కోమటిరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్

నవతెలంగాణ – హైదరాబాద్: గత నెల 31న ఊపిరితిత్తుల సమస్యతో మాదాపూర్ యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వైద్యులను కాసేపు మాట్లాడారు. మంత్రికి మెరుగైన చికిత్స అందించాలని, త్వరగా కోలుకునేలా చూడాలని అన్నారు.

Spread the love