బీజేపీ టికెట్ ఇవ్వలేదని దేశ్ పాండే ఆత్మహత్య ప్రయత్నం

– సంగారెడ్డిలో ఆందోళన
నవతెలంగాణ- మెదక్ : ప్రాంతీయ ప్రతినిధి బీజేపీ తుది జాబితాలో సంగారెడ్డి నియోజకవర్గ అభ్యర్ధి గా రాజేశ్వర్ దేశ్ పాండే పేరును ప్రకటించారు. ఆయనను నామినేషన్ వేసుకుమని అధిష్టానం చెప్పింది. తీరా నామినేషన్ వేసే సమయానికి దేష్ పాందేకు బదులు పులిమామిది రాజుకు బీ ఫామ్ ఇచ్చారు. ఈ విషయం తెలిసిన డేష్ పాండే rdo అఫీస్ ముందు ఆందోళన చేశారు. టికెట్ ఇస్తానని నన్ను మోషం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి మోసం చేసినందుకు నేను నా కుటుంబం అత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. నేను బ్రాహ్మణ కులం అని, మాకు ఓట్లు పడవని టికెట్ ఇచ్చి తీసుకుంటారా అని నిలదీశారు.

Spread the love