నవతెలంగాణ – ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. లిక్కర్ పాలసీ విచారణ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు, ఈడీకి మధ్య డ్రామా కొసాగుతోంది. విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటికే 8 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే, పలు కారణాలను చూపుతూ విచారణకు ఆయన వెళ్లడం లేదు. దీంతో ఈడీ అధికారులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. తాము ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా, కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న జరిగే కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.