారిస్తుంది. భారతదేశం అంతటా ఆంకాలజీ చికిత్సలో అగ్రగామిగా కొనసాగుతున్నందున, టాప్-టైర్ క్యాన్సర్ కేర్ అందించడంలో ఆసుపత్రి నిబద్ధత స్థిరంగా ఉంది.

Spread the love