తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో నిన్న కాస్త తక్కువగానే ఉన్న భక్తుల రద్దీ నేడు (మంగళవారం) మరింత పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి.. క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ వ్యాపించింది. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం స్వామివారిని 66,077 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.30 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 29,193 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

read more..

Spread the love