బాగ్ లింగంపల్లిలో సీపీఐ(ఎం) ఇంటింటి ప్రచారం

ముషీరాబాద్ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం.దశరధ్ ఇంటింటి ప్రచారం
ముషీరాబాద్ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం.దశరధ్ ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ హైదరాబాద్: ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్న ముషీరాబాద్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం.దశరథ్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శనివారం బాగ్ లింగంపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలు సేవ కార్యక్రమాలు చేయడానికి తనకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని సీపీఐ(ఎం) ముషీరాబాద్‌ అభ్యర్థి దశరథ్‌ ప్రజలను కోరారు. పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ప్రజా సమస్యలపై, ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, హక్కుల కోసం అనేక పోరాటాలు జరిపి విజయాలు సాధించిందని గుర్తు చేశారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) మరిన్ని పోరాటాలు, సేవా కార్యక్రమాలు జరపడానికి మీరు వేసే ప్రతి ఓటు తోడ్పడుతుందని తెలిపారు.

బాగ్ లింగంపల్లిలో ముషీరాబాద్ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం.దశరధ్ ప్రచారం
ముషీరాబాద్ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం.దశరధ్ ఇంటింటి ప్రచారం

       ముషీరాబాద్‌ నియోజకవర్గంలో డ్రయినేజీ వ్యవస్థ కుప్పకూలిపోయి, మురుగునీటితో అనేక బస్తీలు, కాలనీలను వరద ముంచెత్తుతు న్నద న్నారు. దాంతో ట్రాఫిక్‌ నిలిచిపోతున్నదని తెలిపారు. కరెంటు పోతున్నదన్నారు. ఇతర బలహీనమైన మౌలిక వసతులతో హైదరాబాద్‌ నగరం విశ్వ నగరంగా ఎలా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారఅని తెలి పారు. కాబట్టి ముషీరాబాద్‌ నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు రాములు, జ్యోతి, కార్యకర్తలు నరేందర్ రెడ్డి, వీరయ్య, బస్వపున్నయ్య, రాములు, ధనలక్ష్మి, లక్ష్మి, సుభాషిణి, అజయ్, వీరేశం, అశోక్ , నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love