నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి గెలుపుపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణస్వీకారానికి తప్పకుండా వెళ్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. ఏపీ ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అన్నారు. రాహుల్ గాంధీ విస్పష్టంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఈ విషయంపై తమ పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతామని రేవంత్ తెలిపారు.