ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

నవతెలంగాణ-కుభీర్‌
ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయంలో 113 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందేలా చూస్తున్నామన్నారు. గ్రామాలను అబివృద్ధి పర్చి అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నామని తెలిపారు. అనంతరం బెల్గాం గ్రామంలో 20లక్షలతో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ భవనానికి సర్పంచ్‌ శంకర్‌, మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్‌, వైస్‌ ఎంపీపీ మోహినుద్దీన్‌, కుభీర్‌ సర్పంచ్‌ మీరా విజరు కుమార్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్‌, మాజీ జడ్పీటీసీ శంకర్‌ చవాన్‌, డీఆర్‌డీఓ విజయలక్ష్మి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల పీరాజి, తహసీల్దార్‌ విశ్వంబర్‌ పాల్గొన్నారు.

Spread the love