తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…

నవతెలంగాణ – తిరుమల
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (సోమవారం) శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 23 కంపార్టుమెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న (ఆదివారం) శ్రీవారిని 78,818 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.66 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 39,076 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Spread the love