మెట్రో రైలు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్: మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలపై డీపీఆర్, ట్రాఫిక్ స్టడీస్ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో లైన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి మధ్యాహ్నం సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెట్రో రైలు కొత్త మార్గాలకు డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాయదుర్గం – విమానాశ్రయం మెట్రో ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న మార్గాలు… కొత్త ప్రణాళికల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటిలో ఎల్బీ నగర్ – హయత్ నగర్, మియాపూర్ – పటాన్ చెరు, రాయదుర్గం – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎంజీబీఎస్ – ఎయిర్ పోర్ట్ మార్గాలలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పాతబస్తీలో మెట్రో రైలు అంశంపై అక్కడి ప్రజాప్రతినిధులతో చర్చించాలని అధికారులకు సూచించారు. మతపరమైన, చారిత్రక కట్టడాలపై ప్రభావం పడకుండా రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Spread the love