రేపు ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌..

10th-studentsనవతెలంగాణ-హైద‌రాబాద్ : ఈ నెల 28న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు అధికారికంగా ప్ర‌క‌టించారు. ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల‌ను ఈ వెబ్‌సైట్‌ bse.telangana.gov.in లో చూసుకోవ‌చ్చు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్‌ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించారు. తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 30న విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. టెన్త్ వార్షిక‌ ఫ‌లితాల్లో 91.31 ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. బాలిక‌లు 93.23 శాతం ఉత్తీర్ణ‌త‌, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, ఆరు స్కూల్స్‌లో జీరో ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. గ‌తేడాది 89.60 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఈ ఏడాది టెన్త్‌ వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు నిర్వహించారు. వీటికి 5,08, 385 విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.

Spread the love