ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం

నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని సీఐటీయూ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఐటీయూ సీనియర్‌ నాయకులు జంగయ్య ముఖ్యఅతిది ¸గా పాల్గొని సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ 53 సంవత్సరాలుగా సీఐటీయూ కార్మికులకు అండగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం చేయడంలో తమ సంఘం ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. ప్రతి కార్మికుడు విధిగా సీఐటీయూలో సభ్యత్వం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికులకు ఎలాం టి సమస్యలు ఉన్నా సీఐటీయూ దృష్టికి తీసుకొని వస్తే తక్షణం సమస్యల పరిష్కారం కోసం పోరాడుతారని ఆయ న హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్‌, ప్రేందాస్‌, అర్జున్‌, యాదగిరి, గండయ్య, నర్సింహా పాల్గొన్నారు.
కాటేదాన్‌ క్లస్టర్‌ కమిటీ ఆధ్వర్యంలో ..
విజయ ఆయిల్‌ మిల్‌లో సీఐటీయూ సీనియర్‌ నాయకురాలు సువార్త జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా క్లస్టర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చాంద్‌ పాషా, రహీం, యాదమ్మ, హైమావతి, లావణ్య, సుజాత, ఈశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love