దళిత బంధు రెండో విడత

– దళిత బంధు రెండో విడత కు తాత్కాలిక బ్రేక్.
– మంజూరి లో కీలకం కానున్న ఎం.పి.డి.ఒ లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల ప్రక్రియ అమలుకు వచ్చిన నేపధ్యంలో దళిత బంధు రెండో విడత కు తాత్కాలిక బ్రేక్ బడింది.అమలు లో ఉన్న పథకం అయినప్పటికీ దీనికీ సంబంధించిన నిధులు కేటాయింపులు జరగలేదని విశ్వసనీయ సమాచారం. మొదటి విడతలో స్వయానా ఎమ్మెల్యే మంజూరి అధారిటీ గా ఉన్న నేపధ్యంలో జరిగిన అవకతవకలు సరిచేయడానికి గానూ ఈ సారి రెండో దఫా మంజూరి అధారిటీ మండల పరిషత్ అభివృద్ది అధికారికి బదలాయింపు జరిగే అవకాశం ఉన్నట్లు అధికారిక భోగట్టా. ఇదిలా ఉండగా అశ్వారావుపేట నియోజక వర్గం నుండి దళిత బంధు మంజూరి జాబితా జిల్లా అధికారులకు అందలేదని తెలుస్తుంది.ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులు అధికారులు స్వీకరించారు. అనంతరం ఆయా నియోజక వర్గాలు ఎమ్మెల్యే ఆదేశానుసారం అన్ని నియోజక వర్గాల నుండి జిల్లా ఉన్నతాధికారులకు అర్హుల జాబితా అందింది.కానీ అశ్వారావుపేట నియోజక వర్గం నుండి లబ్ధిదారుల జాబితా జిల్లా ఎస్.సీ కార్పోరేషన్ అధికారులకు అందలేదని విశ్వసనీయ సమాచారం. కారణం ఏమిటంటే ఈ నియోజక వర్గంలో పెత్తందారీ కులాల అధికార పోరు దళితులకు శాపంగా మారింది.ఈ కారణంగానే అర్హులు జాబితా కొలిక్కి రాలేదు.

అశ్వారావుపేట మండలంలో..
దళిత కుటుంబాలు                                    1550
కులాలు వారీగా దరఖాస్తులు
మాదిగ 463
మాల 350
ఉప కులాలు 05
మొత్తం దరఖాస్తులు 818

దళితులు జనాభా – 2011

పురుషులు 3119
స్త్రీలు 3112
మొత్తం 6231
 దళిత ఓటర్లు  –  2019
పురుషులు 1826
స్త్రీలు 1947
మొత్తం 3773
     అశ్వారావుపేట నియోజక వర్గం నుండి ప్రతిపాదనలు అందలేదు – ఎస్.సి కార్పోరేషన్ ఇ.డి సంజీవరావు
ఎన్నికల నోటిఫికేషన్ నేపధ్యంలో దళిత బంధు అమలుపై ఈ.డి సంజీవరావు ను వివరణ కోరగా అశ్వారావుపేట నియోజక వర్గం నుండి సోమవారం నాటికి అర్హుల జాబితా అందలేదని, నేనే స్వయంగా ఫోన్ ఎమ్మెల్యే పి.ఎ నుండి ఎటువంటి సమాధానం రాలేదని,రాష్ట్ర స్థాయి అధికారులకు పంపే నివేదికలో అశ్వారావుపేట నియోజక వర్గం రిపోర్ట్ నిల్ రిపోర్ట్ గా పాంపాం అని తెలిపారు.
Spread the love