ఆడియన్స్ ని మేమే చెడగొట్టాం..దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

నవతెలంగాణ-హైదరాబాద్ : గత కొన్నాళ్లుగా చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన వారం రెండు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా మూడు, నాలుగు వారాలకు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇటీవల ఓటీటీ డీల్ ముందే ఓకే అయ్యాక సినిమా మొదలు పెడుతున్నారు కొంత మంది. దీంతో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు అంతంత రేట్లు పెట్టుకొని థియేటర్ కి వెళ్లడం ఎందుకని చాలా మంది థియేటర్లకు వెళ్లడమే మానేస్తున్నారు. దానికి తోడు ఈ పాప్ కార్న్, కూల్ డ్రింకుల బాదుడు ఉండనే ఉంది. ఈ అంశం మీద దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ చేసాడు. చిన్న సినిమా ‘రేవు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ..చిన్న సినిమా అని వదిలేయకండి. థియేటర్ కి వెళ్లి చూడండి, ఇటీవల చాలా మంది థియేటర్ కి వచ్చి సినిమాలు చూడట్లేదు. అసలు ఆడియన్స్ ని మేమే చెడగొట్టాము, మీరు ఇంట్లోనే కూర్చోండి, నాలుగు వారాల్లో సినిమా ఓటీటీలోకి వస్తుంది అని మేమే వాళ్ళని చెడగొట్టి ఆడియన్స్ ని థియేటర్స్ కి రాకుండా చేసుకున్నామని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Spread the love