
పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు, సంబంధించిన డీ ఏ లను వెంటనే ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈసందర్భంగా ఖాద్రీ మాట్లాడుతూ గత 2022 జులై, 2023 జనవరి , జులై నెలల డీ ఏ లు బకాయిలు ఉండగా కేంద్ర ప్రభుత్వం మరో డీ ఏ ప్రకటించపోతుందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా పెండింగ్ లో ఉన్న డీఏ లు ఇచ్చి సప్లిమెంటరీ బిల్లులు, సరెండర్ , మెడికల్ బిల్లులు , జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ , ఫైనల్ పేమెంట్, లోన్లు సకాలంలో వచ్చేటట్లు వెంటనే ప్రభుత్వం స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలపైన తగు నిర్ణయాలు తీసుకోని అమలు చేయాలని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ల సమస్యలను పెడచెవిన పెట్టిందనే విషయం ఈ ప్రభుత్వానికి బాగా తెలుసని అన్నారు.ఆ పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా వెంటనే స్పందించి తగు నిర్ణయాలు తీసుకొని ఒక నిర్దిష్ట కాలపరిమితిలో ఇచ్చేటట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు.పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలపై ద్రుష్టి సారించి సగటు ఉద్యోగికి లాభం చేకూరేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.