అధికారిక లాంచనాలతో గద్దర్‌ అంత్యక్రియలు…సీఎం కేసీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్‌: తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌.. తెలంగాణ గర్వించే బిడ్డ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు తెలిపారు. జీవితాంతం ప్ర‌జ‌ల కోసం ఆయ‌న చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్‌ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు గద్దర్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి అందుకు త‌గిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Spread the love