కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బైక్ రైడ్

నవతెలంగాణ  – హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిత్యం ప్రజలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఎలగైనా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే ధృడనిశ్చయంతో రాహుల్ గాంధీ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా రాహుల్ గాంధీ లడఖ్ లో పర్యటించారు. అంతేకాక చైనా సరిహద్దుల్లో ఉన్న పాంగాంగ్ సరస్సు వరకు  రాహుల్ గాంధీ బైక్ రైడ్ చేశారు. రాహుల్ గాంధీ శనివారం లడఖ్ లో పర్యటించారు.  ఈ క్రమంలోనే చైనా సరిహద్దుల్లో ఉన్న  పాంగాంగ్ సరస్సుకు బైక్ ను నడుపుకుంటూ వెళ్లారు. మరికొన్ని రోజుల్లో లడఖ్ స్వయం ప్రతిపత్తి అభివృద్ధి మండలికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అక్కడ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పాంగాంగ్ సరస్సుకు బయలు దేరే ముందు.. రాహుల్ మీడియాతో మాట్లాడారు.  “ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటి అని మా నాన్న చెప్పేవారు. అని రాహుల్ గాంధీ అన్నారు. అంతేకాక తాను పాంగాంగ్ సరస్సు వరకు బైక్ పై వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అంతేకాక కాంగ్రెస్ పార్టీ కూడా తన అధికారిక ట్విట్టర్ లో రాహుల్ ఫోటోలను షేర్ చేశారు’.  శనివారం రాత్రి కూడా పాంగాంగ్ సరస్సు వద్దే  రాహుల్ బస చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాక ఆగష్టు 20న రాజీవ్ గాంధీ పుట్టిన రోజును కూడా అక్కడే చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి.

Spread the love